Headlines

ఎంపీ వద్దిరాజు అభయ వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం నగరం ఖానాపురం హవేలిలో కొలువైన స్వయంభు అభయ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి శనివారం ఉదయం ఖమ్మం ఖానాపురం హవేలి యుపీహెచ్ కాలనీలో నెలకొన్న శ్రీవెంకటేశ్వర స్వామి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు ఎంపీలు రవిచంద్ర, నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మధులకు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.స్వామి వారిని దర్శించుకుని తమ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు,వేద పండితులు ఆశీర్వచనాలు పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీలు వద్దిరాజు,నామ, ఎమ్మెల్సీ తాతా మధుల వెంట నగర మేయర్ నీరజ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం,సుడా మాజీ ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *