Permanent Fix for Water Problem
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
గేటువాల్వ్ ఏర్పాటు చేసిన కౌన్సిలర్ వెంకటస్వామి
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని హనుమాన్ ఆలయం వెనుక,వారాలవాడ, సాకలి వాడ,ముస్లిం గల్లీలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంచినీటి సమస్యకు పరిష్కారం లభించింది.శనివారం 1వ వార్డు కౌన్సిలర్ దుబాసి వెంకటస్వామి చొరవతో మిషన్ భగీరథ గేటువాల్వ్ ఏర్పాటు చేశారు.గత పది సంవత్సరాలుగా నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ఏర్పాటుతో శాశ్వత ఉపశమనం లభిస్తుందని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటస్వామి మాట్లాడుతూ వార్డు ప్రజల క్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు.మున్సిపల్ కమిషనర్,ఏఈ సహకారం అందించగా,వారికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచినీటి సరఫరా సిబ్బంది సంతోష్,మున్సిపాలిటీ జవాన్ మంద మహేష్,స్థానికులు రవి,సురేష్,గాఫ్ఫర్,రమేశ్,వార్డు నాయకులు బొచ్చు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
