ప్రతివ్యూహంతో చైనాకు చెక్ పెడుతున్న భారత్
ఫలితం భారత్ నిర్దేశిందిగానే వుంటుంది
ప్రపంచ దేశాలకు భారత్ అత్యంత అవసరం
భారత్ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు
తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్పై చైనా అక్కసు
యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్
భారత్ వ్యూహంతో పాక్ ఉక్కిరిబిక్కిరి
చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి
చివరకు భారత్కు అనుకూలంగానే రానున్న ఫలితం
పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల కొన్ని అ నుబంధ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. పహల్గామ్ సంఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఉగ్రవాదుల ‘ఉత్పత్తి’ కేంద్రాలపై జరిపిన దాడులు విజయవంతం కావడమే కాదు, ప్రపంచానికి భారత్ను ఒక కొత్తకోణంలో చూపాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా, పెట్టుబడులకు అనుకూల దేశంగా తనను తాను నిరూపించుకున్న భారత్ ఇప్పుడు సీమాంతర ఉ గ్రవాదం పీచమణచడంలో మరే ఇతర దేశం అనుసరించని రీతిలో వ్యవహరించి పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి తన సత్తాలోని ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి చూపింది. ఒక లక్ష్య సాధనలో వ్యవస్థల సమన్వయం ఎంత పకడ్బందీగా వుండాలనేది చెప్పడంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా వ్యవహరించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ యుద్ధనీతిలో తనకు తిరుగులేదని రుజువుచేసింది. ఇక అసలు విషయానికి వస్తే, కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అప్రతిహతంగా ప్రపంచ మార్కెట్లను శాసించిన చైనా, తనను సవాలు చేసే రీతిలో భారత్ ఎదగడం ఎంతమాత్రం తట్టుకోలేక పోతున్నది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం, యూరప్ సహా ఇతర దేశాల మార్కెట్లలో ప్రవేశం క్రమంగా కుం చించుకు పోతున్న తరుణంలో, తన మార్కెట్ను క్రమంగా ఆక్రమిస్తున్న భారత్పై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా విచిత్ర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కోపంతో మనపై దాడి చేయలేదు, అట్లాగని అక్కున చేర్చుకోలేదు, ఇదే సమయంలో విస్మరించనూ లేదు. విరోధాభాసలాంటి ఈ పరిస్థితిని అధిగమించి భారత్పై కక్ష తీర్చుకోవాలంటే దానికి వున్న మార్గం పాకిస్తాన్! తాను ఏది చేయాలనుకున్నా పాక్ ద్వారానే సాధించడానికి ప్రయత్నిస్తుంది. ‘డ్రాగన్’ ఈ జిత్తులమారితనానికి ‘ఏనుగు’ (భారత్) రెచ్చిపోవడంలేదు. ఆగ్రహంతో ఊగిపోవడంలేదు కూడా. కానీ ఒక పద్ధతి ప్రకారం తనదైన వ్యవహారశైలితో నిశ్శబ్దంగా పనిచేసుకొని పోతూ, క్రమంగా ఎక్కడికక్కడ ‘నట్లు’ బిగించుకుంటూ వూపిరి ఆడకుండా చేస్తున్నది. దీన్ని ‘డ్రాగన్’, ‘ఏనుగు’ అనే దిగ్గజ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న ‘ప్రచ్ఛన్న’ పోరాటం అనుకోవచ్చు.
పాక్ దుస్సాహసం వెనుక ‘అండ’
పహల్గాం సంఘటన వెనుక పాకిస్తాన్ హస్తమున్నదనేది తిరుగులేని సత్యం. అమాయకులైన ప ర్యాటకులను దారుణంగా చంపేయడం ద్వారా భారత ప్రభుత్వాన్ని, ప్రజలను రెచ్చగొట్టాలన్నది దాని ఉద్దేశం. అయితే ఇక్కడ పాక్ ఆశించిన స్థాయిలో ఉగ్రవాదులు వ్యవహరించలేకపోయారు. మరి పాకిస్తాన్ ఇటువంటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టిందనేది సహజంగా ఉదయించే ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గతంలో చేపట్టిన ఉగ్రవాద చర్యలకు ప్రతిక్రియ ఏవిధంగా ఉన్నదీ పాకిస్తాన్కు అనుభవైకమే. మళ్లీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడితే పరిస్థితి దారుణంగా వుంటుందనేది కూడా పాక్కు తెలియంది కాదు. దేశంలో అల్లకల్లోలం చెలరేగుతున్నప్పుడు నియంతలు, సైనిక పాలకులు సాధారణంగా బాహ్య శత్రువును చూపి దేశాన్ని ఐక్యంగా వుంచ డానికి యత్నిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్ కూడా అదే చేసి ప్రజల దృష్టిని మరల్చాలనుకున్న వ్యూ హం బూమరాంగ్ అయింది. మోదీ ప్రభుత్వం ఇంతటి తీవ్రస్థాయిలో స్పందిస్తుందని బహుశా ఊహించి వుండకపోవచ్చు. ఈ ప్రతిక్రియను తట్టుకునే ఆర్థిక సామర్థ్యం పాక్కు లేదు. సైనిక సామర్థ్యం అంతకంటే లేవు. అయినప్పటికీ కొరివితో తలగోక్కోవడానికి సిద్ధపడిరదంటే దానికి ఏదో ఒకరకమైన మద్దతు కచ్చితంగా వున్నట్టే! అదే చైనా!
చైనాభారత్ సంబంధాల్లో సందిగ్ధత
2020లో గల్వాన్ సంఘటన తర్వాత భారత్ాచైనాల మధ్య దారుణంగా దెబ్బతిన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే గాట్లో పడుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వైరం కూడా చైనాను దిగొచ్చే లా చేసింది. మానససరోవర యాత్ర తిరిగి ప్రారంభం, దౌత్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. పైకి సజావుగా, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కనిపిస్తున్నా, చైనా హృదయాంతరాళాల్లో ఎక్కడో వ్యక్తం చేయలేని భయంతో కూడిన ఆందోళన! వేగంగా ఎదుగుతున్న భారత్ ముందు ఇక ఎంతోకాలం తన ఆధిపత్యం నిలవదన్న సత్యం దాని మెదడును తొలిచేస్తోంది. మరోవైపు భారత్ను నిరోధించలేదు అట్లాగని విస్మరించనూ లేదు. ఇదొక విచిత్ర సందిగ్ధ పరిస్థితి! నిజం చెప్పాలంటే 21వ శతాబ్దంలో భారత్ాచైనాల మధ్య ఎంతమాత్రం పొంతన లేని దశ కొనసాగింది. చైనా ఒక స్థాయికి చేరుకోగా, భారత్ ఇంకా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది. 2010 తర్వాత మౌలికసదుపాయాలు, సాంకేతికరంగం మరియు వాణిజ్య రంగాల్లో భారత్ను పూర్తిగా వెనక్కు నెట్టేసింది. ఇక భారత్ను ప ట్టించుకోవాల్సిన అవసరం లేదనకుంటున్న తరుణంలో 2017లో డోక్లాం సంఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. భారత సైన్యం ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడేసరికి, చైనా వెనక్కు త గ్గాల్సి వచ్చింది. 2020లో జరిగిన గల్వాన్ సంఘనలో భారత్ తన కార్యశీలతను రాజకీయ దృఢత్వాన్ని విస్పష్టంగా ప్రదర్శించడం చైనాను కలవర పరచింది. ఆ తర్వాత కోవిడ్ మహమ్మారి ఒక్కసారి విజృంభించడంతో చైనాతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయా యి. ఈ అఘాతం నుంచి భారత్ చాలా వేగంగా బయటపడగా, చైనా తన చురుకుదనాన్ని కో ల్పోయి వెనుకబడిరది. ముఖ్యంగా ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోగా, ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేసింది. మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, రుణ సంక్షోభం చైనాను అతలాకుతలం చేశాయి. అప్పటివరకు భారత్ను తనతో సరిసమాన దేశంగా చైనా ఎప్పుడూ పరిగణించలేదు. కేవలం ప్రాంతీయ శక్తి స్థాయికే పరిమితం చేసి తాను గ్లోబల్ స్థాయికి ఎదగడానికి అమెరికాతో పోటీపడటం మొదలుపెట్టింది. కానీ అమెరికాతో పోటీపడాలన్న ఆకాంక్ష మాట అట్లా వుంచి, భారత్ వేగంగా పుంజుకొనడంతో, ప్రపంచ యవనికపై భారత్ాచైనాలను సరిసమానంగా చూడటం మొదలైంది. 2025లో ట్రంప్ హయాం వచ్చిన త ర్వాత వాణిజ్య యుద్ధం మొదలుకావడంతో చైనా పరిస్థితి మరింత తల్లక్రిందులైంది. ఈ వాణిజ్య యుద్ధంలో రెండుదేశాలు నష్టపోయినప్పటికీ, దెబ్బ అధికంగా తగిలింది చైనాకే! మొత్తం వాణిజ్య సరఫరా శృంఖలాలు దెబ్బతినడం, దేశంలో ఉత్పత్తుల నిల్వలు అమాంతం పెరిగిపోవడం,మార్కెట్ల కొరతతో చైనా ఆర్థికంగా అతలాకుతలమైంది.
