దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలన్నారు. యువత డ్రగ్స్ కు బానిసలు కాకూడదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, నేటి యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ సహకరించాలన్నారు.