12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు…

12న దేశవ్యాప్త సమ్మెకు ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు

బద్దం ఏల్లారేడ్డి భవన్ లో పోస్టర్ విడుదల చేసిన బావండ్లపల్లి యుగేందర్

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

కేంద్ర ప్రభుత్వ కార్మికవర్గ వ్యతిరేక, యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధిత గోడ ప్రతులను గణేష్ నగర్ లోని బద్దం ఏల్లారెడ్డి భవన్ లో కార్యాలయంలో విడుదల చేసారు. ఈసందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ ఆస్తులు మరియు అవసరమైన ప్రజా సేవల ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఫలితంగా ఉద్యోగాలు కోల్పోవడం, కార్మిక హక్కులను హరించివేయడం మరియు సామాజిక భద్రత నిరాకరణ, యువత మరియు శ్రామిక ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను పలుచన చేసిన, కార్మిక సంఘాలను బలహీనపరిచి, “వ్యాపారం చేయడం సులభతరం” పేరుతో సంస్థాగతమైన దోపిడీకి కారణమైన నాలుగు కా

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: కార్మిక సంఘాలు

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
.
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు

నర్సంపేట, నేటిధాత్రి:

కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టం జరిగే నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని బుధవారం అఖిలపక్ష కార్మిక సంఘాలైన బిఆర్టియు,ఏఐటియుసి, ఐఎఫ్టియు, మాస్ లైన్ ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, కమిటీ కార్యదర్శి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సింగరకొండ మాధవ శంకర్ లకు సమ్మె నోటీసులు అందజేశారు.ఈసందర్భంగా బి.ఆర్.టి.యు జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు,హమలీ రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మీనారాయణ.ఏ ఐ టి యు సి సివిల్ సప్లై రాష్ట్ర నాయకులు గుంపెల్లి మునీశ్వర్,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ మాట్లాడుతూ దేశంలో ఉన్న బడా కార్పోరేట్ శక్తులు దోపిడీ చేసుకోవడానికి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయని సాకుతో కేంద్ర ప్రభుత్వంతో మికకత్ ఆయ్యి కార్మిక చట్టాల సవరణ చేయడం సరికాదని ఆరోపించారు.కార్మిక వర్గం ఒకటై ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెరమండ్ల రవి, రాములు, జనార్ధన్, ప్రసాద్, మల్లయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version