బాల నగర్ ఎస్సై తిరుపాజి.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉచిత సమ్మర్ కోచింగ్ కరాటే క్యాంపును బాలానగర్ ఎస్సై తిరుపజీ, ఉచిత కరాటే క్యాంపు మాస్టర్ రవికుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసికొల్లాసం, శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ క్యాంపులో శిక్షణతో పాటు కరాటే, నేర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ,వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తిరుపజీ విద్యార్థులకు మెమోలను, బెల్ట్ లను ప్రదానం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో కరాటే మాస్టారు రవి కుమార్, అరేళ్ళ యాదయ్య, వేపురి నర్సిములు, నవీన్, మరియు బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ వినా, భాను దీపు సద్విక్, సోడొకన్ కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.