నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)
మండలములోని అంబాలా గ్రామములో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయములో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.శనివారం పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమములో హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి,ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు,కరీంనగర్ పార్లమెంటరీ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లీ వినోద్ కుమార్ లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.పండితులు వేద ఆశీర్వచనం చేశారు,తీర్థ ప్రసాదాలు అందజేశారు.