Sarpanch Focuses on Village Development
గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా : సర్పంచ్ శశివర్ణ
బాలానగర్ /నేటి ధాత్రి.
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని గుండేడు గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శశివర్ణ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న వార్డులను పరిశుభ్రంగా మార్చినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని.. పరిశుభ్రతను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
