కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి…

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె

పట్టణంలో కార్మిక వర్గం భారీ ప్రదర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నర్సంపేట పట్టణంలో బిఆర్టియు, ఏఐఎఫ్టియు (న్యూ), ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు, టియుసి సంఘాల ఆధ్వర్యంలో* వరంగల్ రోడ్డు కూడలి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం యాకూబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐఎఫ్టియు
న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేష్, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు,ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గుంపేల్లి మునీశ్వరు,హమాలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మినారాయణలు మాట్లాడుతూ ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్పొరేటు బహుళ జాతి యాజమాన్యాలకు ఉపయోగపడే విధంగా 4 లేబర్ కోడులను తీసుకువచ్చారని కనీస వేతనం అమలు చేయాలని, కార్మికుల హక్కుల రక్షణ కోసం ఉన్న చట్టాలను సవరణలు చేయడం సరికాదని రైతాంగం హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న విధంగా కార్మికుల కూడా ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్ ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కలువల లలిత కార్యదర్శి సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి కందికొండ రాజు, ఆయా సంఘాల నాయకులు రాజు, నాగులు,మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్ల రద్దుకు కార్మికుల నిరసన

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఫిబ్రవరి 12న సమ్మెను విజయవంతం చేయండి

సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక (జెఎసి)

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి వాటి అమలుకు పూనుకుంది.ఈ లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా సింగరేణి ఐక్య కార్మిక సంఘాల వేదిక ఆధ్వర్యంలో నస్పూర్ మండలంలోని సీసీసీ కార్నల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి ( ఎస్సిసిడబ్ల్యూ-ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం అధ్యక్షత వహించారు.ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి. శ్రీనివాస్,హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు కోండ్ర శంకర్, టీఎస్యూఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరటి రాజన్న, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు టి.మణిరామ్ సింగ్, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎం.పోశమల్లు,జిఎల్బికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కే.విశ్వనాథ్ పాల్గొని నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం మొత్తం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దుచేసి,నాలుగు లేబర్ కోడ్ల ను తీసుకురావడం జరిగిందని మండిపడ్డారు.పారిశ్రామిక సంబంధాల కోడ్,వేతనాల కోడ్,పని భద్రత పరిస్థితుల కోడ్,సామాజిక భద్రత కోడ్ లను తెచ్చారని విమర్శించారు.ఈ కోడ్ ల వల్ల కార్మికులు అనేక హక్కులను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర ప్రభుత్వం ఈ కోడ్ లను తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు,సౌకర్యాలు లేకుండా చేయడమేనని ఆరోపించారు.సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టకునే హక్కు లేకుండా చేయడం కొరకు మాత్రమే ఈ కోడ్ లను తీసుకురావడం జరిగిందన్నారు.పరిశ్రమలను ఎప్పుడైనా మూసేయవచ్చు, కార్మికులను ఎప్పుడైనా తొలగించవచ్చు,కచ్చితంగా ఇవన్నీ చేసేటటువంటి ప్రక్రియని చేపడుతున్నారని మండిపడ్డారు.రాత్రి పూట కూడా మహిళలను డ్యూటీ చేయించే పద్ధతిని కొత్త చట్టంలో తీసుకొచ్చారు.8 గంటల నుంచి 12 గంటల వరకు పని చేయించే విధానాన్ని తీసుకువస్తున్నారు.పిక్సెడ్ టర్మ్,టైంబండ్,ఎంప్లాయిమెంట్ అనేది కొత్త రూపాన్ని తీసుకొచ్చి పర్మనెంట్ ఉద్యోగం అనేది లేకుండా,ఉద్యోగానికి భద్రత లేని పరిస్థితిని చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో కార్మిక వర్గం అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్ ఎం ఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, టీఎస్యుఎస్ రాష్ట్ర నాయకులు సమ్ము రాజన్న, ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు జి.రాయమల్లు, 200 మంది వర్కర్స్ పాల్గొన్నారు.

లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన…

లేబర్ కోడ్ లకు వ్యతిరేకం గాకార్మిక సంఘాల నిరసన

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్య తిరేక విధానాలు మానుకో వాలి

శాయంపేట నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టపరిచే విధంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రం లో ఐఎన్ టియుసి మండల అధ్యక్షుడు మారేపల్లి రాజేందర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోరాటాలు నిర్వహిం చి త్యాగాలు చేసి సాధించు కున్న కార్మిక చట్టాలను నాలు గు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్పొరేట్లకు, భూస్వాములకు ఊడిగా ఊసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు పోతున్నదని విమర్శించారు. అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన, గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం జరిగే విధంగా, ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు దెబ్బతీసే నాలుగు లేబర్ చట్టాలను వెనక్కి తీసు కోవాలి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి నేటి వరకు కూడా కార్మికులకు నానా విధాలుగా కష్టాలు ఎదురవుతున్నాయి. వేత నాలు నిర్ణయించే అంశాన్ని యజమాన్యాలకు వదిలేయడం ఎంతవరకు సంబంధం సబమని ప్రశ్నించారు. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు వినాశనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపె నీలలో పనిచేస్తున్న, గతంలో 8గంటలు మాత్రమే పనిచేసేది. ఈ చట్టాల ద్వారా 12గంటలు చేయాలి. యాజమాన్యానికి నచ్చితే పని చేయించుకుంటా రు, నచ్చకపోతే వారిని తీసేస్తా రు. యాజమాన్యానికి స్వేచ్ఛ ను కలిగించిన నరేంద్రమోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కితీసుకోక పోతే కేంద్రప్రభుత్వానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version