ప్రత్యామ్నాయంగా భారత్
ప్రతి లావాదేవీలో తనకు లాభం లేకుండా అడుగు ముందుకేయని అమెరికా, ఈ వాణిజ్యయు ద్ధంలో ముందుకే వెళ్లడానికి ప్రధాన కారణం భారత్ ప్రత్యామ్నాయంగా కనబడటం! అమెరికా వ్యూహాత్మక అవసరాలు తీర్చే స్థితిలో భారత్ వుండటంతో, చైనాపై ఒత్తిడి పెరిగింది. భారత్కు వాణిజ్యపరంగా విస్తృతమవుతున్న సరఫరా శృంఖల వ్యవస్థ, భౌగోళిక సమతుల్యతను సాధించ డం వంటి అంశాలను చైనా మీడియా సంస్థలు క్రమంగా గుర్తించడం మొదలైంది. కేవలం భారత్ వుండటం వల్లనే అమెరికా తనను ఒక చట్రంలో బిగించగలుగుతోందన్న సత్యం కూడా చైనాకు అర్థమవసాగింది. ఈ నేపథ్యంలో తనకు పొరుగునే వుంటూ, తన ఆధిపత్యాన్ని సవాలు చే స్తూ, గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న భారత్ ఒక పెద్ద సవాలుగా మారింది. దీన్ని ఏదోవిధంగా కట్టడి చేయకపోతే నిండా మునగడం ఖాయమన్నది కూడా అవగతమైంది.
1980 దశకంలో చైనా ఎదుగుదలకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్యదేశాలు ఎంతగానో స హకరించాయి. కానీ భారత్ పరిస్థితి అదికాదు. తాను పశ్చిమదేశాల ప్రభావానికి లోనుకాకుండాస్వతంత్రంగా, తన సొంత పంథాలో ముందుకెళుతూ ఎదుగుతోంది. స్వతంత్రంగా ఎదుగుతున్నభారత్ను కట్టడిచేయడం చైనాకు సాధ్యంకాని పని! ఒకవేళ అట్లా చేయాలనుకుంటే భారత్`యుఎస్లు మరింత సన్నిహతమవుతాయి. సైనికంగా బెదిరిద్దామను కుంటే, డోక్లామ్, గల్వాన్ సం ఘటనలు చైనాకు తన పరిమితేంటో స్పష్టం చేశాయి. మరో సంఘర్షనకు దిగడమంటే ఆత్మహ త్యా సదృశమేనన్న సంగతి చైనాకు బాగా తెలుసు.
భారత్ సహకారం తప్పనిసరి
ఈ నేపథ్యంలో అమెరికాను పక్కనబెట్టే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తే ప్రస్తుత దుస్థితినుంచి బయటపడవచ్చు. అందుకు బ్రిక్స్ వంటి వేదికలు అవసరం. ఈ వేదికను ఉపయోగించుకొని బ్రిక్స్కు ప్రత్యేక కరెన్సీ రూపకల్పన, డాలర్కు ప్రత్యామ్నాయ చెల్లింపుల వి ధానాన్ని అమల్లోకి తేవడం వంటి ప్రక్రియలు చేపట్టాలి. ఇందుకు మళ్లీ భారత్ సహకారం తప్పనిసరి. ఇండియా ముందుకు రాకపోతే చైనా వ్యూహాలు చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే వాణిజ్యపరంగా భారత్ లేకుండా, యు.ఎస్.కు ప్రత్యామ్నాయంగా అనుసరించే మార్గాలను ప్రపంచం విశ్వసించదు. రష్యాకు ఇది బాగా అర్థమైంది. చైనాకు తెలిసొచ్చింది. అయినప్పటికీ చై నాలోని అహంకారం భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలనే కోరుతుంది. ఇందుకోసం కొంత రిస్క్ను భరించడానికి కూడా సిద్ధమే! వేగంగా ఎదుగుతున్న భారత్ తనకు పెను సవాలుగా మారక తప్పదు. అట్లాగని పశ్చిమదేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని నిరోధించాలంటే భారత్ సహాయం తప్పదు! అందువల్లనే మనదేశంపై దాడిచేయలేదు, అట్లాగని కౌగిలించుకోనూ లేదు, ఇదేసమయంలో విస్మరించడం అసలు సాధ్యమూ కాదు. ఈ విచిత్రపరిస్థితి నేపథ్యంలోనే తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పాకిస్తాన్ను పావుగా ఉపయోగించుకొని భారత్ను దెబ్బకొట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
పహల్గాం సంఘటనలో పాక్కు మద్దతు
