ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
ఆస్పత్రికి వచ్చే పేషెంట్స్ కు కనీసం తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తాగునీరు లేక ఇబ్బందులకు గురవుతున్నారు కావున వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు మంగళవారం ఉదయం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్ కు తాళాలు వేసి ఉన్నాయి.
కొన్ని టాయిలెట్స్ లో వాటర్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్స్ వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో తాగునీరు సమస్యను పరిష్కరించాలి ఆసుపత్రి పేషెంట్స్ అన్నం పెట్టే వంట గదిని పరిశీలించారు నాణ్యత లోపంతో ఉన్న వస్తువులను వాడుతున్నారు క్వాలిటీ వస్తువులు వాడి పేషెంట్స్ కు మంచి భోజనాన్ని అందివ్వాలి అని వారు అన్నారు మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఆసుపత్రికి సపరేట్ లైన్ వేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ప్రిన్సిపాల్టీ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి సిద్దు తిరుపతి తదితరులు పాల్గొన్నారు
