ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

*బిఎస్ఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలంలో ఈనెల 30వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొప్పుల, ప్రగతి సింగారం, నేరేడుపల్లే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా గ్రామాలలో బిఎస్ఎఫ్ బలగాలు, మండల పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమానికి సిఐ మల్లేష్ హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని ప్రజలకు సూచించారు.ఈఎన్నికలను శాంతియుత వాతావరణంలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడమే లక్ష్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ లు మండలంలో అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు కీలకపాత్రను పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి గొడవలకు పాల్పడకుండా,భయాందోళనలకు, అవాంఛనీయ సంఘటనకు, ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ దేవేందర్, పోలీస్ సిబ్బంది, బిఎస్ఎఫ్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *