భూపాలపల్లి నేటిధాత్రి
యాదగిరిగుట్ట
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు వేదాశీర్వచన మండపంలో ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.