ఉచిత కరాటే శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

బాల నగర్ ఎస్సై తిరుపాజి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రోజు ఉచిత సమ్మర్ కోచింగ్ కరాటే క్యాంపును బాలానగర్ ఎస్సై తిరుపజీ, ఉచిత కరాటే క్యాంపు మాస్టర్ రవికుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానసికొల్లాసం, శారీరక దృఢత్వానికి ఆటలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ క్యాంపులో శిక్షణతో పాటు కరాటే, నేర్పించనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ రవికుమార్ మాట్లాడుతూ,వేసవి సెలవుల్లో నచ్చిన ఆటలో ఆరితేరేలా సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ తిరుపజీ విద్యార్థులకు మెమోలను, బెల్ట్ లను ప్రదానం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో కరాటే మాస్టారు రవి కుమార్, అరేళ్ళ యాదయ్య, వేపురి నర్సిములు, నవీన్, మరియు బ్లాక్ బెల్ట్ మాస్టర్స్ వినా, భాను దీపు సద్విక్, సోడొకన్ కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version