దేశవ్యాప్త కార్మికుల సమ్మె…

దేశవ్యాప్త కార్మికుల సమ్మె.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తిలో గురువారం దేశవ్యాప్త సమ్మెలో వివిధ సంఘాల నాయకుడు పాల్గొన్నారు. యూనియన్ కల్వకుర్తి జరిగిన సమ్మెలో ప్రగతిశీల రైస్ మిల్ యూనియన్ వర్కర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ.ఆంజనేయులు,అధ్యక్షుడు సాయిబాబు, బాలచంద్, శీను వెంకటయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు వివిధ సంఘ నాయకులు పాల్గొనడం జరిగింది. రైతు సంఘ నాయకులు ఆశ వర్కర్స్ అంగన్వాడి గ్రామపంచాయతీ వర్కర్ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ కార్మికులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేసినటువంటి నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి. రద్దు చేయని వేళలో ఈ సమ్మె ఇంతటితో ఆగదు అని వ్యక్తం చేశారు.

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన..

ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ఏజెంట్ల నిరసన

నర్సంపేట, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నర్సంపేట బ్రాంచ్ ఆఫీస్ ముందు ఎల్ఐసి ఏఓఐ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు,ఏజెంట్లు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపెళ్లి రాంనర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దుచేసి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి,నరేందర్,చంద్రమౌళి,సదానందం,రవీందర్,నర్సంపేట బ్రాంచి అధ్యక్షులు పొనుగొటీ సుధాకర్ రావు, నర్సంపేట బ్రాంచ్ సెక్రటరీ ఎండి సుభానుద్దీన్, జోనల్ నాయకులు మొద్దు రమేష్,గౌరవ అధ్యక్షులు పెండ్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ మర్థ గణేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు సాంబరాతి శ్రీనివాస్,కోశాధికారి కందికొండ రవికుమార్, క్లియర్ అధ్యక్షుడు ఆర్ చంద్రమౌళి ప్రచార కార్యదర్శి అల్లి రవి, డివిజన్ నాయకులు బూర రమేష్, చందు,అమృ, రఘుపతి, కుసుంబ బాబూరావు,కడారి వెంకటేశ్వర్ రావు,ఆనంతుల రమేష్ ముఖ్య సలహాదారుడు నాంపల్లి కొమురయ్య తదితర ఏజెంట్లు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల సమ్మె: కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన…

కార్మిక సంఘాల సమ్మె: కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో కార్మికులు గురువారం అంబేద్కర్ విగ్రహం నుండి సమ్మె చేపట్టారు. హెచ్ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో భారీ ర్యాలీ నిర్వహించారు. అల్ఫ్ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాకుల్, గోవర్ధన్ రెడ్డి, షుగర్ శ్రీనివాస్, అల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు కార్మికుల నిరసన

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఫిబ్రవరి 12న సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక (జెఎసి)

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి వాటి అమలుకు పూనుకుంది.ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ( ఎస్సిసిడబ్ల్యూ-ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్,హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోండ్ర శంకర్, టీఎస్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.మణిరామ్ సింగ్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.పోశమల్లు,జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే.విశ్వనాథ్ పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు.పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతనాల కోడ్,పని భద్రత పరిస్థితుల కోడ్,సామాజిక భద్రత కోడ్ లను తెచ్చారని విమర్శించారు.ఈ కోడ్ ల వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ లను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు,సౌకర్యాలు లేకుండా చేయడమేనని ఆరోపించారు.సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టకునే హక్కు లేకుండా చేయడం కొరకు మాత్రమే ఈ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు.పరిశ్రమలను ఎప్పుడైనా మూసేయవచ్చు, కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు,కచ్చితంగా ఇవన్నీ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతున్నారని మండిపడ్డారు.రాత్రి పూట కూడా మహిళలను డ్యూటీ చేయించే పద్ధతిని కొత్త చట్టంలో తీసుకొచ్చారు.8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించే విధానాన్ని తీసుకువస్తున్నారు.పిక్సెడ్ టర్మ్,టైంబండ్,ఎంప్లాయిమెంట్ అనేది కొత్త రూపాన్ని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా,ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితిని చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, టీఎస్యుఎస్ రాష్ట్ర నాయకులు సమ్ము రాజన్న, ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జి.రాయమల్లు, 200 మంది వర్కర్స్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version