`సామాజిక తెలంగాణ ‘‘కవిత’’ తోనే సాధ్యం.
`’’కవిత’’ రాజకీయ పార్టీ పెడితే ‘‘బహుజన ప్రభంజనం’’.
`తెలంగాణ సామాజిక భవిత ‘‘కవిత’’.
`’’కవితే’’ సామాజిక ‘‘సైన్యం’’.
`’’కవిత’’ బహుజన ‘‘సామాజిక స్వరం’’.
`తెలంగాణలో సామాజిక న్యాయం కోసం సవరించిన గళం.
`’’కవిత’’ ఒక సామాజిక బాధ్యత.
`’’కవిత’’ సామాజిక తెలంగాణ విజ్ఞత..
`సామాజిక బాధ్యతను నిర్వర్తించిన వారిలో అగ్రకులాల సామాజిక వేత్తలే ఎక్కువ.
`సతీ సహ గమనం రద్దుకు కారణం రాజా రామ్మోహన్ రాయ్.
`వితంతు వివాహాలు జరిపించినది వీరేశలింగం పంతులు.
`కన్యాశుల్కం రాసింది గురజాడ.
`సహపంక్తి భోజనాలు పెట్టిన పలనాటి బ్రహ్మనాయుడు.
`అదే బాటలో ఇప్పుడు ‘‘కవిత’’.
`బహుజన రాజకీయం కోసం కదిలిన తెలంగాణ ‘‘కాళిక’’ కవిత.
`భవిష్యత్తులో బడుగుల రాజ్యం కోసం ‘‘కవిత’’ తపన.
`బడుగులను ఏకం చేసే యజ్ఞంలో తొలి అడుగు ‘‘కవిత’’.
`ఇంత కాలం బడుగులను, బడుగులే నమ్మలేదు.
`బడుగులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు.
`సామాజిక తెలంగాణ ఆవిష్కరణ కోసం ‘‘కవిత’’ కదలివస్తోంది.
`బడుగులంతా ఏకమైతే నవ రాజకీయం నిర్మాణమౌతుంది.
`’’కవిత’’ కు పల్లె తెలుసు..పల్లె జీవితం తెలుసు.
`’’కవిత’’ అంటే పువ్వుకు తెలుసు.
`తెలంగాణలో వున్న ప్రకృతి ప్రతి కొమ్మకు తెలుసు.
`’’కవిత’’ పిలుపు తెలంగాణ ఉద్యమానికి తెలుసు.
`తెలంగాణ ఉద్యమ రాజకీయానికి బతుకమ్మగా తెలుసు.
`’’కవిత’’ అంటే డిల్లీ రాజకీయానికి ధీర వనితగా తెలుసు.
`మహిళా రిజర్వేషన్ కోసం ‘‘కవిత’’ చేసిన పోరాటం తెలుసు.
