మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించిన
జిల్లా వైద్య అధికారి డాక్టర్ రజిత
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల మరియు వేములవాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును మరియు లోని పిఎస్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, అంబేద్కర్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను తనిఖీ నిర్వహించి మహిళా స్క్రీనింగ్ హెల్త్ క్యాంప్ ను పరిశీలించినారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని మున్సిపల్ శానిటేషన్ మహిళ సిబ్బంది, స్వయం సహాయక మహిళా సిబ్బందిని ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య రక్షణలో తన బాధ్యతగా క్యాన్సర్ సంబంధిత రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు దీర్ఘకాల వ్యాధుల( మధుమేహం, రక్తపోటు) పై ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాల్సిందిగా అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డిపిఓ రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.