Indira Gandhi Jayanti Celebrated in Narsampet
పేదరికాన్ని నిర్మూలించిన మహిళా ప్రధాని ఇందిరమ్మ
నర్సంపేట,నేటిధాత్రి:
గరీబీ హఠావో నినాదంతో పేదరికారాన్ని నిర్మూలించిన ఉక్కుమహిళా మొదటి భారత మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ అని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని బుదవారం నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజేందర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం, ఇందిరమ్మ చేసిన త్యాగాలు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలాల్లో వారు చూపిన ధైర్యం సంకల్పం రాబోయే తరాలకు కూడా నిలుస్తాయని తెలిపారు.ఇందిరమ్మ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవండ్ల రాంబాబు, నర్సంపేట పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఇస్లావత్ పద్మా బాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి నూనె పద్మ, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిలు చిప్ప నాగ, గిరగాని రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసిన, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ సహాయ కార్యదర్శి దేశి లక్ష్మీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, నాడెం నాగేశ్వర్లు, పేరం బాబు రావు, గండి గిరి, రామగోని సుధాకర్, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, గోపు మహేందర్ రెడ్డి, కిసరి వెంకటేశ్వర్లు, నాగేల్లి సారంగం, వేల్పుల కృష్ణ, మేరుగు కిరణ్, కొర్ర రాహుల్, దేశి సాయిపటేల్, భూక్యా గణేష్, వాజిత్, తదితరులు పాల్గొన్నారు.
