-మంత్రి ‘‘ఉత్తమ్’’ పర్యవేక్షణ.. కమీషనర్ ‘‘చౌహాన్’’ కార్యదక్షత.
-మిల్లర్ నుంచి వసూలు చేస్తున్న ఖమ్మం జేసికి ప్రశంసలు!
-జిల్లా అధికారులతో పాటు, కమీషనర్ చౌహాన్ను రైతులు ప్రశంసిస్తున్నారు.
-అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు?
-అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు.
-అధికారులకు ప్రభుత్వ స్వేచ్ఛ..తప్పు చేసే మిల్లర్లకు తప్పదు శిక్ష.
-ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్ నుంచి రికవరీ..
-వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ.
-మిల్లర్ నుంచి ముక్కు పిండి వసూలు… రైతుల ఖాతాలో పైసలు.
-2 వేల బస్తాలు మింగిన మిల్లర్ జగన్కు చుక్కలు..
-టోపి పెట్టాలనుకున్న మిల్లర్…తాట తీసిన ఆఫీసర్.
-మరో సారి జగన్ మోసం బైట పడిరది!
-‘‘నేటిధాత్రి’’ ముందే పసిగట్టి చెప్పింది.
-రెండు వేల వడ్ల బస్తాల స్వాహా వెలుగులోకి వచ్చింది?
-అధికారులను గుప్పిట్లో పెట్టుకొని 50 లారీలు మళ్లించుకున్నాడు.
-2 వేల బస్తాలు కన్నం పెట్టాడు.
-ఖమ్మం జేసి వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు.
-ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు.
-అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు.
-మిల్లర్ జగన్ మోసం వెలుగులోకి వచ్చింది.
-దేశంలోనే ఇది మొదటి సారి అని అంటున్నారు.
-రైతులను వందల కోట్లు ముంచిన మిల్లర్లు?
-రైతులను నిలువుగా మిల్లర్ ముంచాలని చూశాడు.
-అధికారులు అప్రమత్తమై రికవరీ చేయిస్తున్నారు.
-ఖమ్మం జిల్లా అధికారుల బేష్.
-అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం.
-రైతుల వద్ద కోసిన వడ్లతో కోట్లు కూడబెట్టుకుంటున్నారు.
-ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
ప్రభుత్వాలకు చిత్తశుద్ధి వుంటే ప్రజలకు మేలైన, మెరుగైన పనులు చేయొచ్చని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిరూపించింది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా చెలరేగిపోయిన కొంత మంది అక్రమ మిల్లర్లు ఆడిరది ఆట పాడిరది పాట అయ్యింది. గత ప్రభుత్వ పెద్దలు కళ్లు చూసుకోవడం వల్ల మిల్లర్లు కొందరు రైతులను విపరీతంగా మోసం చేసే వారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారు. రైతులకు చెందాల్సిన సొమ్మును తమ ఖాతాల్లో వేసుకునే వారు. రైతుల గోస పుచ్చుకునే వారు. ఆ సమయంలో మిల్లర్లు చెప్పిందే వేదమన్నట్లు చేసే వారు. అప్పటి ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి మూలంగా రైతులు ఎంతో నష్టపోయే వారు. యధా రాజ, తదా ప్రజా అన్నట్లు అధికారులు మేమేం తక్కువ అన్నట్లు మిల్లర్లకే సాయపడేవారు. వారు కూడా రైతులను దోచుకునేందుకు పరోక్షంగా సహకరించే వారు. రైతుల ఆందోళన అరణ్య రోదనయ్యేది. పట్టించుకునే వారు కాదు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడా గత పాలకుల కాలంలో జరిగింది. కానీ ఇకపై మిల్లర్ల ఆట కట్ అనే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రూపాయి కూడా మోసానికి గురి కాకుండా చూసుకునే పరిస్థితి తెస్తున్నారు. సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ కమీషనర్ చౌహాన్ తీసుకుంటున్న చర్యల మూలంగా రైతులకు భవిష్యత్తులో నష్టం వాటిల్లకుండా చూసే రోజులు రాబోతున్నాయి. ఇది ఎంతైనా తెలంగాణ రైతుకు వరమనే చెప్పాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణతో కమీషనర్ చౌహాన్ కార్యదక్షతతో కూడుకున్న చర్యల వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఏర్పడిరది. గతంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు, అధికారులను కూడా తప్పు దోవ పట్టించేలా వుండేవి. పైకి మాత్రం రైతులకు ఎంతో మేలు చేస్తున్నట్లు ప్రకటనలు చేసే వారు. చేతులు దులుపుకునే వారు. దాంతో రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకునే వారు అసలే కాదు. నేటిధాత్రి లాంటి మీడియాలో ఎన్ని కథనాలు రాసినా పట్టించుకునే వారు కాదు. స్పందించే విధానం వుండేది కాదు. ఇక రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తినప్పుడు మాత్రం నామ మాత్రపు స్పందన కనబర్చినట్లు నటించే వారు. అంతకు మించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. అయితే ప్రభుత్వాలు ఆ బాధ్యతలు పూర్తి స్థాయిలో అధికారులకు అప్పగించి, ఎలాంటి అవకతవకలు జరగొద్దని చెప్పడం గతంలో చూడలేదు. కానీ ప్రజా ప్రభుత్వం వడ్ల సేకరణలో అధికారులకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. అది ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ తన కర్తవ్యాన్ని అంకిత భావంతో అమలు చేశారు. ఒక్క బస్తా మోసానికి పాల్పడినా మిల్లర్ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టారు. తప్పు చేసిన మిల్లర్ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరి పండిరచే రైతులకు ఇక నుంచి లేదు వర్రీ వుండాల్సిన అవసరం లేకుండా చూస్తున్నారు. అయితే ఆ కధ ఏమిటో తెలియాలి. ఖమ్మం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వడ్లు హన్మకొండ జిల్లాలో వున్న కొన్ని మిల్లులకు జాయింట్ కలెక్టర్ సిఫారసు చేశారు. వాటిని ఖమ్మం జేసి సూచించిన విధంగా ఎంపిక చేసిన మిల్లర్లకు చేరలేదు. మధ్యలో హన్మకొండ జిల్లాకు చెందిన సివిల్ సప్లయ్ అధికారులు ఓ మిల్లర్ కు కొమ్ము కాసే పని పెట్టుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చిన 50 లారీల వడ్లను జగన్ అనే మిల్లర్ కు మళ్లించారు. నిజానికి చెందాల్సిన మిల్లర్లకు చెందకుండా చేశారు. అధికారుల అండతో జగన్ అనే మిల్లర్ ఆ వడ్ల నుంచి ఏకంగా 2 వేల బస్తాలు మింగేశాడు. తప్పుడు లెక్కలు సృష్టించాడు. బస్తాకు కోసే వడ్ల విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించాడు. ఈ విషయం తెలిసిన ఖమ్మం జేసి సదరు మిల్లర్ జగన్కు చెందిన మిల్లులకు నోటీసులు జారీ చేశారు. ఓ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వార్తా కథనం నేటిధాత్రి మిల్లులకు ప్రచురించింది. అది ఖమ్మం జిల్లా జేసికి చేరింది. అంటే వెంటనే స్పందించారు. నివేదిక తెప్పించుకున్నారు. మిల్లర్ చేసిన మోసం పసిగట్టారు. రెండు వేల బస్తాలకు సంబంధించిన సొమ్ము కక్కాల్సిందే అని నోటీస్ జారీ చేశారు. ఇది సివిల్ సప్లయ్ శాఖ చరిత్రలోనే మొదటి సారి అంటున్నారు. గతంలో ఇలా స్పందించిన అధికారి ఎవరూ లేరని ప్రశంసిస్తున్నారు. రైతులకు ఎంతో ఊరట కలిగించడమే కాదు, మోసపోయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలలో వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి, రైతుల కష్టానికి టోపి పెట్టాలనుకున్న మిల్లర్ తాట తీసే పని ఖమ్మం జాయింట్ కలెక్టర్ పెట్టుకున్నాడు. ఒక మిల్లర్ ప్రభుత్వం కళ్లు గప్పి, రైతులను మోసం చేసి, రెండు వేల వడ్ల బస్తాల స్వాహా చేయడం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ వ్యూహం హన్మకొండ జిల్లా అధికారులు పసి గట్టలేకపోయారు. ఏ పనైనా తూతూ మంత్రంగా చేసే అలవాటు హన్మకొండ అధికారులకు వుంది. లారీలు వచ్చాయా? వాటిని తమకు అనుకూలమైన మిల్లర్ జగన్కు అందించామా! లేదా!! అనేదే చూసుకున్నారు. కానీ బస్తాలపై వున్న మర్మం కనిపెట్ట లేకపోయారు. ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతో తెలివిగా ప్రతి బస్తా మీద వడ్ల లెక్క రాయించారు. అది గమనించలేక హన్మకొండ అధికారులు బోల్తా పడ్డారు. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. మొదటి నుంచి నేటిధాత్రి ఈ విషయం చెబుతూనే వుంది. అధికారులను హెచ్చరిస్తూనే వుంది. హన్మకొండ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు నేటిధాత్రి అందిస్తున్న వార్తలను పెడ చెవిన పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో సాగినట్లే ఇప్పుడూ సాగుతుందనుకున్నారు. పదేళ్లు తిష్ట వేసుకొని తినడం అధికారులకు అలవాటైంది. రైతులను మోసం చేయడం మిల్లర్లకు సామాన్యమైపోయింది. రైతుల నెత్తిన కోత శఠగోపం పెట్టడం నిండా ముంచడం బాగా అలవాటైపోయింది. అదే ధోరణి విచ్చలవిడిగా సాగుతోంది. మమ్మల్ని అడిగేవారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? నేటిధాత్రి రాస్తూనే వుంటుంది. అదంతా కామనే అనుకున్నారు. కానీ ఖమ్మం జిల్లా జేసి ఇచ్చిన రaలక్తో ఒక్క సారిగా హన్మకొండ సివిల్ సప్లయ్ అధికారుల్లో కూడా రైళ్లు పరిగెత్తే పరిస్థితి వచ్చింది. నిజానికి ఉన్నత స్థాయిలో వున్న అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు ఇంత అద్భుతంగా వుంటాయి. ప్రజలకు మేలు చేసేలా వుంటాయి. అని నిరూపనైంది. జిల్లా అధికారులతో పాటు, కమీషనర్ చౌహాన్ను రైతులు ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల అధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ఏ రైతు మోసపోడు. ఇలాంటి వ్యవహారాలు అన్ని జిల్లాలలోనూ సాగుతున్నాయి. అన్ని జిల్లాల అధికారులు ఖమ్మం జిల్లా అధికారులను ఆదర్శంగా తీసుకుంటే ఏ మిల్లర్ మోసానికి పాల్పడలేడు. రైతుల సొమ్ము అప్పనంగా దోచుకునే వెలుసుబాటు అసలే వుండదు. రైతులను కొట్టి కోట్లు మింగాలనుకుంటున్న మిల్లర్లు తప్పులు చేయడానికి అసలు ఆస్కారం వుండదు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులను వందల కోట్లు ముంచుతూనే వున్నారు మిల్లర్లు. వారికి సహకరిస్తూనే వున్నారు అధికారులు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తే మిల్లర్ల నుంచి వెయ్యి కోట్లు వసూలు? జరగడం ఖాయం. ఈ ఖమ్మం జిల్లా అధికారుల బేష్. అన్ని జిల్లాల అధికారులకు ఆదర్శం. ఏటా రైతుల వద్ద కోసిన వడ్లతో మిల్లర్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఐకేపి సెంటర్ల నుంచి వచ్చిన వడ్లలో వేల బస్తాలు మాయం చేస్తున్నారు. దయచేసి ఇకనైనా మిల్లర్ల దోపిడీ ఆపండి. రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు మిల్లర్లకు సహకారం ఆపండి.
బాక్స్.
ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలం!
ఖమ్మం జిల్లా అధికారులు చూపిన చొరవతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులంతా ఏకతాటిపైకి వచ్చి మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను మోసం చేసిన మిల్లర్ నుంచి రికవరీ వసూలు చేసిన సందర్భాలు లేవు. ఇంత మంచి విషయాన్ని, విజయాన్ని కాంగ్రెస్ క్రాడర్ ప్రచారం చేసుకోవడం లేదు. రైతులకు జరిగే మేలుపై కాంగ్రెస్ క్యాడర్ కదలకపోవడం కూడా పార్టీకి ఎంతో నష్టం జరుగుతోంది. ప్రతిపక్షాలు రైతులకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అయినా కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా కాంగ్రెస్ క్యాడర్ కళ్లు తెరవండి. ప్రతిపక్షాల నోరు మూయించండి.