జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

`విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

`కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం

`ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు

`బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు

`రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం

`జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు

`కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) బుధవా రం సమావేశమై కులగణన విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ కులగణన అంశాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏన్డీఏ కూటమికినేతృత్వం వహిస్తున్న జేడీయూ, గతంలో మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కులగణన చేసింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో 75శాతం వెనుకబడిన వర్గాలున్నట్టు తేలింది. అయితే కులగణను బీజేపీ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కులాలుగా, వర్గాలుగా హిందువులను ముక్కలుగా చీల్చే ప్రక్రియగా దీన్ని పేర్కొంటూ వచ్చింది. బిహార్‌లో కులగణను ప్రధాన అస్త్రంగాచేసుకొని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ప్రచారం కొనసాగించడం భాజపాకు మింగుడు పడటం లేదు. ఎన్నికల వాతావరణం తమకే సానుకూలంగా వున్నాయన్న సంకేతాలు స్పష్టంగా వెలువడు తున్నప్పటికీ, తమకు ప్రతికూలంగా మారే ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో, కులగణనపై తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ద్వారా, విపక్షాలకు ముందరికాళ్లకు బంధం వేసేవిధంగా, జనాభాలెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడానికి నిర్ణయించింది. సీసీపీఏ తీసుకున్న నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సహా విపక్షాల దాడిని ఎదుర్కోవడంలో డిఫెన్స్‌లో పడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు, విపక్షాలపై తమ ప్రతిదాడులను మరింత తీవ్రం చేసేందుకు ముందడుగులు వేస్తున్నాయి.

వాయిదా పడుతున్న జనగణన

నిజానికి జనగణన 2020లో చేపట్టాల్సివుంది. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదాపడిరది. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి పదేళ్లకోమారు జనగణన చేపట్టాలి. దీని ప్రకారం 2021 నాటికి జనాభా లెక్కల వివరాలు ప్రచురితం కావాల్సి వుంది. కానీ అది ఇప్పటివరకు వాయి దా పడుతూ వచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యా యం జరగాలంటే కులగణన తప్పనిసరని గతంలో గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడినవర్గాల వారు విద్యవిషయంలో ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అన్నివర్గాల ప్రజలకు వనరులను సమాన ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువరావాలంటే కులగణన తప్పదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. 1927, మార్చి 20న డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌ కులవివక్షను తీవ్రంగా విమర్శించారు. ఆరోజున నీటికోసం జరిపిన మహద్‌ సత్యాగ్ర హం సందర్భంగా మాట్లాడుతూ, ‘నీటికోసం మాత్రమేకాదు, గౌరవం, సమానత్వం కోసం జరిపేపోరాటం ఇది’ అంటూ పేర్కొన్న అంశం ప్రస్తావనార్హం. ఇదిలావుండగా భాజపా రాహుల్‌పై ఎ దురుదాడి చేస్తూ కుటుంబ పాలనలో కాంగ్రెస్‌ తమపార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ను ఎంతగా అవమానించిందో తెలుసుకోవాలని కోరింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను పైకి ఎదగనీయకుండా తొక్కేసిన చరిత్ర కాంగ్రెస్‌దంటూ భాజపా ఆరోపిస్తూ వచ్చింది. అయితే కుల గణన ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని రాహుల్‌ గాంధీ కూడా ఎదురుదాడి చేయడం వర్తమాన రాజకీయ పరిణామం. 

కులగణన రాజకీయం

రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను విలేకర్లకు వివరిస్తూ కేంద్ర రైల్వేశాఖ మం త్రి అశ్విన్‌ వైష్ణవ్‌, కేవలం తమ రాజకీయ లబ్దికోసమే కులగణను ఇండీ కూటమి పార్టీలు లేవ నెత్తుతున్నాయని విమర్శించారు. కాగా రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 69వ నిబంధన జనగణనను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా స్పష్టంగా పేర్కొంది. అయితే బిహార్‌, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకుండా కులగణన పూర్తిచేశాయి. అయితే ఇది కేవలం రాజ కీయ కోణంలోనే తమ ప్రయోజనార్థం చేపట్టిన కార్యక్రమమని, ఇందులో ఎటువంటి పారదర్శకత లేదని అశ్వనివైష్ణవ్‌ స్పష్టం చేస్తూ, కేంద్రం జనగణనతో పాటు చేపట్టే కులగణన ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా వుండబోతున్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ని ర్వహించిన సర్వేలు సమాజంలో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణను, జనాభాలెక్కలతో పాటు చేపడితే స్పష్టమైన ఫలితాలు వస్తాయన్నారు. పదేళ్ల క్రితం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహిం చింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా వున్న వక్కళిగలు, లింగాయత్‌లనుంచి తీవ్ర వ్యతి రేకత రావడంతో ఆ నివేదికను ఇటీవలి కాలం వరకు ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యంకాలే దు. బలీయమైన కులాల ప్రభావ తీవ్రతను ఇది మరోసారి బహిర్గతం చేసింది. ఈ కులగణనలో తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పటికీ ఈ రెండు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నా యి కూడా. 

బిహార్‌లో తొలి కులగణన

కులగణన అవసరాన్ని నొక్కి చెబుతున్న విపక్ష పార్టీలు, దీనివల్ల ప్రతి కులంలో జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కనుక దీని ఆధారంగా ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు పరచ వచ్చునని వాదిస్తున్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం విపక్షాలు హిందూసమాజాన్ని ముక్కలుగా విడగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తునాయనేది భాజపా వాదన. అధికార,విపక్ష పార్టీల మాట ఎట్లా వున్నా, దేశంలో కులగణన జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్‌. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 36శాతం రాష్ట్రజనాభా అత్యంత వెనుకబడిన స్థా యిలో వున్నట్టు తేలింది. బిహార్‌ రాష్ట్రం మొత్తం జనాభా 13కోట్లలో 27.13% మంది ప్రజలు వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు. 15.52% సాధారణ కేటగిరి ప్రజలుగా తేలింది. ఈ కులగణను రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో కుటుంబాల వారీగా జరపగా, రెండో దశలో సామాజిక, ఆర్థిక, కులపరంగా నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయ పరిమితి 50%ని ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

ఇప్పటివరకు మూడు కులగణనలు

దేశంలో మొట్టమొదటి కులగణన 1871ా72లో నాటి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం చేపట్టింది. రెండో కులగణను 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాని తర్వాత 2011లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు కులగణనను నిర్వహించింది. దీని ప్రకారం దే శంలో 46.7లక్షల కుల/ఉపకుల గ్రూపులున్నట్టు తేలింది. అయితే సేకరించిన సమాచారం స్థి రంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి కులగణన వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. ముందుగా ప్రయోజనాల విషయానికి వస్తే ఏఏ కులాల్లో ఎంతమంది జనాభా వున్నారనేది స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను జనాభా ఆధారంగా రూపకల్పన చేయవచ్చు. ఇదే సమయంలో పేదరికంలో మగ్గే వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవచ్చు. అంతేకాదు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆయా వర్గాల ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే ఈ కులగణనలో కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సెన్‌’ అనే కులం బెంగాల్‌లో అగ్రవర్ణం కాగా, ‘సెయిన్‌’ ఓబీసీ వర్గానికి చెందినది. చిన్న స్పెల్లింగ్‌ తప్పు జరిగినా పథకాల అమలు తారుమారు కావడం ఖాయం. బిహార్‌ కులగణనలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతిని గుర్తుంచుకోవాలి. బిహార్‌ కులగణనలో ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల కారణంగా సమాచారాన్ని తారుమారుచేసే అవకాశాలు అధికమన్న విమర్శలు వచ్చాయి. సమాజంలో కులవ్యవస్థ మరింత కఠినంగా మారే ప్రమాదం ఏర్పడిరది. ఈ కులగణన నేపథ్యంలో, అధిక జనాభా కలిగిన కులాలవారు తమ నిష్పత్తికి అనుగుణంగ ప్రయోజనాలు కల్పించాలన్న డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కులాల ఆధారంగా అమలు చేయడమనేది ఒక ప్రామాణికతను సంతరించుకునే పరిస్థితి నెలకొంది. కులగణన చేపట్టేముందు ఇటువంటి ప్రతికూలతలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో వుంచుకోవాలి. కాకపోతే ఈ కులగణన చేపట్టిన రాష్ట్రప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం అనేదానికంటే, అధిక జనాభా కలిగిన వర్గాలకు ఎక్కువ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే మనదేశంలో స్వాతంత్య్రానంతరం కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి రాజకీయాలకు సమాధికట్టి, దానికి ఎప్పటికప్పుడు పాలరాతితో అద్భుతమైన ‘అవినీతి’ కళాఖండాలను జోడిస్తూ ప్రపంచపు వింతల్లో ఒకటిగా పరగణించే ‘తాజ్‌మహల్‌’ను తలదన్నే స్థాయిలో తీర్చిదిద్దాయి. దీనికి ఎప్పటికప్పుడు మరింత నగిషీల సొబగులు చేర్చడం తప్ప సంక్షేమం అమల్లో చిత్తశుద్ధి అనేదానికి ఎప్పుడో ‘తర్పణాలు’ వదిలేశాయి. ఒక్కపక్క కులరహిత సమాజం రావాలని సుద్దులు చెప్పే పార్టీలు తమ స్వార్థం కోసం కులవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి వుంటే, సమాజంలో ‘ధనిక’, ‘పేద’ అనే రెండు వర్గాలనే గుర్తించి (కుల,మతాలకతీతంగా) పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్‌ ఆశయాలను సాధించినట్టుగా పరిగణించాలి. అంతేకాని స్వార్థం కోసం ఆ మహనీయుని పేరును ఉపయోగించుకోవడం అలవాటు కాకూడదు!

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

బెంగాల్‌ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతున్న బీజేపీ

సంస్థాగత బలం లేకపోవడం పెద్ద లోటు

బలమైన కార్యకర్తల బేస్‌ అవసరం

ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు

గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు

బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం

భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు

ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్‌ ముస్లింలు

భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు

వక్ఫ్‌ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి పౌరులుగా హిందువులు

హిందువులపై దాడులు సర్వసాధారణం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తమపై దాడులు జరుగుతున్నా, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నా, మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్‌ హిందువుల్లో చాలామంది ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తుండటం విచిత్రమనిపిస్తుంది. ఇటీవల వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ముర్షిరాబాద్‌ జిల్లాకు చెందిన జఫ్రాబాద్‌ అనే ఒక చిన్న పట్టణంలో మైనారిటీలుగా వున్న హిందువులకు చెందిన ఏ ఒక్క ఇల్లుదాడికి లేదా లూటీకి గురికాకుండా లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెచ్చరిల్లిన హింస ప్రభావాన్ని ఇక్కడి హిందువులు చవిచూశారు. ఈ చిన్న పట్టణం కోల్‌కతాకు 284 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ 25వేల మంది ముస్లిం జనాభా వుంటే, హిందువు లు కేవలం 5100 మాత్రమే. షంషేర్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పట్టణం వుంది. ఈ నియోజకవర్గంలో 2.16లక్షల మంది ఓటర్లుండగా ఇందులో 80శాతం మంది ముస్లిం లే. ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి తప్ప మరొకరు గెలవరు. ముస్లిం మెజారిటీ ప్రాంతా ల్లో హిందువుల బతుకులు ఎంత దుర్భరంగా వుంటాయనేదానికి జఫ్రాబాద్‌ పట్టణం ఒక ఉదా హరణ మాత్రమే! మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాల పుణ్యమాని, ఇక్కడి హిందువులు ఎన్ని బాధలు పడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోరు. రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీలుగా వున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది. 

హిందువుల్లో ఓటింగ్‌ శాతం తక్కువ

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.6కోట్లు. వీరిలో హిందువులు 68శాతం. హిందువుల్లో బెంగాలీ హిందువులు 54శాతం వుంటే, గుజరాతీలు, మార్వాడీలు, యు.పి, బిహార్‌ ప్రాంతా లనుంచి వచ్చిన వారు, గూర్ఖాలు, గిరిజనులు కలిసి 14శాతం వుంటారు. అంటే బెంగాలీ హిం దువులు 4.1 కోట్లు కాగా, బెంగాలేతర హిందువుల సంఖ్య 1.6కోట్లు. ఇక రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.43కోట్లు. బెంగాల్‌లో సాధారణంగా ఓటింగ్‌ శాతం 80శాతానికి పైగా నమోద వుతుంది. ముస్లిం ఓటర్లు 90 నుంచి 94శాతం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుం టే, హిందువులు కేవలం 65శాతం మంది మాత్రమే పోలింగ్‌ బూత్‌లకు వెళతారు. అంటే రా ష్ట్రంలోని మొత్తం 5.16 కోట్ల హిందువుల్లో కేవలం 3.5కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకుంటున్నారు. అదే 2.43కోట్లమంది ముస్లింలలో 2.18కోట్లమంది ఓట్లు వేస్తారు. దీవల్ల రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే హిందువుల ఓట్లు కేవలం 3.16లక్షలు మాత్రమే అధికంగా పోలవడం గమనార్హం. 

హిందువుల్లో 66శాతం మంది బీజేపీకి మద్దతు

2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 2.75కోట్ల ఓట్లు (45.76%) పోల్‌ కాగా, బీజేపీకి 2.33 కోట్ల (38.73%) ఓట్లు పోలయ్యాయి. అంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 42.37లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు మొత్తం హిందువులవే. 3.51కోట్లమంది హిందువులు ఓటుహక్కును వినియోగించుకోగా, ఇం దులో 2.33కోట్ల మంది బీజేపీకే తమ ఓట్లు వేసినట్లు తేలుతోంది. అంటే మొత్తం పోలైన హిందూ ఓట్లలో 66శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఓటువేసారని స్పష్టమవుతోంది. అంటే మిగిలిన 34శాతం (1.18కోట్లు) ఇతర పార్టీలు ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటు వేసారను కోవాలి. వీరిలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు 64లక్షల మంది హిందువులు అనుకూలంగా ఓటు వేయగా మిగిలినవారు తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. 

ఈ విశ్లేషణను పరిశీలిస్తే 34శాతం మంది హిందువులు ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మరియు లెఫ్ట్‌ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.

