భద్రాచలం నేటి ధాత్రి
ఆదేశానుసారం యస్ఐలు విజయ లక్ష్మి మరియు పి వీ ఎన్ రావుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ కొరకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యస్ ఐ లు మాట్లాడుతూ, యువత డ్రగ్స్ బారిన పడి వాటికి బానిసలుగా మారి, వాటి కోసం దొంగతనాలకు పాలపడుతున్నారని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారిని నమ్ముకున్న కుటుంబాలు రోడ్డున పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ పిల్లల ప్రవర్తనను పర్యవేక్షించాలని కోరారు.గంజాయి కి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే పోలీసువారికి సమాచారం ఇవ్వగలరని అన్నారు. సమాచారం తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు . ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు కందుల ప్రసాద్, రవి,ప్రసాద్ బాబు లు కూడా పాల్గొన్నారు.