వ్యూహాత్మకంగా ఇటువంటి జటిల పరిస్థితిలో, పాకిస్తాన్ను ఒక ఉపకరణంగా వాడుకునే సాను కూలత చైనాకు లభించింది. పహల్గాం సంఘటనలో పాకిస్తాన్కు కేవలం మద్దతివ్వడమే కాదు, మనదేశంలోకి పాక్ చొరబాట్లకు గట్టి మద్దతునిస్తోంది. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు తేలింది. ముఖ్యంగా హువావే ఉపగ్రహ ఫోన్లు, చైనాకు చెందిన అత్యాధునిక ‘ఆల్ట్రాసెట్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ’ ఈ ఉగ్రవాదులకు అందు బాటులోకి రావడం గమనార్హం. ఈ సాంకేతిక పరిజ్ఞానం తమను గుర్తించకుండా సహాయపడు తుంది. ఈ ప్రత్యేక ఉపకరణాలను చైనా కంపెనీలు తయారుచేశాయి. వీటిని పాక్ సైన్యం ఉపయోగిస్తుంటుంది. ఇవి సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ స్టేషన్ల ఫ్రీక్వెన్సీకి అను సంధానమై పనిచేస్తుంటాయి. వీటి సహాయంతో కుదించిన సమాచారాన్ని చైనా ఉపగ్రహాల ద్వారా పాకిస్తాన్కు అందజేస్తుంటారు. కేవలం సైన్యానికి పరిమితమయ్యే ఈ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం, కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే మిలిటెంట్ల చేతికి రావడం చైనా అధికార్లకు తెలియదంటే అంతకంటే అమాయకత్వం మరోటుండదు. దౌత్యపరంగా పాకిస్తాన్కు పూర్తిస్థాయి మద్దతునిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్ మిలిటెంట్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించనీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. అంతేకాదు పహల్గాం సంఘటనకు పాక్ మిలిటరీకి సంబంధమున్నదన్న సంగతి స్పష్టమైనా, పాకిస్తాన్ చెబుతున్న ‘నిష్పాక్షిక విచారణ’కు మద్దతివ్వడం గమనార్హం. అంతకంటే మరో ముఖ్య విషయమేంటంటే, పాకిస్తాన్ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే తాము అండగా నిలుస్తామని చైనా వ్యూహకర్త విక్టర్ గావో పేర్కొనడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
యుద్ధం కోరుకుంటున్న దేశాలు
నిజం చెప్పాలంటే ప్రంపంచంలోని ప్రతి బలీయమైన దేశం పైకి ఎన్ని మాటలు చెప్పినా అంతర్గతంగా భారత్`పాక్ల మధ్య యుద్ధం రావాలనే కోరుకుంటున్నాయి. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయి, ప్రపంచంలో భారత్`పాకిస్తాన్ అనే స్థాయికి దిగజారాలన్నది చైనా కోరిక! ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్ను తనతో సమానంగా పరిగణించడం చైనాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. పాకిస్తాన్తో యుద్ధం వస్తే, భారత్ తనతో బేరసారాలాడే బలీయతను కోల్పోయి, కాళ్లబేరానికి వస్తుందన్నది అమెరికా అంచనా. ఇక రష్యా విషయానికి వస్తే ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంలో ఏకాకిగా మారిన తాను, ప్రస్తుతం భారత్కు నమ్మకమైన మిత్రుడుగా కొనసాగుతు న్నప్పటికీ మరో భౌగోళిక రాజకీయ సంక్షోభంలోకి తలదూర్చి మరింత ఒంటరి కావడానికి ఇష్ట పడటం లేదు. ఇక పాకిస్తాన్కు ఇప్పుడు యుద్ధం అత్యవసరం. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రిగ్గర్ను నొక్కేసింది. పదేపదే భారత్ను రెచ్చగొడుతోంది. యుద్ధం వస్తేనే తనకు మద్దతిస్తామ న్న దేశాలనుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉన్న సైన్యాన్ని సరి హద్దులకు తరలించడం దానికి తలకు మించిన భారంగా మారింది. భారత్ ఆలస్యం చేసినకొద్దీ,తరలించిన సైన్యం యుద్ధసన్నద్ధత నిర్వహణకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్ మరింత దిగజారే పరిస్థితి ఏర్పడక మానదు. ఆవిధంగా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా పాక్ ‘రక్తమోడక’ తప్పదు. భారత్ను ‘వెయ్యి గాయాలతో రక్త మోడిస్తాం’ అని ప్రతిజ్ఞ చేసిన పాక్ ఇప్పుడు తాను అదే దుస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకనే పాకిస్తాన్ ప్రతి చిన్న విషయానికి భారత్ సహనాన్ని పరీక్షించే రీతిలో రెచ్చగొడుతోంది.
