Tribute to Headmaster Thomas
మాజీ ప్రధానోపాధ్యాయుడు థామస్కు మొలుగూరి నివాళి
పరకాల,నేటిధాత్రి
సి.ఎస్.ఐ మిషన్ హైస్కూల్ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఎస్.జే.థామస్ మరణం పట్ల పరకాల మాజీ శాసనసభ్యులు మొలుగూరి బిక్షపతి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన థామస్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థించారు.థామస్ విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ గత 50 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.క్రమశిక్షణ,సేవాభావం,విలువల బోధనలో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.ఈ సందర్భంగా థామస్ కుటుంబ సభ్యులకు మొలుగూరి బిక్షపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి జాఫర్ రిజ్వి తదితరులు పాల్గొన్నారు.
