పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి
జహీరాబాద్ నేటి ధాత్రి:
పవిత్ర హజ్ యాత్రకు వెళ్తున్న బీ ఆర్ఎస్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్ హజ్ యాత్రకు వెళుతున్న శుభసందర్భంగా పూలమాల శాలవాతో సత్కరించి, హజ్ యాత్ర ప్రయాణం సురక్షితంగా సఫలంగా సాగాలని మాజీ మంత్రివర్యులు హరీష్ రావు,డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని పవిత్ర స్థలంలో దేవునితో ప్రార్థించాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.రాష్ట్ర దేశ ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా ప్రార్ధనలు చేయాలని తెలిపారు.