హైదరాబాద్,నేటిధాత్రి:
కవిత తెలంగాణ సామాజిక యుద్దం. నిరంతర ప్రజాసంగ్రామం. కవిత ఒక సామాజిక న్యాయం. కవిత ఒక సామాజిక ధ్యేయం. కవిత ఒకసామాజిక లక్ష్యం. కవిత తెలంగాణ సామాజిక పోరాట గుమ్మం. సామాజిక తెలంగాణ ఆలోచనలు చేసిన వారు చాలా మంది వున్నారు. అటు వైపు అడుగులు వేసిన వారు లేరు. కాని చెప్పినట్లే ప్రయాణం మొదలు పెట్టిన కవిత. మూగబోయిన బడుగుల గొంతౌతున్న కవిత. బడుగుల కోసం గొంత్తిత్తి నినదిస్తున్నది కవిత. బిసిలలో సామాజిక చైతన్యం రగిలించే యజ్ఞం కవిత. ఈ తరంలో సామాజిక తెలంగాణ ఆలోచన మొదలైన కవిత తోనే సామాజిక నిర్మాణం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడుతోంది. సామాజిక తెలంగాణ కవితతోనే సాధ్యమౌతుందన్న భరోసా ఏర్పడుతోంది. కవిత ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే బహుజన ప్రభంజనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చు. కాని ఎమ్మెల్సీ కవిత పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలుసు. కవిత మొండి ధైర్యం గురించి కూడా తెలుసు. అందుకే కవిత విషయంలో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. రాజకీయపార్టీ అంటే కుటుంబ సమస్య కాదు. ప్రజా సమస్య. ప్రజల కోసం ఆలోచించే సమస్య. ప్రజల వైపు నుంచి దృక్కొణం వుండాల్సిన సమస్య. అందువల్ల ఎలాగైనా కవితను రాజకీయ యవనిక మీద ప్రత్యేక గుర్తింపు రావడం కొన్ని రాజకీయ పక్షాలకు ఇష్టం వుండదు. అంతే కాదు స్వపక్షంలో కూడా అలాంటి అభిప్రాయం ఎవరికైనా వుండొచ్చు. అందుకే కవిత సూటిగా, స్పష్టంగానే కేసిఆర్ చుట్టూ దెయ్యాలున్నారని కుండబద్దలు కొట్టిచెప్పారు. కాసేపు ఆ రాజకీయం పక్కన పెడితే, కవిత ఆది నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఆరాటం వుండేది. అందుకే ఆమె తనదైన శైలిలో ఉద్యమ స్వరూపానికి నాంది పలికింది. ముందు తెలంగాణలో జాగృతి అనే సంస్ధ ద్వారా తెలంగాణ సమజాన్ని చైతన్య పర్చేందుకు అడుగులు వేసింది. ఇప్పుడున్న తెలంగాణ రాజకీయ సమాజంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు మరొకరు లేరు. నేరుగా కవిత ఉద్యమంలోకి వెళ్లొచ్చు. ఉద్యమ కారిణిగానే గుర్తింపు పొందొచ్చు. కాని ఆమె తెలంగాణ నవ సమాజం గురించి ఆలోచనలు చేసింది. ఉద్యమం ఓ వైపు కేసిఆర్ చేస్తున్నప్పుడు, తాను తెలంగాణయువతకు ఎలా సాయ పడాలన్న ఆలోచన చేయడం అంటే కన్న తల్లి పిల్లల గురించి ఆలోచన చేయడం లాంటిదే అని చెప్పకతప్పదు. అలా అప్పటి యువతకు అవసరమైన ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. యువతలో ఉద్యమ చైతన్యం రగిలించడంలో కవిత ప్రదాన పాత్ర పోషించింది. అందుకే జాగృతి అనే సంస్ధకు అంతటి పేరు వచ్చింది. ఒక దశలో బిఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి నిర్మాణం జరిగింది. అలా చిన్న వయసులోనే కవిత తెలంగాణ సమాజ గతి కోసం, ప్రగతి కోసం ఆలోచనే కాదు, ఆచరణ కూడా చూపించింది. అందుకే అందరి మన్ననలు పొందింది. అంతే కాకుండా కవిత తెలంగాణ ఉద్యమ కాలమంతా బీద, బిక్కి, బడుగుల జీవితాలు