ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా అందుకున్న అన్నదమ్ములు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామనికి చెందిన దొమ్మటి సారయ్య సునీత,దొమ్మటి భద్రయ్య సుజాత దంపతుల కుమారులు దొమ్మటి సనత్ కుమార్, దొమ్మటి సుజిత్ కుమార్ లు 2018లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు సంపాదించి కాలేజీలో ఇరువురు ఎంబిబిఎస్ పూర్తి చేసారు.శుక్రవారం రోజున ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ పట్టా ఇరు కుటుంబాల సమక్షంలో పొందడం జరిగింది.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ నన్ను డాక్టర్ గా తీర్చిదిద్దిన కళాశాల ఉపాధ్యాయ బృందానికి,నా ఎదుగుదలకు నాంది పలికిన మా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటామని మా డాక్టర్ వృత్తిని పేదలకు సహాయకరంగా మా తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా నిర్వరిస్తామని అన్నారు.పట్టా అందుకున్న అన్నదమ్ముల పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!