ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే చెరువుల కబ్జాలను బట్ట బయలు చేస్తాం:సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యం శ్రీరంగం

కూకట్పల్లి ఏప్రిల్ 19 నేటి ధాత్రి ఇన్చార్జి

మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో తన గెలుపు తద్యమని మల్కాజ్ గిరి పార్ల మెంటు కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేంద ర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం కూకట్పల్లి నియో జకవర్గంలోని కె.పి.హె చ్.బి.కాలనీలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ముందుగా వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్ఐ జిఫ్లాట్స్ లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గమాజీ అ ధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాల యాన్ని సునీత మహేందర్ రెడ్డి ప్రారం భించారు.అనంతరం హౌసింగ్ బోర్డ్ ఫంక్షన్ హాల్లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ …కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుంది అన్నారు.భవిష్యత్తులో ఇంది రమ్మ కమిటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలకు న్యాయం జరుగుతుందన్నా రు.తనను నాన్ లోకల్ అంటున్నారని అసలు సిసలైన లోకల్ అ భ్యర్థిని తానే నని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *