నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో నర్సంపేట టౌన్ సీఐ సుంకరి రవికుమార్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కమిషన్ అధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సీఐ రవికుమార్ ఎస్సై చరణ్ తో కలిసి పరిశీలించారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికల జరిగేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని గ్రామస్తులకు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి పెద్ది శ్రీనివాస్ రెడ్డి,సర్పంచ్ బరిగెల లావణ్య కిషోర్,ఉప సర్పంచ్ శ్రీను,సుంకరి సంతోష్ రెడ్డి, జరుపుల వీరన్న,మాజీ సర్పంచ్ పాపయ్య పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.