హిందువులపై యదేచ్ఛగా దాడులు

 హిందువుల వేడుకలు, ఊరేగింపులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పండుగల సందర్భంలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. హిందువుల పట్ల ప్రభుత్వం పూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది. ఇస్లామిక్‌ ఛాందసవాదులు నిర్హేతుక కోర్కెలకు తలగ్గి ఎన్నో తరాలుగా కొనసాగుతున్న హిందువుల పండుగలు, వేడుకలపై మమత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హిందువులపై దాడులకు, హింసాకాండకు పాల్పడిన ఇస్లామిక్‌ ఛాందసవాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దీన్ని అలుసుగా తీసుకొని మతఛాందసవాదులు యదేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇస్లామిస్టులు దాడులకు తెగబడటానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం అండ వున్నదన్న ధైర్యంతోనే! ఉదాహరణకుచందన్నాగోర్‌ సబ్‌డివిజన్‌కు చెందిన చంపదాని పట్టణంలో హిందువుల జనాభా 76%. కానీ ఏప్రిల్‌ 11న శుక్రవారం నమాజు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ రాడికల్స్‌ హిందువుల ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కర్రలు, లాఠీలు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న రాడికల్‌ ముస్లింలు, పోలీసులను కూడా తరిమివేశారు. 

ఇస్లామిక్‌ రాడికల్స్‌ దాడులనుంచి తమను తాము కాపాడుకోవడానికి బెంగాలేతర హిందూ యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇస్లామిస్టులను నిరోధిస్తున్నప్పుడు, పోలీసులు వీరినే నియంత్రించా రు తప్ప దాడులకు పాల్పడిన వారిని పల్లెత్తుమాట అనుకపోవడం బెంగాల్‌లో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. ఆవిధంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువుల కు రక్షణ లేకుండా పోయింది. బెంగాల్‌లోని గ్రామీణ, పట్టణ, సెమి అర్బన్‌ ప్రాంతాలకు చెందిన హిందువులకు ఈ దాడుల అనుభవాలు వెన్నాడుతున్నాయి. 

పేదలకు అనుకూల పథకాలు

మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకునా, రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం కుంచించుకు పోతుండటంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అత్యధికశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మమతా బెనర్జీ అమ లు చేస్తున్న పథకాల వల్ల, లక్షల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు వెళ్లగలుగుతున్నారు. ఉన్నత విద్యకూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా మమతా బెనర్జీ ఆయా వర్గాల ఓట్లను కోరుతున్నారు. తమకు అందుతున్న పథకాల ప్రయోజనం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన పేద హిందువులు తృణమూల్‌ కాంగ్రెస్‌కే అనుకూలంగా వుంటున్నారు. ఇదే సమ యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనాలు పొందు తుండటం ఓటుబ్యాంకు పటిష్టంగా వుండటానికి మరో కారణం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రభుత్వ భూమిలో ఒక టీస్టాల్‌ లేదా దుకాణాన్ని నడుపుకోవడం, పన్నులు చెల్లించకుండా చట్టవిరు ద్ధంగా ఆటోరిక్షాలు నడుపుకోవడానికి పేదలకు స్థానిక తృణమూల్‌ నాయకులనుంచి మద్దతు లభిస్తోంది. అదేవిధంగా చట్టవిరుద్ధంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను నడుతున్న లక్షల సంఖ్యలో ప్రజలు కూడా తృణమూల్‌కు గట్టి మద్దతుదార్లుగా వున్నారు. 

స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు

చాలామంది బెంగాలీ హిందువులు బీజేపీని బయటినుంచి వచ్చిన పార్టీగా పరిగణిస్తారు. బీజేపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఇందుకు కారణం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీ ఉత్తరభారత్‌కు చెందిన పార్టీగా ఇక్కడి ప్రజలు పరిగణిస్తారు. తమకు బీజేపీకి ఎంత మాత్రం పొసగదన్న అభిప్రాయం దృఢంగా వుంది. ఇదే సమయంలో భాజపాకు రాష్ట్రంలో గట్టి సంస్థాగత బేస్‌ ఇంకా ఏర్పడలేదు. అటువంటి బేస్‌ ఏర్పడితే, ఓటర్లు ధైర్యంగా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోగలుగుతారు. అరాచకానికి, హింసాత్మక రాజకీయాలకు పెట్టింది పేరుగా వున్న బెంగాల్‌లో ఏ రాజకీయ పార్టీ అయినా తన మద్దతుదార్లకు రక్షణ క ల్పించే స్థితిలో వుండాలి. బీజేపీకి అటువంటి సంస్థాగత బలం లేకపోవడంతో ఎంతోమంది హిందువులు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్‌ బూత్‌లకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు బూత్‌ స్థాయిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన కార్యకర్తల బలం బీజేపీకి లేదు. ఇక పట్టణ ప్రాంత బెంగాలీలు ప్రత్యేకించి కోల్‌కతా నగరానికి చెందిన హిందువులు లెఫ్ట్‌ పార్టీలకు అనుకూలం. ఎప్పుడైతే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారో వీరంతా తృణమూల్‌ కాం గ్రెస్‌ మద్దతుదార్లుగా మారిపోయారు. వీరు బీజేపీని మతతత్వ పార్టీగా విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బెంగాలేతరుల జనాభా అధికం. వీరంతా తృణ మూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు. ఇటువంటి బెంగాలేతర వర్గాలనుంచి ప్రముఖ నాయకులను ఆకర్షించడంలో బీజేపీ ఇంకా సఫలీకృతం కాలేదు. దీంతో పాటు వీరిని విస్మరించడం కూడా పార్టీకి ప్రతికూలతగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అనుకూలుడైన సమర్థ నాయకుడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. హిందువుల్లోని అన్ని వర్గాలను ఆకర్షించగలిగే ఛరిష్మా నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడిపే పార్టీలకు హిందూ ఓటర్లు అనుకూలంగా వుండటంలో పెద్ద విశేషమేం లేదు. బలం వున్నవాడి వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఇదే తృణమూల్‌కు లాభం.

అధికారులుగా చేయలేని సేవ..నాయకులుగా చేస్తారా?

-రాజకీయాలంటే మాటలు కాదు..అధికారుల పెత్తనం అసలే కాదు!

-అప్పుడు జనానికి దూరం…ఇప్పుడు దగ్గరయ్యేందుకు ఆరాటం?

-అధికారులు రాజకీయాలు…రాణించలేక అవస్థలు!

-రాజకీయాలలోకి అధికారులు..సక్సెస్‌ కాలేక తలనొప్పులు!

-ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారున్నారు.

-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.

-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.

-రాణించలేక చతికిలపడిపోతున్నారు.

-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.

-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.

-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.

-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.

-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.

-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.

-రిటైర్‌ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.

-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.

-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.

-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.

-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.

-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్‌ లో పాల్గొంటున్నారు.

-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్‌ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్‌ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్‌ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్‌ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్‌ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్‌ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్‌ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్‌ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్‌ అయ్యారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్‌ నాయక్‌ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్‌ఎస్‌లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్‌ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్‌ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్‌ ఎంపి బలరాం నాయక్‌ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు.
ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…

‘‘కేసిఆర్‌ గర్జన’’..’’కాంగ్రెస్‌ లో తర్జనభర్జన!’’

-ప్రజలంతా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూశారు

-చాలా కాలం తర్వాత ‘‘కేసీఆర్‌’’ ను చూసిన ఆనందంలో కేరింతలు కొట్టారు

-‘‘కేసీఆర్‌’’ ప్రసంగంలో ఉగ్రరూపం కన్నా, సమగ్ర రూపానికి విలువిచ్చారు

-శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేశారు

-తెలంగాణకు కాంగ్రెస్‌ విలన్‌ అన్నారు

-కాంగ్రెస్‌ వైఫల్యాలను జనం చేత చెప్పించారు

-మొదటి సారి ప్రజలను ‘‘అన్నలు’’ అని పలుసార్లు సంబోధించారు

-తనదైన శైలికి భిన్నంగా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూపించారు

-ఒక్కో పథకం ప్రస్తావిస్తూ చురకలు అంటించారు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు

-తన కళ్ల ముందే తెలంగాణ తెర్లవుతుంటే తట్టుకోలేకపోతున్నాన్నారు

-మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే అని శ్రేణులలో భరోసా నింపారు

-ఏడాదిన్నర సమయం కాంగ్రెస్‌ కు ఇచ్చానన్నారు

-ఇక ఆగేది లేదంటూనే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్ధామన్నారు

-పనిలో పనిగా పోలీసు శాఖను హెచ్చరించారు

-బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను ప్రశంసించారు

-స్వయంగా నేనే శ్రేణులకు అందుబాటులో వుంటానన్నారు

-సభ ఊహించినట్లే సక్సెస్‌ అయింది

-డ్రోన్‌ కళ్లకందనంత సభా ప్రాంగణం నిండిపోయింది

-నింగి వంగి నేల పొంగిందన్నట్లు జనం వచ్చారు

నిర్వాహకులు ‘‘ఎమ్మెల్సీ పోచంపల్లి’’, ‘‘ఎమ్మెల్సీ తక్కల్లపల్లి’’ ‘‘పెద్ది’’,’’దాస్యం’’ లను అభినందించారు

-అశేష జనవాహిని చూసి కేసీఆర్‌ మురిసిపోయారు

-ఖమ్మం నుంచి అత్యధికంగా ప్రజలు తరలివచ్చారు

-రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు’’ అందరికన్నా ఎక్కువ మందితో సభకు వచ్చారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ రోజున ప్రకృతి పరంగా కూడా ఒక అద్భుతం జరిగింది. ఇది ఎవరూ ఊహించలేదు. అసలు ఊహకుకూడా అందలేదు. మండు వేసవిలో 45 డిగ్రీల ఎండలో సభకు జనం ఎలా వస్తారో..ఎండలో సభలో ఎలా వుంటారో అని అందరూ అనుకున్నారు. నిప్పులు కక్కే ఎండలను తట్టుకొని వచ్చేదెంత మంది అని కూడా అనుకున్నారు. కాని బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వాతావరణం సహకరించడం అన్నది గొప్ప విషయం. విశేషం కూడా. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. మండు వేసవిలో తెలంగాణ మలయమారుతంలాగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా మారిపోయింది. సభ జరగడానికి ఒక రోజు ముందుకు కూడా నిప్పులు వేడిమి వుంది. సభ తెల్లారి కూడా మళ్లీ ఎండ విపరీతంగా కాసింది. సభ జరిగిన రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని వాతావరణం మాత్రమే వుంది. ఇదెలా సాధ్యమైందన్నది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కేసిఆర్‌ సభ అంటే వాతావరణం కూడా ఎంత సహకరించిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు ఒక్కసారిగా ఒక్క పూట చల్లబడిన వాతావరణం సాయంత్రానికి వర్షం కురిస్తే కూడా ఇబ్బందే అయ్యేది. కాని అటు వాన లేదు. ఇటు ఎండ లేదు. చల్లదనం మాత్రమే కనిపించింది. బిఆర్‌ఎస్‌ సభ ఊహకందనంత విజయం సాధించింది. ప్రకృతి కూడా బిఆర్‌ఎస్‌కు రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినట్లైంది.
సింహ శ్వాసలో వేడి, గర్జనలో వాడి రెండు ఎలా వుంటాయో బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో అధినేత కేసిఆర్‌ ఏక కాలంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీ మీద నిప్పులుచెరిగారు. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ పుట్టుక, తెలంగాణ ఉద్యమం, సాధనలను ఎంతో అర్ధవంతంగా వివరించారు. కేసిఆర్‌ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై ఏం మాట్లాడాలో కాంగ్రెస్‌పార్టీకి అర్ధం కాకుండాపోతోంది. నాయకులు తర్జన భర్జన అవుతున్నారు. లక్షలాది మంది సాక్షిగా కేసిఆర్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. పనిలోపనిగా ప్రజల చేత ఆ వైఫల్యాలను చెప్పించారు. దాంతో లక్షల మంది కాంగ్రెస్‌ పధకాలు అమలు కావడం లేదని చెప్పినట్లైంది. నిజానికి కేసిఆర్‌ తన శైలికి భిన్నంగా ఇలాంటి నినాదాలు చేయించారు. తాను మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్‌ను తూర్పారపట్టినట్లైంది. ఇక సభ విషయానికి వస్తే రజత్సోతవ సభలో సరికొత్త కేసిఆర్‌ను జనం చూశారు. ఒకప్పటి ఉద్యమ కేసిఆర్‌వేరు. ఇప్పుడుకేసిఆర్‌ వేరు. ఆ కేసిఆర్‌లో ఉరిమే ఉత్సాహం మాత్రమే కనిపించేంది. కాని ఇప్పుడు ఉప్పెనలాంటి కేసిఆర్‌ను జనం చూశారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోవున్నా లేకున్నా, ప్రజల గుండెల్లో మాత్రం సుస్ధిరంగా వుందని నిరూపించారు. సహజంగా సభ నిర్వహణ అంటే బిఆర్‌ఎస్‌ను మించిన పార్టీలేదు. దేశంలోని ఏ పార్టీకి ఇంత పెద్దసభలు నిర్వహించడం సాధ్యం కాదు. అది ఒక్క కేసిఆర్‌కు మాత్రమే అని మరోసారి నిరూపించినట్లైంది. ఉద్యమ కాలంలో కొన్ని వందల సభలు కేసిఆర్‌ నిర్వహించారు. ఆ సభలకు కూడా ఎప్పుడూ లక్షకు తక్కువ కాకుండా ప్రజలు హజరయ్యేవారు. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న తెలగువాళ్లే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలకు టివిలకు అతుక్కుపోయేవారు. కేసిఆర్‌ ప్రసంగిస్తున్నంత సేపు చూపు తిప్పుకునేవారు కాదు. పదేళ్ల పాలన తర్వాత కూడా కేసిఆర్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించినట్లైంది. బి ఆర్‌ఎస్‌ వేసిన అంచనాకు మించి ప్రజలు వచ్చారు. కోట్లాది మంది ప్రజలు అటు టివిలలో, ఇటు అరచేతిలో మెబైల్స్‌ ద్వారా కేసిఆర్‌ ప్రసంగం ఆధ్యాంతం వీక్షించారు. ఏడాదిన్నర తర్వాత ఇంతటి సభ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కేసిఆర్‌ ఒక్క పిలుపు చాలు..లక్షలాది మంది తరలివస్తారని మరోసారి రుజువైంది. ఇక మళ్లీ కేసిఆర్‌ యుగం మొదలైందా? అన్నట్లు జనం తండోపతండాలుగా వచ్చారు. పుట్టల నుంచి చీమలు చేరినట్లు చేరారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జన సందోహమే..వీరితోపాటు కేసిఆర్‌ సభకు హజరు కాలేక ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం మరో లక్షన్నర వరకు వుంటారని కూడా తెలుస్తోంది. సభా ప్రాంగణానికి చేరుకోలేక, ట్రాపిక్‌లో చిక్కుకొని వెనక్కి వెళ్లలేక, ముందుకు రాలేక, బస్సుల్లోనే అందరూ సెల్‌ఫోన్లలో కేసిఆర్‌ ప్రసంగం విన్నారు. చాలా కాలం తర్వాత కేసిఆర్‌ను చూసిన ఆనందంలో ప్రజలు కేరింతలు కొట్టారు. కేసిఆర్‌ను జయజయ ధ్వానాలతో ఆహ్వానించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఈసారి కేసిఆర్‌ ప్రసంగంలో ఉగ్రరూపం కనిపించలేదు. సమగ్ర రూపాన్ని సంతరించుకున్న ప్రసంగం కనిపించింది. ఇది కేసిఆర్‌కు భిన్నమైన కొత్త శైలి. పైగా ఎంతో శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేస్తూ కేసిఆర్‌ ప్రసంగం సాగింది. అదే సమయంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణకు విలన్‌ కాంగ్రెస్‌ అంటూ కేసిఆర్‌ అనగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఇదే ఊపులో కాంగ్రెస్‌ చేసిన వాగ్ధానాలను ఉటంకించిన కేసిఆర్‌, ఆ వైఫల్యాలను ప్రజల చేత ఒకటికి రెండు సార్లు చెప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎంగట్టారు. ఇదిలా వుంటే ప్రజలను అన్నలారా అంటూ కేసిఆర్‌ సంబోధించడం కూడా మరో ప్రత్యేకత. ఉద్యమ సమయంలో మాత్రమే ఒకటి రెండు సార్లు అన్నట్లు గుర్తు. కాని తర్వాత తాను పెద్దకొడుకును అని అనేవారు కాని, సభకు వచ్చిన వారిని అన్నలని సంబోధించడం కూడా కొత్తగా వుంది. కేసిఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. తనదైన శైలికి భిన్నంగా కొత్త కేసిఆర్‌ను చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేక చతికిలపడుతున్న ఒక్కో పథకాన్ని ఏకరువు పెడుతూ, దెప్పి పొడిచారు. కొత్త రకం చురకలు అంటించారు. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద చల్లటి వాతావరణంలో నిప్పులు చెరిగారు. పదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మార్చానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వల్ల తెలంగాణ తెర్లు అవుతుంటే తట్టుకోలేకపోతున్నానంటూ జీరగొంతుతో అన్నారు. ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రజలకు కేసిఆర్‌కు తెలంగాణ మీద వున్న మమకారాన్ని తెలుసుకున్నారు. ప్రజలు ఏమాత్రం దిగులు చెందొద్దని, వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీయే అని సభ సాక్షిగా ప్రకటించారు. దాంతో సభ మొత్తం కేసిఆర్‌ నినాదాలతో మారు మ్రోగిపోయింది. ఏడాదిన్నర కాలం మౌనంగా వున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి సమయం ఇచ్చాం. ఇక ఊరుకునేది లేదు. ఆగేది లేదు. పాలకపక్షంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజా పక్షమే మన బిఆర్‌ఎస్‌ అని అన్నారు. ఇక నేను జనక్షేత్రంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పనిలో పనిగా పోలీసు శాఖను కూడా హెచ్చరించారు. పోలీసులు బిఆర్‌ఎస్‌ నాయకులపై చూపిస్తున్న అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. రాసి పెట్టుకోండి అని వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. సోషల్‌ మీడియా బిఆర్‌ఎస్‌ వారియర్స్‌ మీద కేసులు నమోదు చేయడాన్ని కేసిఆర్‌ ఖండిరచారు. వారికి బిఆర్‌ఎస్‌ అండగా వుంటుందని చెప్పారు.

పోచంపల్లి, పెద్ది, దాస్యంలకు కేసిఆర్‌ ప్రశంస: బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లను తమ భుజస్కంధాల మీద వేసుకొని రేయింబవళ్లు కష్టపడి ఇంత పెద్ద సభ సక్సెస్‌కు కారకులైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌ విప్‌. దాస్యం వినయ్‌ బాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే,ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒకప్పటి బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిలను సభావేదిక సాక్షిగా కేసిఆర్‌ ప్రశంసించారు. వారు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలుతెలియజేశారు. ఈ ముగ్గురు పేర్లు కేసిఆర్‌ ప్రస్తావిస్తున్నప్పుడు జనం నుంచి పెద్దఎత్తున కేరింతలు, చప్పట్లు వినిపించాయి. ఎందుకంటే వరంగల్‌ సభ అంటే గతంలో జరిగిన మహా గర్జనకు సరిసమానంగా వుండాలి. లేకుంటే అంతకు మించి వుండాలి. ఏ మాత్రం తక్కువైనా మాట వస్తుంది. అందుకే ముగ్గురు నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి, ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ సభ ఏర్పాటు చూసుకున్నారు. కేసిఆర్‌ నుంచి ప్రసంసలు అందుకున్నారు.

ఖమ్మం ఈస్‌ ద మోస్ట్‌…వద్దిరాజు ఈస్‌ ద బెస్ట్‌: వరంగల్‌ రజత్సోతవ సభకు అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ప్రజల హజరైనట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలను మించి రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గత పదిహేను రోజులుగా పకడ్భంధీగా చేసిన ప్లాన్‌ ప్రకారం ప్రజలు తరలివచ్చారు. నిజానికి వద్దిరాజు చూపిన చొరవ మిగతా జిల్లాలు కూడా చూపించి వుంటే వరంగల్‌ సభ మరో రకంగా వుండేదన్న మాటలు కూడా వినిపించాయి. 1200 ఎకరాలు కూడా సరిపోయేది కాదు. ఎక్కడ చూసినా కనీసం ఓ 50 కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది అని చర్చించుకున్నారు. ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో వద్దిరాజు రవిచంద్రను అదినేత కేసిఆర్‌ కూడా అభినందించారు. ఏ ఖమ్మం గుమ్మంలో ఇబ్బంది ఎదురైందో అదే ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు రజతోత్సవ సభకు తరలిరావడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖమ్మం దారిలోనే ఎక్కువ ఇబ్బందులకు గురిచేసిట్లుకూడా బిఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఖమ్మం నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. వాటిని కూడా తట్టుకొని వద్దిరాజు సమన్వయంచేసుకుంటూ లక్షలాది మంది సభకు హజరయ్యేలా చూశారు. కేసిఆర్‌ నుంచి వద్దిరాజు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.

రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక

`ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ

`ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ

`ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా

`తెలంగాణ అంతా గులాబీ మయం

రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘‘ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో జనజాతర గురించి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

`వరంగల్‌ నిండా బీఆర్‌ఎస్‌ జన సందోహం

`ఎటు చూసినా గులాబీ రెపరెపలే

`ఎక్కడ విన్నా గులాబీ పాటలే

`తెలంగాణ అంతటా రజతోత్సవ చర్చలే

`గులాబీ దండు కదులుతోంది…వడి వడిగా వరంగల్‌ చేరుతోంది

`గులాబీ సైనికుల తెలంగాణ కవాతు కోసం కళకళలాడుతోంది

`జనం గుండెలు నిండుగా గులాబీ వనం విరబూస్తోంది

`ఎప్పుడెప్పుడు గులాబీ జాతర అని ఎదురుచూస్తోంది

`లక్షలాది మంది వరంగల్‌ సభకు వస్తున్నారు

`కేసీఆర్‌ అంటేనే తెలంగాణ జీవం

`కేసీఆర్‌ మాటలే తెలంగాణకు వేదం

`ఆవిరైపోతున్న నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి

`తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ పై నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి

`అడుగంటుతున్న భూ గర్భజలాలు ఆక్రోషిస్తున్నాయి

`ఎడారిగా మారిన బీళ్లు కాంగ్రెస్‌ను నోళ్లు తెరిచి తిడుతున్నాయి

`నమ్మినందుకు తెలంగాణ తల్లికి చుక్క నీరందక వాగులు, వంకలు శాపాలు పెడుతున్నాయి

`మళ్ళీ కేసిఆర్‌ పాలన వస్తే గాని మాగాణ కళకళలాడతాయని గుర్తు చేస్తున్నాయి

`కేసిఆర్‌ పాలనే తెలంగాణకు స్వర్ణయుగం

`మళ్ళీ కేసిఆర్‌ పాలన కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ జనం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రామ దండు గురించి రామాయణంలో చదవాం..పెద్దలు చెప్పగా విన్నాం..ఇప్పుడు కేసిఆర్‌ దండు కళ్లారా చూడండి. గులాబీ దండు గురించి రేపటి తరానికి చెప్పండి. భవిష్యత్తులో రామ దండు గురించేకాదు, గులాబీ దండు గురించి కూడా చెప్పుకుంటారు. వరంగల్‌లో జరిగే బిఆర్‌ఎస్‌ వజ్రోత్సవ సభను చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, బిజేపికి ముచ్చెటమటలు పట్టాలి. ఉక్కపోతలు పోయాయి. కంటిమీద కునుకు కూడా లేకుండా చేయాలి. అదే మా లక్ష్యం. అదే బిఆర్‌ఎస్‌ పార్టీ సభతో మా రజతోత్సవం. మళ్లీ తెలంగాణలో గులాబీ జయకేతనం కోసం తొలి అడుగుకు శ్రీకారం. బిఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు. తెలంగాణ జన జాతర. ఉద్యమ కాలంలో ఎలా అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు సభలకు బ్రహ్మరధం పట్టేవారో..ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో, బిఆర్‌ఎస్‌ అభిమానుల్లో అదే జోష్‌ కనిపిస్తోంది. అదే ఊపుతో తెలంగాణ మొత్తం వరంగల్‌ వైపు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎడ్ల బండ్ల నిండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటూ, రెపరెపలాడుతున్న జెండాలతో కొన్ని వేల బండ్లు వరంగల్‌ వైపు జతన్నాధ రధచక్రాలు కదులుతున్నట్లు దూసుకువస్తున్నాయి. తెలంగాణ చైతన్యాన్ని మేలు కొలుపేలా కేసిఆర్‌ రధ చక్రాలుగా రైతులు పరుగులందుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌కు జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇదీ బిఆర్‌ఎస్‌ అంటే. అదే కేసిఆర్‌ తెలంగాణ ప్రజల్లో చైతన్యమంటే..అదే తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ అందించిన చైతన్యమంటే అంటున్న ఉద్యమ కారుడు, సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నేటి దాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన రజత్సోవసభ విశేషాలు ఆయన మాటల్లోనే.
..ఉద్యమ కాలంలో ఉరకల్తెని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఆర్తి. కేసిఆర్‌ అంటేనే ఒక నమ్మకం. ఒక వ ఇశ్వాసం. ప్రజల మేలు కోరే ఏకైక నాయకుడుగా గుర్తింపు వుంది. అయినా తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాదన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ వస్తుందో..రాదో తెలియని సమయంలో పిడికిలెత్తి జై తెలంగాణ అని గర్జించిన నాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినా జై తెలంగాణ అంటూ ఎవరు వస్తారో..రారో తెలియని అమోమయ పరిసి ్దతుల్లో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన నాయకుడు కేసిఆర్‌. తర్వాత కొన్ని లక్షల మంది కేసిఆర్‌ను తయారు చేసి, మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల చేత జై తెలంగాణ అని నినదింపజేసిన నాయకుడు కేసిఆర్‌. ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతే విఫలనాయకుడిగా మిగలడం కన్నా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే చరిత్రలో నిలవాలన్న సంకల్పంతో అడుగులేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందంటే చావు నోట్లో తలపెట్టేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించని గొప్ప నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ దీక్ష చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సమాజమంతా వద్దని వారించినా, తెలంగాణ తేకపోతే నా ఉద్యమం వృధా..నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేని నాయకుడుగా బతకలేనని నిర్ణయం తీసుకున్న నాయకుడు కేసిఆర్‌. బహుషా ప్రపంచ చరిత్రలోనే కేసిఆర్‌ లాంటి ఉద్యమ కారుడు మరొకరు లేకపోవచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్లు ఎందురో వున్నారు. కాని ఫలితం ఆశించకుండా ఉద్యమాలు చేసిన వాళ్లున్నారు. కాని ఫలితమే తెలంగాణ అంతిమ లక్ష్యం కావాలని కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ సాధించగలిగారు. అంతటి బలమైన సంకల్పాన్ని పూనారు. అంతిమంగా తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడిరచారు. ఇలాంటి నాయకుడు నిన్నటి తెలంగాణ చరిత్రలో ఎవరూ లేరు. భవిష్యతు తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే బంగారం లాంటి తెలంగాణను తయారు చేసి కేసిఆర్‌ ఎప్పుడో పెట్టారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చినతెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కూడా కేసిఆర్‌. ఇలా రెండు రకాల విజయాలను తెలంగాణకు అందించిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు వుండరు. అందుకే తెలంగాణ అంటేనే కేసిఆర్‌..కేసిఆర్‌ అంటేనే తెలంగాణ..అలా అందమైన, అధ్భుతమైన, పాడి పంటలతో అలరాలుతూ, రైతులు రాజులుగా వర్ధిల్లుతున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో రైతులంతా సుఖ సంతోషాలతో వున్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం చేసి, తెలంగాణలో ప్రతి మూలన చివరి ఆయ కట్టు వరకు సాగు నీరిచ్చిన అపర భగీరధడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే మిషన్‌ కాకతీయ తెచ్చి, తెలంగాణలోని చెరువులన్నీటింటికీ పూర్వ వైభవం తెచ్చారు. చెరువులు బాగు చేయించారు. పూర్వం చెరువు ఎలా వుండేదో అలా తీర్చిదిద్దారు. రైతులే స్వయంగా పాలు పంచుకొని, బండ్లల్లో, ట్రాక్టర్లలో చెరువు మట్టి తీసుకెళ్లి, పొలాల్లో చల్లుకున్నారు. నిండిన చెరువు నుంచి ఊటలు మళ్లి, బావులు నిండడంతో సాగును పండుగ చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చి రైతు కష్టం తీర్చాడు. అర్ధరాత్రి, అపరాత్రి ఇచ్చిన కరంటు మూలంగా ఏ ఒక్క రైతు చనిపోకుండా చూసుకున్నారు. ఇరవైనాలుగు గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో రైతు తన వెసులుబాటును చూసుకొని, అవసరమైన మేరకు పొలానికి నీరు పెట్టుకున్నారు. పదేళ్లు బంగారు పంటలు పండిరచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తూ వస్తూనే రైతుకు కష్టం తెచ్చింది. రైతుల కళ్లలో కన్నీరు నింపింది. కాంగ్రెస్‌ కృత్రిమకరువును తెచ్చి రైతను అరిగోస పెడుతోంది. భూగర్భంలో చుక్క నీరు లేకుండా చేయడంతో ఆవిరైతున్న నీళ్లు రైతుకు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంపై ఆవిరైతున్న నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి. తెలంగాణలో అడుగుంటున్న భూగర్భజలాలు కాంగ్రెస్‌ పాలకుల మీద ఆక్రోషం వెల్లగక్కుతున్నాయి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటే కనికరించి, గెలిపించినందుకు తెలంగాణ తల్లి ఒడిలో చుక్క నీరులేకుండా చేస్తున్నారు. మళ్లీ ఒట్టిపోతున్న వాగులు, వంకలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శాపాలు పెడుతున్నాయి. ఎడారిగా మారిన పొలాల బీళ్లు నోరు తెరిచి, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నోళ్లు తెరిచి తిడుతున్నాయి. అందుకే కళ్లు మండుతున్న రైతు బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభలో ప్రభుత్వంపై సభ స్పూర్తి, సాక్షిగా, మళ్లీ కేసిఆర్‌ పాలన కోసం కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు తరలివస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దండు కట్టి వస్తున్నారు. అలా వస్తున్న రైతులను చూస్తే జనం గుండెల నిండా గులాభీ వనం విరబూసినట్లు కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. బిఆర్‌ఎస్‌ శ్రేణులో సంబురం నింపుతోంది. ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అని ఎదరుచూసి, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటికే దూరపు జిల్లాల నుంచి లక్షల మంది రైతులు మూడు రోజుల ముందే భయలుదేరి వస్తున్నారు. మిగతా రైతులు బయలుదేరుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరంగల్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవం. కేసిఆర్‌ మాటలే తెలంగాణకు వేదం. రజతోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఆ కుట్రలన్నీంటినీ తిప్పి కొట్టి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. బిఆర్‌ఎస్‌ పార్టీ రజత్సోవం అంటే తరతరాలు గర్వంగా చెప్పుకునేలా నిర్వహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ నాయకత్వానా గులాబీజెండాను ఎగరేస్తాం..బిఆర్‌ఎస్‌కు ఎదురులేదు..కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని ఎలుగెత్తి చాటుతాం…కేసిఆర్‌ కీర్తి ప్రపంచం చెప్పుకునేలా నడుచుకుంటాం.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే తరలి వెళ్దాం-భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షులు పైడిపాల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన కొత్తపెళ్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి పన్నెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈసభ చరిత్రలో నిలిచిపోతుందని ఈసభకు చింతకుంట గ్రామం నుండి చీమల దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్‌. ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్‌ సంకల్పం. ఈదిశగా వరంగల్‌ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తారు కెసిఆర్. ఇరవై ఐదువ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గళం, బలం, దళం, గులాబీ దండు. ఈదండులో చింతకుంట గ్రామం నుండి చీమల దండులా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగo అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కర్ణకంటి స్వప్న, గుబిరె సుజాత, వరలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు చిట్టిపల్లి నరేందర్, బెజ్జంకి సంపత్, భానతూ శ్రీకాంత్, మహేష్ గౌడ్, కమల్ గౌడ్, మణిదీప్, మల్లేశం, రవి, భాస్కర్ నాయక్, అమృత్, శంకర్, శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

#ఆర్టీసీ సంస్థ మనందరిదీ దానిని కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే.

# నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజిఎస్ ఆర్టిసి ) ఆర్టీసీ బస్సు లో ప్రయాణం అన్ని రకాల భద్రతతో పాటు సురక్షితమని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నరు
శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లో గల సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇటీవల డైల్ యువర్ డిఎం కార్యక్రమా ద్వారా ప్రయాణికుల సూచనలను సలహాలను స్వీకరించి వారి కోరిక మేరకు అదనపు బస్సు ట్రిప్పులను ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం పెంచడం జరిగిందన్నారు.
ఆర్టీసీ మన సంస్థ దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణం వద్దు మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం ముద్దు అని ప్రయాణికులకు తెలియజేశారు.
సమయపాల పాటించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రయాణికులు. స్థానికులు. తదితరులు పాల్గొన్నారు..

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని గండ్రరమణారెడ్డి వర్గం

జెండా ఎజెండా కింద పని చేస్తాం

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రచన్నయుద్ధం జరుగుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు పెద్ద నాయకుల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రమణారెడ్డి వర్గం టిఆర్ఎస్ పార్టీ మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మధుసూదనాచారి వర్గాన్ని పిలువక పోవడంతో చారి కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమనేత చారి గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య వాగ్దిత్వానికి దిగడం ఇందుకు నిదర్శనం. మొదటగా మేము కెసిఆర్, మధుసూదనా చారి టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఉద్యమంలో తిరగడం జరిగింది. మేము బతికున్నంత కాలం కేసీఆర్ , మధుసూదనా చారి ఎజెండా కిందనే పనిచేస్తా మని అన్నారు.మా పార్టీలోకి వలసగా వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు మా ఉద్యమ కారులను పట్టించుకోకపోవడం దీనిపై అధిష్టానాన్ని తెలియ పరచడం కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతుండడం జరుగుతుంది. ముఖ్యంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు, యూత్ కమిటీలు నిర్వహించి న కూడా ప్రాధాన్యత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

 

BRS

ఈనెల 27 బీఆర్ఎస్ రజ తోత్సవ సభను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం కోసం మండల ఉద్యమ నాయకులు అందరూ కంకణం కట్టుకున్నా రు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ పొడిశెట్టిగణేష్, మండల అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి రవీందర్,సీనియర్ ఉద్యమ కారుల నాయకులు బలిజే నరసింహారావులు,వికలాం గుల రాష్ట్ర నాయకులు గజ్జి శంకర్ ,మాజీ యూత్ మండల అధ్యక్షులు నాగరాజు, బెరుగు తరుణ్ గోపి, కొత్తగట్టు సాయి, ముంజలా నాగరాజు,గాదె రాజేందర్,రాజు మహ్మద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి.!

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం మైనార్టీలు
జమ్మికుంట మండల ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ అన్నం తిన్నావా లోని వైశారణ్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పైశాచిక మరణకాణం ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతోన్మాదమే తప్ప మతాలతో సంబంధం ఉండదని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ విభిన్న మత సంస్కృతులకు నిలయం మన దేశానికే గర్వకారణమైన జమ్ము కాశ్మీర్లో గతంలో ఉన్న విపత్కర పరిస్థితులను ఎదురుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు పరుస్తూ జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఉగ్రవాద మూలాలు లేని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పర్యటన పర్యటన సురక్షితంగా ఉన్నారు అని యావత్ దేశం సంతోషించే ఈ తరుణంలో గతంలో పుల్వామా ఘటన కంటే దారుణమైన రీతిలో పహాల్గాం ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం ముస్లిం ఐక్యవేదిక నాయకులు మౌలానా నజీర్, జాకీర్, షేక్ సాబీర్ అలీ, డాక్టర్ ఫిరోజ్, సర్వర్ పాషా ఫయాజ్,ఖాదర్ సుఫియాన్,సల్మాన్, సబ్జాద్,సాదిక్, అమీర్ షేక్, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న దిమ్మే తొలగించాలి

రోడ్డు పై ప్రమాదకరంగ ఉన్న
దిమ్మే తొలగించాలి
వనపర్తి నేటిదాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని 33 వ వార్డులో రిలయన్స్ మార్ట్ పక్కన నూతనంగా సిసి రోడ్డు మురుగు కాలువ నిర్మాణం ప్రారంభమైన సందర్భంగా పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న రిలయన్స్ స్మార్ట్ పక్కన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మురుగు కాల్వ పైన మరియు రోడ్డుపై ఉన్నటువంటి దిమ్మెను తొలగించి మోడల్ గా పిల్లర్ వేసి రోడ్డుపైన ప్రమాదంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ను నూతనంగా నిర్మించాలని వార్డు ప్రజలకు రోడ్డుపైన వెళ్లే ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వుంగుళం తిరుమల్ విద్యుత్ ఏఈ రాజయ్య గౌడ్ కు సమాచారం ఇవ్వగా అక్కడి కి వచ్చి పరిశీలించి వెంటనే వీటిని మురుగు కాలువపై రోడ్డుపై ఉండకుండా పక్కనే నిర్మాణం చేసే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తిరుమల్ తెలిపారు

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీద్వాదశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ గణపతి,శివ మార్కండేయ, సుబ్రహ్మణ్య స్వామి,పంచముఖ ఆంజనే యస్వామి,ఆదిత్యాది నవగ్రహ దేవాలయం సముదాయము సుందరముగా నిర్మాణము చెయ్యడం జరిగింది. స్వామి వారిని దర్శింప వచ్చిన భక్తుల పట్ల కోరిన కోర్కెలు కొంగు బంగారం అగుచూ ప్రముఖ క్షేత్రం నందు ఒకటిగా ఈ దేవాలయము పరిగణించ బడుతున్నది ప్రత్యేక తెలంగా ణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుట ద్వారా తెలంగాణ రాష్ట్రం నందు హనుమకొండ జిల్లాలోని శాయంపేట గ్రామం యొక్క విశిష్టతను చాటు తుంది. ప్రతిష్ట జరిగే ద్వాదశ సంవత్సరములు అగుచున్న సందర్భంలో స్వస్తిశ్రీ విశ్వవసు నామ సంవత్సర వైశాఖ శుద్ధ బుధవారం తేదీ 30- 04- 2025 నుండి 3-05-2025 షష్టి శనివారం వరకు ద్వాదశ వార్షికోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుచున్నవి కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదాలు పొందాలని ప్రజలను కోరారు

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్రదాడికి నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ గాంధీ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు శాంతియుత కొవ్వొత్తుల రాణి నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు డాక్టర్లు ప్రైవేటు టీచర్లు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు ఈ దాడితో భారతదేశం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిందన్నారు ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు

ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న దేశం

మరచిపోలేని విధంగా పాకిస్తాన్‌ను శిక్షించాలి

ముక్త కంఠంతో కోరుతున్న దేశం

భారత్‌తో తక్కువ స్థాయి యుద్ధాన్ని కోరుకుంటున్న అసిం మునీర్‌

అంతర్గత సమస్యలనుంచి బయటపడేందుకే

సైన్యాన్ని చీదరించుకుంటున్న పాక్‌ ప్రజలు

హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రస్తావన భారత్‌ను రెచ్చగొట్టేందుకే

అసిమ్‌ మునీర్‌ ప్రకటన తర్వాతే ఉగ్రదాడి

హిందువులనే టార్గెట్‌ చేస్తూ హత్యలు

విషాదాన్ని మిగిల్చిన సంతోష క్షణాలు

కొత్త జంటల జీవితాలను ఛిద్రంచేసిన ఉగ్రవాదులు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఏప్రిల్‌ 22న దక్షిణ కశ్మీర్‌కు చెందిన పహల్గామ్‌లోని బైసరాన్‌ పచ్చిక మైదానంలో జరిగిన ఉగ్రఘాతుకంలో 27మంది హిందువులు ప్రాణాలు కోల్పోవడంతో దేశం ఆగ్రహావేశాలతో అట్టుడికి పోతున్నది. లష్కరే తోయ్‌బా సీనియర్‌ కమాండర్‌ సైఫుల్లా కసౌరీ ఈ దారుణానికి ప్రణాలిక ర చించినట్టు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ అధినేత హఫీజ్‌ సయీద్‌కు ఇతడు అత్యంత సన్నిహి తుడు. ఉగ్ర ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు మరచిపోలేని విధంగా శిక్షించాలన్న అభిప్రాయాలు గట్టిగా వ్యక్తమవు తుండటం సహజమే. గతంలో బాలాకోట్‌ దాడులు, సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసినప్పటికీ పాకిస్తాన్‌ ఎంతమాత్రం తన బుద్ధిని మార్చుకోలేదన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. లోతుగా విశ్లేషిస్తే, దివాలా అంచున వుండి, బచ్చపట్టుకొని ప్రపంచదేశాల వద్ద అప్పులకోసం అగచాట్లు పడుతున్న పాకిస్తాన్‌ నిజానికి ఇటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే అవకాశం లేదు. ఎందుకంటే భారత్‌ ప్రతీకార చర్యను ఎదుర్కొనే సామర్థ్యం దానికి లేదు. ఆవిషయం అక్కడి సైన్యానికి కూడా బాగా తెలుసు! అటువంటప్పుడు ఎందుకని ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిరదనేది ఎవరికైనా సహజంగా వచ్చే సందేహం. ఇందుకు జాగ్రత్తగా విశ్లేషిస్తే సమాధానాలు దొరుకుతాయి. ఇటీవల పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ తన ప్రసంగంలో కశ్మీర్‌ తమకుజుగులర్‌ నాడి వంటిదని వెల్లడిరచారు. దీన్ని అరిగిపోయిన రికార్డుగా చాలామంది కొట్టిపారేశారు. నిజానికి ఇక్కడ మునీర్‌ అన్నమాటలను పరిశీలిస్తే, ‘హిందువులు’ మరియు ‘ముస్లిం’ సంప్రదాయాలు భిన్నమని పేర్కొ నడమే కాదు, ద్విజాతి సిద్ధాంతాన్ని మరోసారి సమర్థిస్తూ మాట్లాడా రు. అంటే ఇక్కడ కశ్మీర్‌తో పాటు హిందువులపై విద్వేషాన్ని వెళ్లగక్కిన కొద్దిరోజులకే పహల్గామ్‌లో పర్యాటక ఆనందాన్ని ఆ స్వాదిస్తున్న సామాన్య హిందువులపై ప్రధానంగా పురుషులను టా ర్గెట్‌ చేసి మరీ దారుణంగా ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడం ఇక్కడ కీలకం. పాకిస్తాన్‌ను ఏకతాటి మీదికి తీసుకురావాలంటే అక్కడి రాజకీయ నాయకులు లేదా సైన్యానికి భారత్‌ను తెరమీదికి తీసుకు రావడమే మార్గం. ఇది తప్ప వారికి మరోదారి లేదు. భారత్‌ పట్ల నరనరానా విషాన్ని నింపుకున్న అత్యధికశాతం పాకిస్తానీలకు హిందువులంటే విపరీతమైన ద్వేషం.ఈ బలహీనతను రెచ్చగొట్టడం ద్వారా పాక్‌ రాజకీయ నాయకులు, సైన్యం తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్నాయి.

అసలు నిజం తెలుసుకున్న పాక్‌ ప్రజలు

ఇటీవలికాలంలో సోషల్‌ మీడియా పుణ్యమాని రాజకీయ నాయకులు, సైన్యం ఎప్పటికప్పుడు కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం, భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కడం ద్వారా తమను మోసం చేస్తున్నార న్న సంగతి పాక్‌ ప్రజలకు బాగా అర్థమైంది. ముఖ్యంగా ఇటీవల పాక్‌లో బెలూచ్‌ వీరులు ఏకంగా రైలునే హైజాక్‌ చేసి, రెండువందలమంది సైనికులను హతం చేయడం, సైనిక స్థావరాలపై బెలూచ్‌ తిరుగుబాటు దారులు విజయవంతంగా చేస్తున్న దాడులు, బెలూచ్‌ ప్రాంతాలకు సైనికులు వెళ్లలేని పరిస్థితులు, వాయువ్య సరిహద్దు ప్రాంతాల్లో దాదాపు 40శాతం భూభాగం ఆఫ్గనిస్తాన్‌ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిందన్న వార్తలతో పాకిస్తాన్‌ ప్రజలకు అసలు వాస్తవాలు తెలిసిరావ డం మొదలైంది. ముఖ్యంగా అసిమ్‌ మునీర్‌ చేతగానితనాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా నిరసిస్తు న్నారు. ప్రస్తుతం బెలూచిస్తాన్‌, పీఓజేకేల్లో అల్లర్లు, ఏకంగా సైనికులపైనే దాడులు, పంజాబ్‌ ఆధిపత్యంపై సింధ్‌ ప్రజల్లో వ్యక్తమవతున్న ఆందోళన, నిరసన ప్రదర్శనలు ఒకవైపు, మరోవైపు పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి కావడం, ఒకప్పుడు ముస్లిం దేశాల్లో అణ్వస్త్రాలు కలిగిన దే శంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పాక్‌ సైన్యం డొల్లతనం బయటపడటం వంటి అంశాలు అసీంమునీర్‌కు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశాలు. 

ఇటువంటి పరిస్థితుల్లో ‘భారత్‌ బూచి’ మాత్రమే తమను ప్రస్తుత కష్టాలనుంచి గట్టెక్కించే మార్గ మని తలచి ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాలలోని భిన్నత్వమనే కొత్త అంశాన్ని లేవనెత్తారు. ఇక్కడ కశ్మీర్‌ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడం వల్ల ప్రయోజనం వుండదన్న ఉద్దేశంతో బహుశా ఆయన దీంతోపాటు, రెండు మతాల సంప్రదాయాలను ముందుకు తెచ్చినట్టుగా భావించాలి. ఇందులో భాగంగానే తమకు అనుకూల ఉగ్రవాద గ్రూపుల ద్వారా కశ్మీర్‌లో ‘హిందువులను’ హతమార్చడం ద్వారా పాక్‌ ప్రజలనుంచి సానుకూలతను పొందే యత్నంగా కూడా దీన్ని పరిగణిం చవచ్చు. ప్రస్తుత భారత ప్రభుత్వం గతానికి భిన్నంగా కఠిన వైఖరి అవలంబిస్తుందన్న సంగతి తెలుసు కనుక అసీమ్‌ మునీర్‌ ఈవిధంగా రెచ్చగొట్టి భారత్‌ను ఏదోవిధంగా కయ్యానికి దిగేవి ధంగా చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిస్థాయి యుద్ధం కాకపోయినా, కొద్దిస్థా యి సంఘర్షణ జరిగేలా చేసి పాక్‌ ప్రజల్లో తానొక హీరోగా నిలవాలన్న కాంక్ష కూడా అసిమ్‌ మునీర్‌కు వుండవచ్చు. కానీ ఈ దుశ్చర్యవల్ల కలిగే దీర్ఘకాల దుష్ఫలితాలకంటే, తాత్కాలిక ఉప శమనానికే ఆర్మీ చీఫ్‌ ప్రాధాన్యత ఇచ్చారని భావించాలి.

నిజం చెప్పాలంటే 370 అధికరణం రద్దు తర్వాత క్రమంగా ఇస్లామిక్‌ దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్థలు కశ్మీర్‌ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం మానేశాయి. ఫలితంగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని ఒక అరిగిపోయిన రికార్డు మాదిరిగా ఎన్నిసార్లు వినిపించినా ఆలకించేనాధుడే కరవయ్యాడు. ఆవిధంగా పాక్‌ ఈ విషయంలో ఏకాకిగా మిగిలింది. ఇదే సమయంలో జమ్ము`కశ్మీర్‌లో ఎన్నికలు జరగడం, పర్యాటకరంగం బాగా ఊపందుకోవడం, పాకిస్తాన్‌కు కొ రుకుడు పడటంలేదు. ఇదేసమయంలో అంతర్గతంగా దేశం అల్లకల్లోలంగా మారడం, సైన్యం తన పలుకుబడిని కోల్పోతున్న నేపథ్యంలో, అసిమ్‌ మునీర్‌ ఈసారి కొత్తగా ‘హిందూ’, ‘ముస్లిం’ సంప్రదాయాల పేరుతో కొత్త పల్లవి ఎత్తుకున్నారని భావించాల్సి వుంటుంది. 

భారత్‌ ప్రతీకారం

అమాయక హిందూ పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాద చర్యకు ప్రతీకారంగా భారత్‌ పాకిస్తాన్‌పై తక్షణం తీసుకున్న ఐదు చర్యల్లో సింధూనదీ జలాల ఒప్పందం కీలకం. మిగిలిన వాటిల్లో వీసాల రద్దు, దౌత్యవేత్తల కుదింపు వంటివి మామూలుగా జరిగేవే. 1960లో రెండు దేశాల మధ్య జరిగిన ఈ సింధూనదీ జలాల ఒప్పందం ద్వారా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నె హ్రూ పాకిస్తాన్‌ పట్ల ‘అపరిమిత’ ఉదారంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు కశ్మీర్‌లో ఎన్ని ఉగ్ర సంఘటనలు జరిగినా, పాకిస్తాన్‌తో నాలుగు యుద్ధా లు జరిగినా భారత్‌ ఎప్పుడూ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దుచేయలేదు. సంయమనంతోదాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. నేటికి సహనం చచ్చిపోయిన భారత్‌ ఈ ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేసింది. గతంలో ఈ ఒప్పందం కారణంగా కిషన్‌గంగ వంటి ప్రాజెక్టుల్లో ఎప్పటికప్పుడు పూడికను తొలగించి నీటితో నింపడానికి వీలయ్యేది కాదు. ముఖ్యంగా దిగువ ప్రాంతంలోని పాక్‌ రైతుల ఇబ్బందులను దృష్టిలో వుంచుకొని, నీటి విడుదల కొనసాగేది. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దు తో ఈ అడ్డంకి తొలగింది. అంతకుముందు మాదిరిగా సింధూ, జీలం, చీనాబ్‌ నదుల వరదల కు సంబంధించి పాకిస్తాన్‌తో సమాచారాన్ని పంచుకునేది. ఇప్పుడు ఇది నిలిచిపోయింది. పాకి స్తాన్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్న కారణంగా ముందుకు సాగని కిషన్‌గంగ, బాగ్లిహార్‌, రాటిల్‌వంటి ప్రాజెక్టుల పనులు మరింత ఊపందుకుంటాయి. ఒప్పందం కారణంగా ముఖ్యంగా జీలం,చీనాబ్‌ నదీ ప్రాజెక్టుల్లో ఒక పరిమితికి మించి నీటి నిల్వ సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడా సమస్యతీరిపోయింది. అయితే ఒప్పందాన్ని ‘సస్పెండ్‌’ చేయడం వల్ల ఒప్పందాన్ని పూర్తిగా రద్దుచేసినట్టుకాదు. కాకపోతే ఈ చర్య వల్ల పాకిస్తాన్‌పై మనదేశం ఒత్తిడి తీవ్రతను బాగా పెంచగలుగుతుంది. జమ్ము`కశ్మీర్‌ పశ్చిమ ప్రాంతంలో నత్తనడకన నడుస్తున్న అనేక ప్రాజెక్టులను మరింత వేగంగా భారత్‌ పూర్తిచేయగలుగుతుంది. అయితే ఇవన్నీ జరగడానికి చాలా సమయం పట్టవచ్చు. మొత్తంమీద చెప్పాలంటే అసిం మునీర్‌, తాత్కాలిక ప్రయోజనం కోసం చేపట్టిన రెచ్చగొట్టే చర్య ఇప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రాంతం మొత్తం నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితికి దారితీ సింది. ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడంటే ఇదే మరి!

పీఓజేకేలో కొనసాగుతున్న ‘ఉగ్ర’ క్యాంపులు

నిఘావర్గాల సమాచారం ప్రకారం 150`200 మంది సుశిక్షితులైన ఉగ్రవాదులు, పాక్‌ సైన్యం సహాయంతో జమ్ము`కశ్మీర్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా వున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోని పీఓజేకేలో 42 ఉగ్ర క్యాంపులు చురుగ్గా వున్నట్లు భారత నిఘావర్గాలు అంచనా వేస్తున్నా యి. కశ్మీర్‌లోయలో 70మంది, జమ్ము, రాజోరీ, పూంచ్‌ ప్రాంతాల్లో 60`65మంది ఉగ్రవాదు లు చురుగ్గా వున్నట్టు, వీరిలో 115మంది పాక్‌ జాతీయులన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే జమ్మూకు చెందిన ఐదు జిల్లాలు, కశ్మీర్‌లోని బారాముల్లా, బండిపుర, కుప్వారా, కుల్గామ్‌ జిల్లాల్లో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాదుల్లో చాలామందిని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ముఖ్యంగా బారాముల్లా జిల్లాలో నిర్వహించిన 9 ఆపరేషన్లలో 14మంది విదేశీ ఉగ్రవాదులను భద్రతా దళాలుహతమార్చాయి. ఇదిలావుండగా ఏప్రిల్‌ 24 ఉదయం నుంచి ఉధంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్‌ మొదలైనట్టు వార్తలు వస్తున్నా యి. భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్‌, జమ్ము కశ్మీర్‌ పోలీసు దళానికి చెందిన స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఫోర్స్‌లు గత పదిరోజులుగా లాసానా అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాలింపు చర్య లు కొనసాగిస్తున్నాయి. ఏప్రిల్‌ 14న ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతాదళాపై కాల్పులు జరపడంతో అప్పటినుంచి ఈ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. దట్టమైన అటవీ ప్రాంతాలు, కఠినమైన భౌగోళిక స్వరూపం ఈ ఆపరేష్లన్లకు ప్రధాన అడ్డంకిగా మారింది.ఇదిలావుండగా పహల్గామ్‌ సంఘటన తర్వాత బారాముల్లా జిల్లాలో ఏప్రిల్‌ 23న మనదేశంలోకిప్రవేశిస్తున్న ఉగ్రవాదుల్లో ఇద్దరిని భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం పహల్గామ్‌ ప్రాంతంలో శ్మశాన ప్రశాంతి కనిపిస్తోంది. బాధితులకు సంఫీుభావంగా ఈ ప్రాంతంలోని వ్యాపారులు, పౌరసంఘాలు ఒకరోజు బంద్‌ పాటించాయి. బారాముల్లా, పూంచ్‌, శ్రీనగర్‌ మరియు ఖాడ్‌ గ్రామంలో ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. 

 ఉగ్రవాదులకు ఆత్యాధునిక పరికరాలు

దేశంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులు గతంలో మాదిరిగా కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానా న్ని వాడుతుండటం గమనార్హం. నలుగురైదుగురు ఒక గ్రూపుగా ఏర్పడి అంచెలంచెలుగా మనదేశంలోకి ప్రవేశించడం ఒక వ్యూహం. వీరు స్థానిక జనాభాతో చాలా కాలం కలివిడిగా వుండటంతో భద్రతా దళాలకు వీరిని కనిపెట్టడం కష్టంగా మారింది. ఆధునిక రైఫిల్స్‌, నైట్‌ విజన్‌ గాగుల్స్‌, అత్యాధునిక టెలికాం పరికరాలు వీరు వాడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్‌ సై న్యం వద్ద మాత్రమే వుండే ఇటువంటి చైనా తయారీ పరికరాలను ఉగ్రవాదులకు అందజేస్తుండ టం తాజా పరిణామం. 

రైల్వేల ముందుజాగ్రత్త చర్యలు

పహల్గామ్‌ సంఘటన తర్వాత భారతీయ రైల్వే అధికార్లు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇటీవల ప్రారంభించిన ఉధంపూర్‌ాశ్రీనగర్‌ాబారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల రైల్వే మార్గంపై భ ద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో రెండు సెగ్మెంట్లుగా రైళ్లు నడుస్తున్నాయి. మొదటిది సంగల్డన్‌ నుంచి బారాముల్లా (184కి.మి) ఒక సెక్షన్‌ కాగా, ఉధం పూర్‌ాకాట్రా (25కి.మి.) మరో సెక్షన్‌. ఈ రెండు లైన్లను అనుసంధానించడం ద్వారా రైళ్లను నడుపుతున్నారు. కాట్రాసంగల్డన్‌ మధ్య 63 కిలోమీటర్ల రైలు మార్గానికి ప్రారంభోత్సవం జరగా ల్సివుంది. ఏప్రిల్‌19న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఈ రైలు మార్గాన్ని కూడా ప్రధాని నరేం ద్రమోదీ ప్రారంభించాల్సి వుంది. వాతావరణం బాగాలేకపోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడిరది. కాట్రాబనీహాల్‌ సెక్షన్‌లోని 111 కిలోమీటర్ల ప్రాంతం అత్యంత కీలకమైంది. ప్రపంచంలో ఎత్తయిన చీనాబ్‌ వంతెన, దేశంలోనే అత్యంత పొడవైన (12.7 కి.మి.) సొరంగం ఈ సెక్షన్‌ లోనే వున్నాయి. 

ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరిక

పహల్గామ్‌ సంఘటనకు కారకులైనవారు, అందుకు కుట్రలు పన్నివారిని అంచనాలకు అతీతం గా శిక్షించి తీరతామని ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 24న బిహార్‌లోని మధుబనిలో జరిగిన ఒకసమావేశంలో హెచ్చరించారు. మానవత్వ సమర్థకులు మాతోనే వున్నారు, దేశం యావత్తూ ఒక్క తాటిపై నిలిచింది. శిక్ష పడకుండా ఉగ్రవాదులు తప్పించుకోలేరు. 140కోట్ల మంది ప్రజల ఆత్మ విశ్వాసమే ఉగ్రవాద వెన్నెముకను విరిచేస్తుందని అన్నారు. ప్రధాని హెచ్చరికతో ప్రభుత్వం మరో కఠినచర్యకు ఉపక్రమించనున్నదనేది స్పష్టమైంది.

కేసీఆర్‌ అంటేనే ప్రభంజనం.. బీఆర్‌ఎస్‌ అంటేనే తెలంగాణ ఆత్మ గౌరవం

 

కేసీఆర్‌ సభ అంటేనే ప్రజలు పట్టే బ్రహ్మరథం!

-బీఆర్‌ఎస్‌ రజతోత్సవం… తెలంగాణ ప్రజల వేడుక వైభవం!

-బీఆర్‌ఎస్‌ రజతోత్సవం.. తెలంగాణ అంతటా పండగ వాతావరణం

ప్రతి ఒక్కరూ మా ఇంటి పండుగ అని వరంగల్‌ బయలుదేరుతున్నారంటున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో రజతోత్సవ సభ ఏర్పాట్లు, నిర్వహణపై ముచ్చటించిన విశేషాలు.

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం చేసేందుకు ప్రజలు కదులుతున్నారు

`కేసీఆర్‌ ను చూడాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది

`కేసీఆర్‌ చెప్పే మాటలు వినాలని ప్రపంచం మొత్తం చూస్తోంది

`బీఆర్‌ఎస్‌ ను తెలంగాణ సమాజం మొత్తం ఆశీర్వదిస్తోంది

`తెలంగాణ కోసం కేసీఆర్‌ పడిన శ్రమకు నిదర్శనం రాష్ట్ర ఆవిర్భావం

`నిన్నటితరం గోసలు..నేటి తరం ఆశలు తీర్చిన పుణ్య పాలకుడు కేసీఆర్‌

`గుప్తుల కాలం పుస్తకాలలో చదువుకున్నాం

`ఆ స్వర్ణ యుగం కేసీఆర్‌ పాలనలో కళ్లారా చూశాం

`అరవై ఏళ్ల గోసను పదేళ్లలో తీర్చిన కేసీఆర్‌ అందించిన సంక్షేమం అందుకున్నాం

`కుటిల రాజకీయ కాంగ్రెస్‌ మోసం ఏడాదిగా అనుభవిస్తున్నాం

`ప్రజల మేలు కోరలేని కాంగ్రెస్‌ వల్ల నష్టపోతున్నాం

`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్‌ మీద మర్లపడదాం

`మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవం నిలుపుకుందాం

`కేసీఆర్‌ పాలన మళ్ల తెచ్చుకొని సుభిక్షమైన తెలంగాణ చూద్దాం

`కేసీఆర్‌ పాలనలో మళ్ల ప్రతి రోజు పండగ రైతుల కళ్లలో చూద్దాం

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవానికి దండుగా కదులుదాం

`కేసీఆర్‌ నాయకత్వానికి మనమందరం సంఫీుభావం తెలుపుదాం

`మరోసారి తెలంగాణ ప్రగతికి పునరంకితమౌదాం

`జై కేసీఆర్‌, జై జై కేసీఆర్‌ అని జేజేలు పలుకుదాం

`రండి..కదలి రండి..లక్షలాదిగా వచ్చి వరంగల్‌ సభను విజయవంతం చేద్దాం

`మనమంతా తెలంగాణ కోసం కేసిఆర్‌ వెనకే వున్నామని నిరూపిద్దాం

`కాంగ్రెస్‌ గుండెల్లో నిద్రపోదాం..

`ఇక కాంగ్రెస్‌ కు నిద్రలేని రాత్రులు చూపిద్దాం

`బీఆర్‌ఎస్‌ బలమేమిటో రజతోత్సవ సభతో నిరూపిద్దాం

`ప్రజలారా…తరలిరండి…జై తెలంగాణ అని జై కొట్టండి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

కాంగ్రెస్‌ అంటేనే ప్రజలకు కష్టాలు. కాంగ్రెస్‌ వస్తేనే ప్రజలు కన్నీళ్లు. కాంగ్రెస్‌ వచ్చిందంటేనే తెలంగాణకు కరవు. కాంగ్రెస్‌ అంటేనే తెలంగాణ తెర్లు. ఇది మరోసారి రుజువైంది. తెలంగాణ మళ్లోసారి తెర్లవుతోంది. పది సంవత్సరాలు కేసిఆర్‌ పాలనలో పచ్చగా వున్న తెలంగాణ మళ్లీ ఎండుతోంది. పండుటాకులా రాలిపోతోంది. రైతులు గోస పడుతున్నారు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్షేమం ఆగిపోయింది. అభివృద్ది కుంటుపడిపోయింది. ప్రగతి ఆనవాలు లేకుండాపోయింది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలు చుట్టుముట్టాయి. పాలన చేతగాని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేని కాంగ్రెస్‌ వల్ల తెలంగాణ ఎడారిగా ఏడాదిలోనే మారిపోయింది. సరిగ్గా ఏడాదిన్నర క్రితం వరకు తెలంగాణలో ఎటు చూసినా నీళ్లు. పచ్చనిపొలాలు. పాడిపంటలు సమృద్ది. రైతుల సంతోషాలు. కనిపించేవి. కాని కాంగ్రెస్‌ ప్రజలను మోసి అధికారంలోకి వచ్చిన మళ్లీ ప్రజలకు నీళ్లివ్వాల్సిన సమయంలో కన్నీళ్లు పెట్టుకునేలాచేస్తోంది. ప్రజలను ఆగమాగం చేస్తోంది. అందుకే తెలంగాణ ప్రజలు మా నాయకుడు కేసిఆర్‌ కావాలి. మా కేసిఆర్‌ మళ్లా రావాలి. మా కేసిఆర్‌ పాలన మేం చూడాలని కోరుకుంటున్నారు. ఏమరపాటుతో చేసిన చిన్న అలక్ష్యం..నిర్లక్ష్యం రూపంలో వేదించుకుతింటోంది. జనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీడిరచుకుతింటోంది. అందుకే ప్రజలంతా రాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా బిఆర్‌ఎస్‌ నూరు స్ధానాలన గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా వున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే ఓ ప్రభంజనం. ఓ మలయమారుతం. ఆయన పాలనా కాలమంతా ప్రజలు చల్లగా వున్నారు. తెలంగాణ సుభిక్షంగా వుంది. కష్టాలు, కన్నీళ్లు దరి చేరకుండా కేసిఆర్‌ ప్రజలను కళ్లలో పెట్టుకొని చూసుకున్నాడు. తెలంగాణకు పదేళ్ల కాలంలోనే వందేళ్ల సంక్షేమాభివృద్ది అందించారు. ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నాడు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత గొప్పగా తీర్చిదిద్దారు. అలా కళకళలాడుతున్న తెలంగాణపై కాంగ్రెస్‌ నాయకులు నిప్పులు పోసుకున్నారు. ఇలాగే కేసిఆర్‌ పాలన సాగితే మరో వందేళ్లయినా గెలవడం కష్టమనుకొని, లేనిపోని అబద్దాలు ప్రచారం చేశారు. మోసపు హమీలతో అదికారంలోకి వచ్చారు. ప్రజలను నిలువునా ముంచుతున్నారు. ఈ బాధలు భరించలేక ప్రజలు కేసిఆర్‌ ఓదార్పు కోసం చూస్తున్నారు. కేసిఆర్‌ ఇచ్చే ధైర్యం కోసం చూస్తున్నారు. కేసిఆర్‌ చెప్పే నాలుగుమాటలు వేదమంత్రాలుగా పనిచేస్తాయి. భవిష్యత్తు మీద భరోసా కల్గుతుందన్ననమ్మకంతో ప్రజలు వరంగల్‌ సభకు తండోప తండాలుగా వచ్చేందుకు కదులుతున్నారు. చీమల దండు భయలుదేరినట్లు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని వేల మంది అటు ఆదిలాబాద్‌ నుంచి మొదలు, ఇటు ఖమ్మం, నల్లగొండ, మహాబూబ్‌ నగర్‌లనుంచి బండెనుకు బండి కట్టుకొని బయలుదేరారు. కేసిఆర్‌ సభ అంటేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని చెప్పడానికి ఎడ్ల బండ్ల మీద భయలుదేరిన రైతులే సాక్ష్యం. బిఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ ఇవరై ఐదుసంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు తెలంగణ ఉద్యమాన్ని భుజనా మోసింది. తెలంగాణ తెచ్చేదాకా, కేంద్రం ఇచ్చేదాకా కొట్లాడిరది. తెగించి పోరాటం చేసి, తెలంగాణ సాదించింది. తెలంగాణ కోసం ఉద్యమ రాజకీయ పోరాటంతో తెలంగాణ సాధించిన కేసిఆర్‌ పాలన పదేళ్లు సాగింది. మొత్తంగా ఇప్పుడు బిఆర్‌ఎస్‌ పార్టీ తన రజతోత్సవ వేడుకను వరంగల్‌ వేదికగా జరుపుకుంటోంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటేనే తెలంగాణ ప్రజలవేడుక వైభోగంగా కళ్లనిండా కనిపిస్తోంది. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ వేళ తెలంగాణ అంతటా పండుగ వాతావరణం, బిఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల కోలాహలమే కనువిందు చేస్తోంది. ప్రతి పల్లె, పట్నం అన్న తేడా లేకుండా, ఉద్యమ కాలంలో సభలకు వచ్చినట్లే ఇంటికొకరు వచ్చేందుకు సిద్దమౌతున్నారు. లక్షల్లో వరంగల్‌ వైపు అడుగులేస్తున్నారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ , నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆవిర్భావ సభ ముచ్చట్లు ఆయన మాటల్లోనే…

చాల కాలం తర్వాత కేసిఆర్‌ను కళ్లారా చూసుకోవాలని తెలంగాణ ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఉద్యమకాలంలో కూడా కేసిఆర్‌ చెప్పే మాటల కోసం తెలంగాణ ప్రజలే కాదు, ఆంద్రాకు చెందిన వాళ్లు, ప్రపంచమంతా ఎదురుచూసేది. తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా ఆయన మాటలు వినేందుకు ప్రపంచమంతాఎదురుచూస్తోంది. కేసిఆర్‌ అనే నాయకుడు కారణజన్ముడు. అందుకే కొన్ని కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యుడయ్యారు. తెలంగాణ ప్రజల చేత కొలువబడుతున్నారు. తెలంగాణ సాధన అంటే ఆషామాషీగా జరిగిన వ్యవహారం కాదు. తెలంగాణ ఎవరో ఇచ్చిందికాదు. పద్నాలుగేళ్లపాటు, కేసిఆర్‌ అలుపెరగని పోరాటం చేయడం వల్ల వచ్చింది. తెలంగాణ సమాజమంతా కేసిఆర్‌తో నడవడం వల్ల వచ్చింది. నాలాంటి కొన్ని లక్షల మంది కార్యకర్తలు కేసిఆర్‌తో కలిసి కొట్లాడితే వచ్చింది. పద్నాలుగేళ్ల నిరంతర పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణ కోసం కేసిఆర్‌ పడని కష్టం అంతా ఇంతాకాదు. ఎదుర్కొన్న సమస్యలు కూడా చిన్నవి కాదు. ఎన్నో బెదిరింపులు, ఎన్నో అదిరింపులు…ఎన్నో వేధింపుల మధ్య అదరకబెదరక కేసిఆర్‌ తెచ్చిందే తెలంగాణ. అందుకే కేసిఆర్‌ యుగపురుషుడయ్యారు. తెలంగాణ కోసమే పుట్టిన కారణజన్ముడని ప్రజలు కొనియాడుతున్నారు. తెచ్చిన తెలంగాణను పదేళ్లలో అన్ని రంగాలలో అభివృ ద్ది చేశారు. ఎవరూ ఊహించని విజయాలు తెలంగాణకు అందించారు. బంగారు తెలంగాణ ఆవిష్కరించారు. అసలు తెలంగాణ వస్తుందనే ఎవరూ అనుకోలేదు. కాని తెలంగాణ ప్రజల కల నెరవేర్చాలని కేసిఆర్‌ కంకణం కట్టుకొని, ఎత్తిన పడికిలి దించకుండా పద్నాలుగేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. ఆత్మ త్యాగానికి కూడా సిద్దమయ్యారు. బతికినా, చచ్చినా తెలంగాణ రాష్ట్రంలోనే అని తెగించి కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌ అందుకే తెలంగాణ వచ్చింది. ఆయన పాలనలోనే సుబిక్షమైంది. అందరూ చిన్న తనంలో గుప్తుల కాలం స్వర్ణయుగమని చదువుకున్నాం. కాని అది ఎలా వుంటుందో కూడా అప్పుడు అర్ధం తెలియదు. కాని కేసిఆర్‌ పాలనలా వుంటుందని తెలిసింది. గుప్తుల పాలనకు మించిన స్వర్ణయుగాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి కళ్ల్లలో ఆనందం నింపారు. రైతులను రాజులను చేశారు. రైతు కష్టం తీర్చారు. తెలంగాణ లో సాగు అంటే భయపడి పారిపోయిన రైతులను మళ్లీ సాగులోకి రప్పించారు. వ్యవసాయం దండుగ కాదు..పండగ చేసి చూపించారు. తెలంగాణ భూముల్లో తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన వారికి పుట్లకొద్ది పంటలు పండిరచి చూపించిన నాయకుడు , పాలకుడు కేసిఆర్‌. తెలంగాణలో సాగుకు నీరివ్వడం ఎవరి తరం కాదు. అని ఉమ్మడి పాలకులు తేల్చి చెప్పి, తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ సాగుభూములను పడావు పెట్టారు. రైతును బికారిని చేశారు. రైతులును కూలీలుగా మార్చారు. వలవలు పోయేలా పొగ పెట్టారు. తెలంగాణ పల్లెలన్నీంటినీ ఉమ్మడి పాలకులు చిద్రం చేశారు. ప్రజలు చిత్రవధ అనుభవించారు. సరిగ్గా అదే పని మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ అదే విధానాన్ని అనుసరిస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల్లో నీళ్లులేకుండా చేశారు. తెలంగాణకు కల్పతరువు లాంట కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. ఏదో సాకు చెప్పి ఏడాది కాలంగా చుక్క నీరు నిలవకుండా కుట్ర చేశారు. తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం కాంగ్రెస్‌ సర్కారు చేస్తోంది. గెలిపించిన పాపానికి తెలంంగాణ ప్రజలకే చుక్క నీరందరకుండా చేస్తోంది. రైతుల కళ్లలో మళ్లీ నీరు చూస్తున్నారు. పొలాల్లోపారాల్సిన నీరు రైతుల కళ్లలో చూస్తూ పాశవికానందాన్ని కాంగ్రెస్‌ పాలకులు పొందుతున్నారు. తెలంగాణను తెర్లుచేస్తున్న కాంగ్రెస్‌ మీద మర్లవడదాం…మళ్ల మన కేసిఆర్‌ పాలన తెచ్చుకుందాం..సుభిక్షమైన తెలంగాణ మళ్ల మన కళ్లారా చూసుకుందాం..బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు దండుగా తరలిరండి..

‘‘బిఆర్‌ఎస్‌’’ బలమేమిటో చూపిస్తాం!

రజతోత్సవ సభ కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరేలా నిర్వహిస్తాం.

తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ వెంటనే వున్నారనేది రుజువు చేస్తాం.

‘‘బిఆర్‌ఎస్‌’’ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరిపోయేలా నిర్వహిస్తామంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఖైరతాబాద్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ ఇన్‌ చార్జ్‌ ‘‘మన్నె గోవర్ధన్‌ రెడ్డి’’, నేటిధాత్రి

ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో సభ సమయం దగ్గర పడుతున్న వేళ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

`కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభతో చూస్తారు.

`ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతుందో తెలుసుకుంటారు.

`ఏమరపాటు ఎంత నష్టం చేసిందో ప్రజలు తెలుసుకున్నారు.

`కేసిఆర్‌ ను దూరం చేసుకొని ఎంత మధనపడుతున్నారో చూస్తూనే వున్నారు.

`కేసిఆర్‌ కు తెలంగాణ మీద వున్న మమకారం మరెవ్వరికీ లేదు.

`కేసిఆర్‌ అంటేనే తెలంగాణ… తెలంగాణ అంటేనే కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ మరింత పదిలంగా వుంది.

`టిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ వేరువేరు కాదు.

`కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు.

`తెలంగాణ ప్రజల్లో ఎవరికీ అపోహలు లేవు.

`కాంగ్రెస్‌, బిజేపి నాటకాలు ఇక చెల్లవు.

`ఇకపై తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ మాట తప్ప మరెవ్వరి మాట వినరు.

`తెలంగాణ ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వైపే వున్నారు.

`ఇక భవిష్యత్తులో కాంగ్రెస్‌, బిజేపిలకు చీమకాలంత కూడా చోటుండదు.

`తెలంగాణ అంతా గులాబీ మయమే!

`మరో ఇరవై సంవత్సరాలు బిఆర్‌ఎస్‌ కు ఎదురుండదు.

`కేసిఆర్‌ నాయకత్వాన్ని ఢీ కొట్టే దమ్ము ఎవరికీ లేదు.

`రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

`జిల్లాల నుండి ఎడ్లబండ్లు కట్టుకొని లక్షలాది మంది రైతులు ఇప్పటికే బయలు దేరారు.

`ఇక కాంగ్రెస్‌ మీద రణమే..ఎన్నికల దాకా రణరంగమే!

                            హైదరాబాద్‌,నేటిధాత్రి:  

వాపును చూసి బలుపు అనుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, లేని బలాన్ని అతిగా ఊహించుకుంటున్న బిజేపిలకు ఒకేసారి బిఆర్‌ఎస్‌ పార్టీ సత్తా ఏమిటో..తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ బలమేమిటో వరంగల్‌ రజతోత్సవ సభతో నిరూపిస్తాం. ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్దమౌతున్నారు. కొన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్చంధంగా కొన్ని వేల మంది రైతులుఎడ్ల బండ్ల ద్వారా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హజరై బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. చిన్న ఏమరపాటు చేసిన పొరపాటు వల్ల తెలంగాణ రైతాంగం ఎంత ఆగమైందో స్వయంగా రైతులే వరంగల్‌ సభకు హజరైన చెప్పాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌,బిజేపి పార్టీల గుండెలదరిలా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెగోవర్ధన్‌రెడ్డి , నేటి ధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రజతోత్సవ సభ సమయం దగ్గర పడుతున్న వేళ, అందిస్తున్న సమాచారం ఆయనమాటల్లోనే…

దేశ రాజకీయాల్లోనే బిఆర్‌ఎస్‌ది ఒక గొప్ప చరిత్ర. అటు ఉద్యమ చరిత్ర, ఇటు రాజకీయ చరిత్ర రెండూ కలిసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. అందుకే తెలంగాణ ప్రజల్లో నిండి వుంది. ఆ బలమేమిటో, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ స్ధానమేమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే రోజు దగ్గర్లోనే వుంది. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్‌ నాయత్వమే కావాలని బలంగా ఎంత కోరుకుంటున్నారో మూడు రోజుల్లో ప్రపంచం చూస్తుంది. బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని లేనిపోని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ స్ధానం తెలంగాణలో ఎక్కడుతో తేలుతుంది. పది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరుగబాటు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరిసిస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాన్ని తిట్టనన్ని తిట్లు, ప్రజలు కాంగ్రెస్‌ ఫ్రభుత్వాన్ని తిడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే కేసిఆర్‌ పాలనలో అందిన సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడారు. రైతు బందుకు రాం..రాం చెప్పారు. దళిత బంధుకు ఎగనాం పెట్టారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలనువేధిస్తున్నారు. ప్రజలను గోసూ పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రాపేరిట జరుగుతున్న దౌర్జన్యంతో ప్రజలు ఉపాదికోల్పోతున్నారు. ముప్పై ఏళ్ల క్రితం, నలభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారు. వారికి గూడులేకుండా తరిమేస్తున్నారు. బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నారు. రాత్రికి రాత్రి సామాన్యుల జీవితాల్లో కాళ రాత్రులు నింపుతున్నారు. వారి జీవితాలను బజారున పడేస్తున్నారు. ప్రజలను ఆగమాగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభ ద్వారా తేలిపోనున్నది. ప్రజల ఆసక్తిని చూస్తుంటే గతంలో వరంగల్‌లో జరిగిన మహాగర్జనను మించి సభ జరుగుతుందనిపిస్తోంది. సభలు అంటేనే బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలను అదిగమించిన సభలు ఏ పార్టీకి ఇప్పటి వరకు సాద్యం కాలేదు. ప్రజల్లో వున్న ఆదరణ ఎంత గొప్పదో బిఆర్‌ఎస్‌ పార్టీకి తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్‌ సభలు అంటేనే ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ వస్తారు. ఆ మధ్య జరిగిన కొంగరకలాన్‌ సభను చూసే కాంగ్రెస్‌, బిజేపిల గుండెలు బెదిరిపోయాయి. ఇప్పుడు వరంగల్‌ రజతోత్సవ సభను చూసి ఆ రెండు పార్టీలు అదిరిపోవాల్సిందే.. కేసిఆర్‌ను దూరుం చేసుకొని ప్రజలు మధనడుతున్నారు. సాఫీగా సాగుతున్న పాలనను కాదకున్నందకు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారిని పట్టుకొని ఏడుస్తున్నారు. మళ్లీ మా కేసిఆర్‌ పాలన కావాలని కోరతున్నారు. ఇకపై మళ్లీ కాంగ్రెస్‌ను నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. సందిట్లో సడేమియాలాగా ఒంటె పెదవుల కోసం నక్క ఆశపడినట్లు బిజేపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌ అడినట్లే ఒక్క అవకాశంటూ జనం ముందుకు వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలి. ఇప్పటికే తెలంగాణ మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లింది. మరోసారి పొరపాటు చేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఎనమది మంది బిజేపి ఎంపిలను తెలంగాణ ప్రజలు గెలిపస్తే కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలే అంటున్నారు. ఆ రెండు పార్టీల నాయకులను దగ్గరకు కూడా రాన్విడం లేదు. ఎందుకంటే కేసిఆర్‌..కేసిఆరే…ఆయనకు వున్న ఆత్మ మరేపార్టీకి లేదు. మరే పార్టీ నాయకులకు వుండదు. ఎందుకంటే తెలంగాణను కేసిఆర్‌ పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చారు. కేసిఆర్‌ చేసిన త్యాగ ఫలితమే తెలంగాణ. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. వచ్చేదే కాదు. ప్రజల తెలంగాణ కల కలగానే మిగిలిపోయేది. తెలంగాణ మరింత ఆగమయ్యేది. తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగానే మిగిలిపోయేవారు. తెలంగాణ మరింత ఎడారిగా మారిపోయేది. పల్లెల ఆకృతిమరింత క్షీణించేది. తెలంగాణలో రైతులు అనిచెప్పుకునేవారు లేకుండాపోయేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ హాయంలో తెలంగాణ రైతులు ఎంతో మంది అప్పార్టుమెంట్లలో వాచ్‌ మెన్‌లుగా పనిచేశారు. యాభై ఎకరాలున్న రైతులు కూడా ఏటిఎంల మందు, ఇతర షపుల ముందు వాచ్‌మెన్‌ పనులు చేశారు. తెలంగాణ పల్లెల్లో ఎంతో గౌరవంగా బతికిన రైతు కూడా హైదరాబాద్‌ వచ్చి హోటళ్లలో పనిచేసిన వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. మరి కొంత మంది సాగుమీద ఆశతో, వ్యవసాయం మానుకోలేక, భూమిని అమ్ముకోలేక నష్టాలను, కష్టాలను ఓర్చుకుంటూ, ఏటా అప్పులు చేస్తూ కష్టాల సాగు చేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేయించి, అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చుకునేందుకు హైదరాబాద్‌లో కూలీలుగా మారిపోయారు. మరి కొందరు బొంబాయి, షోలాపూర్‌, పూన వంటి నగరాలకు పొట్ల చేత్తో పట్టుకొని వలసలు పోయేవారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మహారాష్ట్రలకు నిత్యం బస్సుల్లో వందల సంఖ్యలో వలసలుపోయిన రోజులు వున్నాయి. కాని కేసిఆర్‌ తెలంగాణ తేవడంతోనే దశ మారింది. రైతుల జీవితాల్లో వెలుగులొచ్చాయి. వలసలు పోయిన లక్షలాది మంది రైతులు మళ్లీ తమ తమ పల్లెలకు చేరుకున్నారు. దశబ్ధాల తరబడి వదిలేసిన భూములను మళ్లీ సాగుయోగ్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ పాలనకు వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటలు కరంటు వస్తుందని తెలిసి తెలంగాణ సంబురాలుచేసుకున్నారు. తెలంగాణలోని చెరువులన్నీ నింపుతున్నారని తెలిసి, బతపోయిన రైతులంతా మళ్లీ పల్లెలు చేరుకున్నారు. పాడుబడిపోయిన బావుల్లో కూడా నీటి ఊటలు జలపాతాల్లా వస్తుంటే చూసి ఆనందంతో గంతేలేశారు. మళ్లీ తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతికే రోజులు చూసి మరిసిపోయారు. సాగు వాటు కోసం ఏ షావుకారు దగ్గరకో, అప్పులు ఇచ్చేవారినో బతిమిలాడుకునే పరిస్దితి లేకుండా కేసిఆర్‌ రైతుబంధు ఇచ్చారు. దాంతో రైతుల్లో ఎంతో ధైర్యం పెరిగింది. మనకు ఏమైనా సరే కేసిఆర్‌ చూసుకుంటారన్న నమ్మకంతెలంగాణ రైతుల్లో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంటను కొనాలంటే దళారులు, మధ్య వర్తులు, మిల్లర్లు లేనిపోని కొర్రీలు పెట్టేవారు. ఎంత మంది వడ్లనైనా అడ్డికిపావు శేరుకు కొనుక్కునేవారు. డబ్బులకు తిప్పించుకునేవారు. కాని కేసిఆర్‌ వచ్చిన తర్వాత వడ్లలలో పెళ్లలలున్నా, ఒడిపిల్లున్నా, వడ్లు తడిసినా, రంగు మారినా, మొలకలు వచ్చినా సరే ప్రభుత్వమే నేరుగా రైతులను వడ్లు కొనుగోలు చేసింది. రైతులునష్టపోకుండా కేసిఆర్‌ కాపాడారు. దాంతో పదేళ్ల కాలంలో ఏనాడు రైతునష్టపోయింది లేదు. దళారుల చేత కాకుండా, రైతులకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకు అకౌంట్లలో వడ్ల సొమ్ము వేసేది. దాంతో రైతుకు రూపాయి కూడా నష్టం జరిగేది కాదు. ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయడం అన్నది దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే వుండేది. దాంతో తెలంగాణలో పండిన వడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణకు వచ్చి, మ్ముకున్నారు. లాభపడ్డారు. రైతు బాంధువుడుగా కేసిఆర్‌ పేరు తెచ్చుకున్నారు.

మాట వినలేదు మన్నించండి!

మళ్లీ గెలిపించుకుంటాం పాలించండి!!

`కేసీఆర్‌ చల్లని పాలన మళ్ల తెచ్చుకుంటాం.

`ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిపించుకుంటాం.

`ప్రతి పల్లెలో జనం అంటున్న మాట.

`పల్లె పెడుతున్న కన్నీరుకు బీఆర్‌ఎస్‌ బాసట.

`అందుకే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ

`కేసీఆర్‌ కోసం తెలంగాణ ప్రజలు వేయి

కళ్లతో ఎదురు చూస్తున్నారంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన పల్లె కన్నీటి గాథలు..ఆయన మాటల్లోనే…

`అరవై ఏళ్ల గోసను ఏడాదిలో తెచ్చారు!

`లేని కరువు తెచ్చి రైతును గోసపెడుతున్నారు

`తెలంగాణను చిన్నాభిన్నం చేస్తున్నారు

`అన్నపూర్ణ ను ఆగం చేస్తున్నారు

`తెలంగాణ జీవితాలను అడివడివి చేస్తున్నారు

`తాగుదామనుకుంటే నీటి చుక్క లేకుండా చేస్తున్నారు

`చెరువులన్నీ ఎండబెడుతున్నారు

`పదేళ్లలో పల్లె పండుగ, సంపద నిండుగ చూసింది

`ఏడాదిలోనే కాంగ్రెస్‌ వచ్చి తెలంగాణను ఎడారి చేస్తోంది

`బతకలేక పోయే రోజుల దాపురిస్తున్నాయి

`అధికారం తప్ప ప్రజా సమస్యలు గాలికొదిలేశారు

`పద్నాలుగేళ్లు కొట్లాడి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చాడు

`ఆరు నెలల్లో కరంటు కష్టాలు తీర్చాడు

`ఆరు నెలల్లోనే చెరువులన్నీ నింపి కరువును దూరం చేశాడు

`మూడేళ్లలో 46 వేల చెరువులు బాగు చేయించాడు

`ఇంటింటికీ మంచి నీళ్లిచ్చాడు

`పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చాడు

`సాగువాటు సమయానికి సొమ్ము అందించారు

`రైతులను అప్పుల ఊబి నుంచి రక్షించాడు

`పదేళ్లలో కొత్త బోర్లు అవసరం లేకుండా చెశాడు

`ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు

`మూడేళ్లలో కాళేశ్వరం కట్టి తెలంగాణను నీటి గోస లేకుండా చేశాడు

`మా సారును ఓడిరచి, మా వేలుతో మా కన్ను పొడుచుకున్నాం

`కాంగ్రెస్‌ ను నమ్మి కష్టాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాము

`మళ్ల యాభై ఏళ్ళయినా కాంగ్రెస్‌ మొఖం చూడము

`బీఆర్‌ఎస్‌ ను మా గుండెల్లో పెట్టుకుంటాము

`పేదల ఆకలి తీర్చిన సారు రుణం తీర్చుకుంటాము

`రైతును రాజును చేసిన కేసీఆర్‌ పాలన మళ్ల తెచ్చుకుంటాము

`తెలంగాణలో ఏ పల్లెలో విన్నా ఇవే మాటలు

`ఏ రైతును కదిలించినా ఇవే ముచ్చట్లు

డెబ్బైఐదు సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాదిలోనే ప్రజలు తూర్పార పట్టడం ఇదే మొదటిసారి. ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టున్న ప్రభుత్వం ఇదే. తెలంగాణ సాధకుడు, పాలకుడైన కేసిఆర్‌ ప్రభుత్వాన్ని కాదనుకొని, కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి మోసపోయామని బాధ పడుతున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణను పదేళ్లలో ఊహించనంత అభివృద్ది చేసిన కేసిఆర్‌ను ఓడిరచి, ఇబ్బందులు పడుతున్నామని నేరుగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ప్రజలు అడుగడుగునా చుక్కలు చూపిస్తున్నారు. ఏడాదిలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మా సారు మాకు కావాలి. మళ్ల మా సారేరావాలి. తెలంగాణజాతి పిత కేసిఆర్‌ పాలన కోరుకుంటున్నామంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ను తుక్కుతుక్కుగా ఓడిస్తామంటున్నారు. కేసిఆర్‌ను కాదనుకొని కాంగ్రెస్‌ను గెపించుకున్నందుకు పాపం చట్టుకున్నదంటున్నారు. ఏడాదిలోనే ఎంతో నష్టపోయామని ప్రజలు చెబుతున్నారు. ఈ బాధలు ఇంకా నాలుగేళ్లు భరించడం మా వల్ల కాదని కూడా ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి నిండా మునిగామని ప్రజలు చెప్పడంకూడా ఇదే తొలిసారి. ఏడాదిలోనే ఇంత ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వం మూట గట్టుకోలేదు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలన్న ఆలోచన తప్ప, ప్రజలను మోసం చేయొద్దని కాంగ్రెస్‌ అనుకుంటే గెలిచేదే కాదు. కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్ధానాలలోనే మోసం స్పష్టంగా కనిపించింది. కాని ప్రజలను కాంగ్రెస్‌ మాయ చేసి ఓట్లేయించుకున్నది. గెలిచింది. కాని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేయక, పదవుల కోసం అధికారంలోకి వచ్చామన్న భావనలో వున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేశారు. అందుకే ప్రజలు మా కేసిఆర్‌ మాకు మళ్లీ కావాలని ఊరు, వాడ, పల్లె, పిల్లా, జెల్లా అందరూ కోరుకుంటున్నారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో తెలంగాణ పల్లెలు పడుతున్న గోసలు పూసగుచ్చినట్లు వివరించారు.
ప్రజలు అదికారమిస్తే పాలించాల్సిన కాంగ్రెస్‌ పాలకులు, లంకెబిందెలు వున్నాయోమో అనుకున్నాం..అన్నప్పుడే ప్రజలు అర్ధం చేసుకున్నారు. పైగా కడుపు కట్టుకుంటే చాలు అంటూ చెప్పిన మాటల్లోని పరమార్ధం ప్రజలకు అర్ధమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మదిలో ఆలోచనలు, చేష్టలు పూర్తిగా తెలిసిపోయాయి. అందుకే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పల్లెల్లో రైతులు, హైదరాబాద్‌లో ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అరిగోసకు గురి చేస్తోంది. ఎక్కడ చూసినా విధ్వంసమే.. ఏ పనిచేసినా ప్రజలను ఇబ్బందిపెట్టే పనులే చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఒక్కసారి ప్లీజ్‌..ప్లీజ్‌ అంటూ ఏడాదిపాటు ప్రజలను వేడుకుంటూ, కాళ్లా వేళ్లాపడి, కేసిఆర్‌ ప్రభుత్వం మీద లేనిపోని నిందలు, అబద్దాలు చెప్పారు. ఎన్నికల ముందు అలవి కాని హమీలు ఇచ్చారు. పాలన చేతగా ఇప్పుడు చేతులెత్తేస్తున్నారు. ఇటీవల ఓ కాంగ్రెస్‌ నాయకుడు మీడియా సమక్షంలోనే అధికారులతో అప్పుడున్నది ఇదే అదికారులు..ఇప్పుడున్నది అదే అధికారులు..కరంటు రైతులకు నీళ్లెందుకు రావడం లేదని అడిగారంటే కాంగ్రెస్‌ పాలన ఎంత అద్వాహ్నంగా వుందో అర్దం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పాలకుల చేత గాని తనం ఎంత దైన్యంగా వుందో తెలుసుకోవచ్చు. పాలన చేతగాక అధికారులను అంటే ఏమొస్తుంది. ప్రణాళిక లేకుండా, ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేయకుండా అవగాహన లేని వాళ్లు పాలిస్తే ప్రజల జీవితాలు గందరగోళంలో పడతాయి. అభివృద్ది కుంటుపడుతుంది. ప్రగతి ఆగిపోతుంది. ప్రజల జీవితాలు అస్తవ్యమస్తమౌతాయి. కాంగ్రెస్‌ను నమ్మినందుకుపల్లె మళ్లీ కన్నీరు పెడుతోంది. గోస పడుతోంది. వలవల ఏడుస్తోంది. రైతు కన్నీరు మున్నీరౌతున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు లేవు. భూ గర్భ జలాలు పద్నాలుగు మీటర్ల లోతుకు అడుగంటిపోపయాయి. బోర్లలో నీటిచుక్కలేకుండాపోయింది. కేసిఆర్‌ పాలనలో పదేళ్లపాటు ఎల్లబోసిన బావులు కూడా మళ్లీ ఎండిపోయాయి. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులు కొత్తగా బోర్లు వేసుకునే అవకాశం రాలేదు. ఆ అవసరం కూడా రాలేదు. కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా బోరు బండ్లే కనిపిస్తున్నాయి. మళ్లీ రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారు. చుక్క నీరు రాక నష్టపోతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బాగు చేసిన చెరువులున్నాయి. వాటిని నింపాలన్న సోయిలేదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్తగా కట్టించిన అనేక రిజర్వాయర్లుఉన్నాయి. వాటిని నింపడం లేదు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు. నీళ్ల చుక్క కాళేశ్వం నుంచి వాడితే కేసిఆర్‌కు మళ్లీ పేరొస్తుందని, తాము చెప్పిన మాటలు అబద్దాలౌతాయని రైతులకు నీళ్లివ్వడం లేదు. కాళేశ్వరంలో నీళ్లు నిలుపడం లేదు. దాంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు, తెలంగాణ మొత్తం ఎండిపోతోంది. ఎడారిగా మారుతోంది. ఈ సారి నాలుగు దొయ్యలు పెట్టుకోవాలన్నా రైతు భయపడుతున్నాడు. ఏడాది క్రితం వరకు పదేళ్ల కాలంలో గుంట జాగ కూడా వదలకుండా ఉన్న భూమినంతా పొలం చేశారు. ఒకప్పుడు ఎందుకూ పనికి రాదన్న భూములను కూడా పొలాలు చేసి పారించారు. రైతులు బంగారు పంటలు పండిరచారు. చెలకలన్నీ పొలాలు చేసి సన్న బియ్యం పండిరచారు. అలా తెలంగాణ మొత్తం కాళేశ్వరం నీటి పారకంతో కోటిన్నర ఎకరాల మాగాణ అయ్యింది.. కాంగ్రెస్‌ రాగానే మళ్లీ ఎడారిగా మారిపోయింది. కాళేశ్వరం నీళ్లు నల్లగొండ జిల్లా కోదాడ చివరి ఆయకట్టు దాకా పారినసంగతి ప్రజలకు తెలుసు. రైతులకు తెలుసు. కాని కాంగ్రెస్‌నాయకులకు మాత్రం కనిపించలేదు. రైతులకు లేని పోని మాటలు చెప్పి మాయ చేశారు. నమ్మితేనే కదా మోసం చేయొచ్చన్నట్లు పాలిస్తున్నారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశరు. ఓవైపు అకాల వర్షాలతో తెలంగాణ అంతటా పంటలు ఆగమౌతున్నాయి. కుప్పలు కొట్టుకుపోతున్నాయి. మామిడి తోటలు రాలిపోతున్నాయి. అసలే అరకొర పంటలు చేతికొస్తుంటే, ఆ మాత్రం కూడా దక్కకుండా పోతుంటే పాలకులు చేష్టలుడిగి చూస్తున్నారు. రైతులను పరామర్శించడం లేదు. ఈ రోజు హెలీకాప్టర్‌ నాకు, రేపు నీకు అనుకుంటూ హెలీకాప్టర్‌తో తిరిగేందుకు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. రైతుల గోసను గాలికి వదిలేశారు. ఏడాది వరకు పండగైన సాగు ఇప్పుడు దండుగౌతోంది. రైతు బంధు ఈ ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ సరిగ్గా అందింది లేదు. ఎంత మంది రైతులకు అందిదో, లేదో అర్దం కావడం లేదు. ఏ రైతును అడిగినా నాకు మాత్రం రైతు బంధు రాలేదనే అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు మాత్రం నిత్యం అబద్దాలు చెబుతున్నారు. రైతుబంధు వేస్తున్నామని చెప్పి, మాయ మాటలు ఇంకా చెబుతూనే కాలం వెళ్లదీస్తున్నారు. రైతులను అడుగడుగునా ఆగం చేస్తూనే వున్నారు. దాంతో రైతు బంధు అందక, పంటలు పండక, సాగువాటు చేయాలంటే రైతుకు ధైర్యం చాలడం లేదు. కన్నీటి వ్యవసాయం చేయాల్సిన పరిస్దితి వస్తోందని గొడగొడ ఏడుస్తున్నాడు. ఇటు రైతు బంధు రావడం లేదు. అటు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. మళ్లీ కాంగ్రెస్‌ పాత రోజులు తెచ్చిందని రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. కేసిఆర్‌ పాలనలో పదేళ్లు పండగ చేసుకుంటే, ఇప్పుడు దండుగౌతుందని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనిపించడం లేదు. రైతులకు సాగుకు సరిపడ నీళ్లియ్యాలన్న సోయి ఒక్కరిలో కూడా లేదు. కాంగ్రెస్‌ నాయకుల్లో కూడా ఎంతో మంది రైతులున్నారు. వాళ్లు కూడా తమ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదిలో ఇలా జరగడానికి పాలక పెద్దలే అని నిందిస్తున్నారు. ప్రజల్లోకి మళ్లీ ఎలా వెళ్లాలని ముఖాలు దాచుకుంటున్నారు. ప్రజలకు ముందుకు వెళ్లలేక ముఖం చాటేస్తున్నారు. రైతులకు ఎదురుపడితే ఎక్కడ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారో అని కళ్లాల దగ్గరికి కూడా వెళ్లలేకపోతున్నారు. కాంగ్రెస్‌ను కోరి తెచ్చుకుంటే కరువు వచ్చిందంటున్నారు. పాపం కాంగ్రెస్‌ పార్టీ అనుకుంటే శాపం చుట్టుకున్నది రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. మళ్లా కాంగ్రెస్‌కు జీవితంలో ఓట్లు వేయమని అంటున్నారు. మరో యాభై ఏళ్లయినా కాంగ్రెస్‌ ముఖం చూడమంటున్నారు. ఇక కలలో కూడా బిఆర్‌ఎస్‌ వదులుకోమంటున్నారు. కేసిఆర్‌ను మళ్ల ముఖ్యమంత్రిని చేసుకుంటామంటున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు స్వచ్చందంగా వచ్చి రైతులోకమంతా కేసిఆర్‌కు మద్దతు ప్రకటిస్తామంటున్నారు. పల్లెల్లో ఇండ్లలో ఎవ్వరం వుండం..అందరం కేసిర్‌ సభకే పోతామంటున్నారు. కేసిఆర్‌ మీద రైతులకు వున్న ప్రేమను చాటుకుంటామంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version