తన తండ్రి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించిన కురుమ సంఘం మండల అధ్యక్షుడు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కీర్తిశేషులు ఎల్లయ్య గారి జ్ఞాపకార్థం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో చలివేంద్రం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఇతర గ్రామ ప్రజలకు మా వంతుగా చలివేంద్రం ప్రారంభించి ఉపాధి హామీ కూలీలకు త్రాగునీరు సదుపాయాన్ని కల్పించామని అలాగే రానున్న ఎండాకాలంలో ప్రజల కు ఇబ్బంది కలగకుండా నా వంతుగా త్రాగునీటి సదుపాయాన్ని కల్పిస్తున్నానని మండల కేంద్రం నుంచి తంగళ్ళపల్లి వచ్చే ప్రజలు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు చలివేంద్రం ప్రారంభం సందర్భంగా ఉపాధి హామీ కూలీలు కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో కురుమ సంఘం మండల అధ్యక్షులు ఎగుర్ల కరుణాకర్ ప్రశాంత్.సంఘ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!