పల్లాకు మద్దతుగా తరలివెల్లిన కుర్మ సంఘం నాయకులు..

చేర్యాల నేటిధాత్రి…

జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా ఆదివారం జనగామ నియోజకవర్గ కేంద్రలో కుర్మ సంఘం ఆత్మీయ సభకు చేర్యాల కుర్మ సంఘం నాయకులు ఆదివారం భారీ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం మండల అధ్యక్షుడు శేవల్ల రాజయ్య మాట్లాడుతూ.. గొల్ల కురుమల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో దేశంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. సామాజికంగా యాదవ, కుర్మలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని, గత ప్రభుత్వాలు యాదవులను పట్టించుకోలేదని, కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూశారని విమర్శించారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు కుర్మ సంఘం నాయకులు సంపూర్ణ మద్దతు పలుకావాలని కోరారు. గొల్ల, కురుమలకు విడతలవారీగా గొర్రెల యూనిట్లను పంపిణీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. యాదవ, కురుమల అభివృద్ధికి ఎంతో తోడ్పాటనందిస్తున్న సీఎం కేసీఆర్ కు యాదవ, కురుమలు రుణపడి ఉండాలని పిలుపునిచ్చారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజారితో గెలిపించుకుంటామని ధీమావ్యక్తం చేశారు. సభకు తరలి వెళ్లిన వారిలో కుర్మ సంఘం నాయకులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!