KTR Comments Condemned
కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండనీయం
దొమ్మటి బాబురావు కాంగ్రెస్ నాయకులు
పరకాల,నేటిధాత్రి
రైతు సంగ్రామ సదస్సు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు దొమ్మటి బాబురావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ను విమర్శించే హక్కు కేటిఆర్ కు లేదన్నారు.ప్రజల సమస్యలపై సమాధానాలు చెప్పాల్సిన ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైంది కాదన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.రైతు రుణమాఫీ,ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం కట్టుబాటుతో పనిచేస్తోందన్నారు.ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చించకుండా రాజకీయ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని,కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు అసహనానికి గురవుతున్నాయని వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవంతో రాజకీయాలు జరగాలని,అనవసర ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు.
