మన్మోహన్ సింగ్ చేసిన చట్టాలే.. నేటి దేశ అభివృద్ధికి పునాదులు.

కల్వకుర్తి / నేటి ధాత్రి.

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటని, దేశం ఒక గొప్ప ఆర్థిక మేధావిని కోల్పోయిందని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. 1991 నుండి 96 సంవత్సరం వరకు ఆర్థిక మంత్రిగా కొనసాగిన సమయంలో ప్రపంచీకరణ సరళీకరణ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి దేశ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు శానవాజ్ ఖాన్, ఎజస్, గోరటి శ్రీనివాసులు, రవి, బాలు నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, నాయకులు పడకంటి వెంకటేష్, చంద్రకాంత్ రెడ్డి, పుస్తకాల రాహుల్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!