చాల దగ్గరుండి చూశారు. పల్లె జీవితాన్ని కళ్ల నిండా చూశారు. పల్లె బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బతుకమ్మ పేరుతో ఊరూరు తిరిగినప్పుడు పల్లె వేధనలు తెలుసుకున్నారు. చిద్రమైన ఆనాటి పల్లె బతుకులు చూసి చలించిపోయారు. ఉద్యమ సమయంలోనే ఆమె సామాజిక సృహను కూడా తన దాతృత్వంతో చూపించారు. అప్పుడే తెలంగాణలో సామాజిక న్యాయం రాజకీయ పరంగా అందితే తప్ప అంతరాలు, అవరోధాలున్న సమాజంలో మార్పులు తీసుకురావొచ్చని ఆలోచన చేశారు. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే తెలంగాణ సామాజిక భరోసా కవిత అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే బిఆర్ఎస్ అధికారంలో వున్నంత కాలం కవిత ఏం చేసిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదీ ఏక కాలంలో పూర్తి కాదు. అన్ని సమస్యలు ఒకే సారి నెరవేరవు. ఆ సమయంలో సామాజిక తెలంగాణ కన్నా, సాగు నీటి తెలంగాణ ముఖ్యం. అన్న పూర్ణ తెలంగాణ ముఖ్యం. ఆకలిని తరిమేసే తెలంగాణ ముఖ్యం. తెలంగాణలో ఆకలి కేకలు లేకుండా చూడాల్సిన సమయం. తెలంగాణలో ఎప్పటికైనా సామాజిక తెలంగాణ సాదించొచ్చు. కాని ముందుకు తెలంగాణ నుంచి ఆకలిని తరిమేయాలి. అనారోగ్యాన్ని తరిమేయాలి. నీటి గోసలు లేకుండా చూసుకోవాలి. గుక్కెడు మంచి నీటికోసం తల్లడిల్లిన తెలంగాణ గుండెను చూసిన వారికి మాత్రమే కొన్ని విషయాలు అర్దమౌతాయి. తెలంగాణలో మొదటి ప్రాదాన్యతగా ప్రాజెక్టుల నిర్మాణం. సాగు సంపద పెంచడం. రైతును రాజును చేయడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో కేసిఆర్ ముందుకు సాగారు. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత చెబుతారు. కడుపు నిండా తిన్న తర్వాతే కంటికి కునుకైనా, పక్కవారితో కబుర్లైనా చెప్పుకునే అవకాశం వుంటుంది. ఓ వైపు ఆకలి దహిస్తుంటే నిద్ర వస్తుందా? పక్కవారితో సంబాషణ సాగుతుందా? అది అప్పటి తెలంగాణపరిస్దితి. ఇప్పుడు తెలంగాణ పరిపుష్టికరమైన తెలంగాణ. ఆకలి తెలంగాణ పొలిమేర దాటిపోయింది. రైతు సంతోషంగా వున్నారు. విద్య, వైద్యం ఎంతో కొంత బాగానే అందుతోంది. ఇక మిగిలింది..రావాల్సింది సామాజిక చైతన్యం. సామాజిక తెలంగాణ నిర్మాణం. బడుగులకు రాజకీయ ప్రాధాన్యం. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అందుకు కవిత కంకణం కట్టుకొని భయలుదేరింది. కవితే ఒక సమాజిక సైన్యంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తోంది. అందరికన్నా ముందు సామాజిక తెలంగాణకు గళమైంది. తన స్వరం పెంచింది. నిజాన్ని నిర్భయంగా చెప్పింది. సామాజిక తెలంగాణ సాధన జగాల్సిన అవసరాన్ని గుర్తించింది. సామాజిక తెలంగాణ ఆవిష్కారం జరిగితే తెలంగాణ రాష్ట్ర పరిపూర్ణమౌతుందన్నారు. ఇంతకన్నా తెలంగాణ కోసం గొప్పగా ఆలోచించేవారు ఎవరుంటారు. ఇదే సమయంలో కవిత రాజకీయ స్వార్ధం కోసం బహుజన వాదం ఎత్తుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారి పరిస్ధితి ఎలా వుంటుందంటే అమ్మ పెట్టా పెట్టదు..