12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు…

12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు

బద్దం ఏల్లారేడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేసిన బావండ్లపల్లి యుగేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వ కార్మికవర్గ వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధిత గోడ ప్రతులను గణేష్ నగర్ లోని బద్దం ఏల్లారెడ్డి భవన్ లో కార్యాలయంలో విడుదల చేసారు. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తులు మరియు అవసరమైన ప్రజా సేవల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం, కార్మిక హక్కులను హరించివేయడం మరియు సామాజిక భద్రత నిరాకరణ, యువత మరియు శ్రామిక ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను పలుచన చేసిన, కార్మిక సంఘాలను బలహీనపరిచి, “వ్యాపారం చేయడం సులభతరం” పేరుతో సంస్థాగతమైన దోపిడీకి కారణమైన నాలుగు కా

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి..

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

గుండాల,నేటిధాత్రి:

 

నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా
ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న మాట్లాడుతూ 12 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రజా అనుకూల చట్టాలను లేకపోగా ప్రజలు వివిధ పోరాటాల రూపంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడమే గొప్ప విజయంగా చెప్పుకుంటుందన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా బిజెపి ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికుల శ్రమదోపిడిని అరికట్టాలని గుండాలలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నగేష్,మెంతిని నగేష్, తాటి కృష్ణ,చేబోతు రవి, సత్తు, ధనరాజ్,గడ్డం లాలయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతా నరసయ్య చిరంజీవి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…

తేదీ. 4.2.2026.
ప్రచురణార్థం…

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బుధవారం బొమ్మకల్ గ్రామంలోని సిమెంట్ గోదాముల వద్ద కార్మికులు సమ్మె వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించడం జరిగినది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగము తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వాటాల అమ్మకం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ఇతర రంగాల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని,
తదితర డిమాండ్లకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో సిమెంట్
హమాలి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిమెంటు గోదాం హమాలి సంగం ఏఐటీయూసీ నాయకులు బాగోతం వీరయ్య, కొమురయ్య, శ్రీనివాస్, ఐలయ్య, రాములు గౌడ్, శ్రీనివాస్ కొమురయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు కార్మికుల నిరసన

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఫిబ్రవరి 12న సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక (జెఎసి)

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి వాటి అమలుకు పూనుకుంది.ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ( ఎస్సిసిడబ్ల్యూ-ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్,హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోండ్ర శంకర్, టీఎస్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.మణిరామ్ సింగ్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.పోశమల్లు,జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే.విశ్వనాథ్ పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు.పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతనాల కోడ్,పని భద్రత పరిస్థితుల కోడ్,సామాజిక భద్రత కోడ్ లను తెచ్చారని విమర్శించారు.ఈ కోడ్ ల వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ లను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు,సౌకర్యాలు లేకుండా చేయడమేనని ఆరోపించారు.సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టకునే హక్కు లేకుండా చేయడం కొరకు మాత్రమే ఈ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు.పరిశ్రమలను ఎప్పుడైనా మూసేయవచ్చు, కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు,కచ్చితంగా ఇవన్నీ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతున్నారని మండిపడ్డారు.రాత్రి పూట కూడా మహిళలను డ్యూటీ చేయించే పద్ధతిని కొత్త చట్టంలో తీసుకొచ్చారు.8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించే విధానాన్ని తీసుకువస్తున్నారు.పిక్సెడ్ టర్మ్,టైంబండ్,ఎంప్లాయిమెంట్ అనేది కొత్త రూపాన్ని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా,ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితిని చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, టీఎస్యుఎస్ రాష్ట్ర నాయకులు సమ్ము రాజన్న, ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జి.రాయమల్లు, 200 మంది వర్కర్స్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version