bakthajana sandramga kondagattu divyakshtram, భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

భక్తజన సంద్రంగా కొండగట్టు దివ్యక్షేత్రం

జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో అర్ధరాత్రి నుంచే ఆలయం కిక్కిరిసిపోయింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా కఠోరదీక్షతో ఇరుముడితో తరలివచ్చిన మాలదారులు అంజన్న సన్నిధిలో మొక్కులు చెల్లించుకుని దీక్ష విరమణ చేస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఏ వైపు చూసినా రామనామ జపంతో ఆలయం మారుమోగింది.

గట్టి భద్రతా ఏర్పాట్లు

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో 450మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. ఎస్పీ సింధూశర్మ దగ్గర ఉండి భద్రతను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *