సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
గుండాల,నేటిధాత్రి:
నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా
ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్న మాట్లాడుతూ 12 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రజా అనుకూల చట్టాలను లేకపోగా ప్రజలు వివిధ పోరాటాల రూపంలో సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడమే గొప్ప విజయంగా చెప్పుకుంటుందన్నారు. ఫిబ్రవరి 12న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నాలుగు లేబర్ కొడ్లకు కు వ్యతిరేకంగా బిజెపి ఆలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను కార్మికుల శ్రమదోపిడిని అరికట్టాలని గుండాలలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో గోడపత్రికలు ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు గడ్డం నగేష్,మెంతిని నగేష్, తాటి కృష్ణ,చేబోతు రవి, సత్తు, ధనరాజ్,గడ్డం లాలయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు చింతా నరసయ్య చిరంజీవి విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
