శ్రీ పోచమ్మ నాగుల ఆలయం దర్శించిన ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
పట్టణంలో శ్రీ పోచమ్మ నాగుల ఆలయం దర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు
పట్టణం లోని *నూతన పోచమ్మ నాగుల ఆలయం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,స్థానిక కౌన్సిలర్ లు స్వప్న ప్రవీణ్,ప్రేమలత శంకర్ రెడ్డి ,
నాయకులు భరత్ రెడ్డి, జగదీష్, ప్రభు పటేల్ తదితరులు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి,ఆలయ కమిటీ వారు ,పూజారులు, భక్తులు ఎమ్మెల్యే గారికీ,నాయకులకు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