భారత్ను తక్కువగా అంచనా వేస్తున్న ప్రపంచం
నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలు భారత్ అనుసరించే భౌగోళిక రాజకీయాన్ని చాలా తక్కువగాఅంచనా వేస్తున్నాయి. రష్యా`చైనా ఒకవైపు, పశ్చిమ దేశాలను మరోవైపు ఏ కారణం లేకుండా నే మనదేశం అయోమయంలో వుంచుతుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. బ్రిక్స్ నుంచి క్వాడ్ వరకు భారత్ సభ్యురాలే అన్న విషయం మరచిపోకూడదు. అన్ని భౌగోళిక రాజకీయ కూటముల్లో భారత్ భాగస్వామి. అందువల్ల ఏ దేశమూ భారత్ లేకుండా ముందడుగు వేయడంసాధ్యంకాదు. అట్లాగని ఏకాకినీ చేయలేవు. ఒకరకంగా చెప్పాలంటే భారత్ రెండంచుల కత్తిపై చిన్న గాయం కాకుండా నడిచే రీతిలో దౌత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్ వేసే ప్రతి అడుగులో భావావేశం వుండదు, కేవలం ఒక పద్ధతిప్రకారం, వ్యూహాత్మకత మాత్రమే వుంటుంది. పాకిస్తాన్పై నీటి ఒత్తిడిని క్రమంగా పెంచుతూ వచ్చింది. 2016 నుంచి సింధూనది ఉపనదులపై భారత్ డ్యామ్లు నిర్మిస్తూ వస్తున్న సంగతి కొందరికే తెలుసు. ఇప్పుడు ఈ నీటిపై ఆధిపత్యం సాధించడం ద్వారా, పాక్లో వ్యవసాయాన్ని, విద్యుత్ను, ఆహార భద్రతను నియంత్రించవచ్చు. ఇదే సమయంలో భారత సైన్యం ఫార్వర్డ్ పోస్టుల్లో కొనసాగుతాయి. దీని వల్ల పాక్ సైన్యం అనుక్షణం అప్రమత్తంగా వుండాలి. ఇది దానికి ఆర్థిక భారం! ఇదేసమయంలో భారత దౌత్యప్రతినిధులు తమపని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ దేశాల ఒత్తిడి కేవలం పాకిస్తాన్పై మాత్రమే కాదు దాని మద్దతుదార్లపై కూడా బాగా పెరిగిపోయింది. ఇక చైనా విషయానికి వస్తే, ఇప్పటికే పన్నుల యుద్ధంలో కుదైలైన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో, ఈ పాకిస్తాన్ ‘వ్యూహాత్మక భారాన్ని’ మోసే పరిస్థితిలో లేదు. ఇది మరింతకాలం కొనసాగితే చైనా పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇప్పటికే యూరప్, అమెరికా, రష్యాల్లో జాతీయవాద భావాలు పెరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యవస్థపై కూడా భారత్ తన ముట్టడిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్పై సైనిక చర్య వుండవచ్చు. ఎన్నో భారమైన నిద్రలేని రాత్రులు గడిచిన తర్వాత, నీ రు`ఆహారం కొరత ఏర్పడినప్పుడు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత, నిరంతరం సైనికుల తరలింపు వల్ల సైన్యం బలహీనమైనప్పుడు దాని నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడుభారత్ చేసే దాడి తీవ్రతను అంచనా వేయడానికుండదు. పాకిస్తాన్ను ఒక పేపర్ మాదిరిగా మడత పెట్టేస్తుంది. అప్పుడు ప్రపంచానికి తామకు కావలసింది లభిస్తుంది. కానీ అది భారత్ నిర్దే శించిన పరిధిలో మాత్రమే వుంటుంది!