నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ వరంగల్ జిల్లా కలెక్టర్ కు ఏఐసిటియు ఆధ్వర్యంలో మెమోరండం అందజేశారు.అనంతరం వరంగల్ జిల్లా కార్యదర్శి సుంచు జగదీష్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీలో వివిధ కేటగిరిలో 13 మంది పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికులకు జీతాలు పెంచాలని అన్నారు. 2023 డిసెంబర్ 21 న కార్మికులకు వేతనాలు పెంచాలని జీవో విడుదల చేసినప్పటికి నేటి వరకు జీతాలు పెంచకపోవడంతో పాటు ఉన్న జీతాలు రెగ్యులర్ ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. సర్కులేషన్ ప్రకారం వేతనాలు పెంచాలని కార్మికులు పదేపదే అధికారులను అడిగిన స్పందించక నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జన్ను రమేష్,రాగినేని ఐలయ్య జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.