అడుక్కు తిననివ్వదన్న సామెతను నిజం చేస్తుంటారు. బిసిలై వుండి బిసిల ఐక్యత కోసం పాకులాడరు. ప్రయత్నం చేయరు. కాని బిసిలలో చైతన్యం కోసం కవిత ప్రయత్నం చేస్తుంటే ఆమె ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. బిసిలను ఏకం చేయడానికి బిసిలే అవసరం లేదు. సామాజిక సృహ వున్న వారు ఎవరైనా సరే ఆ బాధ్యతను తీసుకోవచ్చు. ఇప్పుడు కవిత కూడా అదే చేస్తున్నారు. చరిత్రలో సామాజిక చైతన్యం కోసం కృషి చేసిన వారిలో ఎక్కువ మంది అగ్ర కులానికి చెందని వాళ్లే వున్నారు. సామాజిక న్యాయం కోసం వాళ్లే కృషిచేశారు. అందుకే చరిత్రలో నిలిచారు. చరిత్ర గతిని మార్చారు. స్వాతంత్య్రానికి ముందు ఆంగ్లేయులు పాలనలో ఎంతో దుర్మార్గమైన ఆచారం వుండేది. భర్త చనిపోతే వెంటనే ఆమెను కూడా భర్తచితిపై వేసేవారు. దానికి సతీ సహగమనం అని పేరు పెట్టి, సజీవంగా వున్న మహిళను ఆ మంటల్లోనే తగలబెట్టేవారు. దాన్ని సంప్రదాయం అనేవారు. కాని అలాంటి అనాగరిక చర్యను వ్యతిరేకించింది రాజారామ్మెహన్ రాయ్. ఇంగ్లీషువారితో పోరాటం చేసి, వారిని ఒప్పించి, మెప్పించి సతీసహగమనాన్ని రద్దు చేయించారు. సామాజిక రుగ్మతను పారద్రోలాడు. ఇక చిన్న వయసులోనే పెళ్లిల్లుచేసి, భర్త చనిపోతే జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతున్న మహిళల జీవితాల్లో మళ్లీ వివాహం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వీరేశలింగం పంతులుది. అందుకే ఇప్పటికీ ఏపిలో కొట్టుకొని పోయేను కొన్నికోటి లింగాలు వీరేశలింగమొకడు మిగిలెను చాలు…అని ఆ ఆంధ్ర సమాజం వేనోళ్ల పొగుడుతుందంటే కారణం వీరేశలింగం చూపిన దారి. ఆ వీరేశలింగం అగ్ర కులానికి చెందిన సామాజిక వేత్తే. అలాగే వరకట్న సమాజంలో ఆడపిల్ల నలిగిపోతుంటే, కన్నాశుల్కం వస్తే గాని ఆడ పిల్ల జీవితం బాగు పడదని ఎలుగెత్తి చాటి గురజాడ అప్పారావు కూడా ఉన్నత వర్గానికి చెందని మహానుభావుడే. ఇక మనుషుల్లో తేడాలు వుండొద్దని, చిన్నా, పెద్ద అనే తేడా వయసులో, గుణంలో తప్ప కులంలో కాదని చెప్పేందుకు పలనాటి బ్రహ్మనాయుడు చాప కూడుతో సహపంక్తి భోజనాలు పెట్టించేవారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆనాడే కృషి చేశాడు. ఆయన నిమ్మ వర్గం కాదు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత, ప్రాముఖ్యత కలగాలని కోరుకోవడంలో అగ్ర కులాలు ముందుండి ప్రశ్నించడాన్ని నిరసించడం అజ్ఞానానికి,అవివేకానికి నిదర్శనమౌతుంది. ఆంగ్లేయులతో ఆనాటి రాజులెంతో మంది పోరాటం చేశారు. వాళ్లంతా తమ రాజ్యాల రక్షణ కోసం పోరాటం చేశారు. వారి పేర్లకు చరిత్రలో పెద్దగా ప్రాధాన్యత లేదు. కాని ప్రజా స్వామ్యం కోసం, ప్రజా పాలన కోసం గాంధీజీ పోరాటం చేశారు. అందుకే మహాత్ముడయ్యారు. దేశానికిస్వాతంత్య్రం తెచ్చిపెట్టారు. ఆయనను ఆనాడు మీరెందుకు అని ఎవరూ ప్రశ్నించలేదు. ఇప్పుడు కూడా కవితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సామాజిక న్యాయం కోసం కవిత వేసే అడుగులు వెనక్కి పడేది లేదు. అందుకే సామాజిక న్యాయం కోసం కవితది అపర కాళిక అవతారం చూస్తారంటున్నారు.