విఠలేశ్వర పాండురంగస్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి:
వైకుంఠ ఏకాదశి సందర్భంగా
ఉత్తరద్వార వనపర్తి లో బ్రాహ్మణ వీధిలో ఉన్న విఠలేశ్వర పాండురంగస్వామిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారని అలయకమిటి సలహాదారుడు 15 వ వార్డు మున్సిపల్ కౌన్సులర్ బండారు కృష్ణ తెలిపారు
ఈ సందర్భంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరద్వారం దర్శనం మోక్షదాయకం అని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని పాండురంగ స్వామినీ దర్శించుకున్నారు
బండారు కృష్ణ ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ,మురళీ శర్మ సాదరంగా ఆహ్వానం పలికి ఘనంగా సన్మానించారు. పాపిశెట్టి శ్రీనివాసులు
వాకిటి.శ్రీధర్,నందిమల్ల.అశోక్ .మాణిక్యం, ఉంగ్లమ్. తిరుమల్, పెండం నాగన్న యాదవ్,చిట్యాల. రాము,డాక్టర్. డ్యానియల్,పి.శ్రీనివాసులు, భరత్ భక్త్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!