12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి…

తేదీ. 4.2.2026.
ప్రచురణార్థం…

12న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.

వాల్ పోస్టర్ ఆవిష్కరణ

కరీంనగర్, నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు ప్రజా, వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని ఫిబ్రవరి 12వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని బుధవారం బొమ్మకల్ గ్రామంలోని సిమెంట్ గోదాముల వద్ద కార్మికులు సమ్మె వాల్ పోస్టర్ ను ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించడం జరిగినది. ఈసందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ఉపాధ్యక్షులు జంగము తిరుపతి యాదవ్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను వాటాల అమ్మకం అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పెంచాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలి ఇతర రంగాల కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని,
తదితర డిమాండ్లకై ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో సిమెంట్
హమాలి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సిమెంటు గోదాం హమాలి సంగం ఏఐటీయూసీ నాయకులు బాగోతం వీరయ్య, కొమురయ్య, శ్రీనివాస్, ఐలయ్య, రాములు గౌడ్, శ్రీనివాస్ కొమురయ్య, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version