adhikarulanu suspend cheyali, అధికారులను సస్పెండ్‌ చేయాలి

అధికారులను సస్పెండ్‌ చేయాలి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటును ఆడ్డుకుని, డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని దళితరత్న అవార్డు గ్రహీత జన్ను రాజు అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ పంజాగుట్టలో అంబేద్కర్‌ విగ్రహం తొలగించి చెత్త డంపింగ్‌ యార్డుకు తరలించిన అధికారులను శిక్షించాలని, వెంటనే భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం తొలగించిన స్థలంలోనే విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టివిఎఫ్‌ రాష్ట్ర నాయకులు పినింటి రవీందర్‌రావు, ఆడెపు సోమయ్య, సారయ్య, ఉప్పలయ్య, కుమార్‌, సతీష్‌, చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *