New Sarpanch Keeps Promise, Solves Water Issue in SC Colony
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నూతన సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని జిర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి ప్రచార సమయంలో ఎస్సీ కాలనిలోకి వెళ్ళాడు. అక్కడ కాలనీవాసులు తాగునీటి సమస్య ఉందని ఆయనకు వివరించారు. మీ సమస్యను తీరుస్తానని మాట ఇచ్చాడు. ఆయనను ప్రజలు దీవించి భారీ మెజార్టీతో జిర్లపల్లి సర్పంచ్ గా గెలిపించి సర్పంచ్ పగ్గాలు అప్పజెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం.. గెలిచిన తన సొంత నిధులతో బోర్ పెట్టించారు. ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీర్చిన సర్పంచ్ అమరేశ్వరి శివమణి పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ రాజశేఖర్ నాయకులు వెంకట్ రెడ్డి, మధు సుదన్ రెడ్డి, అనీ ఫ్, జాకీర్, బిచయ్య, నవీన్, భరత్, రాజు,ఆశీర్వాదం, యేసు, సురేందర్, వసంత్, రహి మొద్దీన్,వెంకట్, తదితరులు పాల్గొన్నారు,
