ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి మాదిగ
భూపాలపల్లి నేటిధాత్రి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భూపాలపల్లి జిల్లా వస్తున్నారని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా ఇంచార్జి అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించ వేల గొంతులు లక్ష డప్పుల సభను విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేడు వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ జిల్లా పర్య టన స్థానిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పర్య టన ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1 గంటల సమయానికి మంద కృష్ణ మాదిగ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారని, పత్రికా, మీడియా మిత్రులు గమనించగలరని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎమ్మెస్ ఎఫ్, ఎంజెఎఫ్ అన్ని అనుబంధ సంఘాల జిల్లా నాయకులు మండలాల స్థాయి నాయ కులు గ్రామాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని అంబాల చంద్రమౌళి కోరారు.