Suspicious Death Mystery
అనుమానస్పద స్థితిలో యువకుని మృతదేహం.
హత్య జరిగిన ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్
కోదాడ, నేటి ధాత్రి:
మండలం పరిధిలోని గణపవరం గ్రామ శివారులో యువకుని మృతుదేహం పడి ఉన్నదని సమాచారం రాగా కోదాడ రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. మృతుడు గణపవరం గ్రామానికి చెందిన బల్గూరి గణేష్ గా గుర్తించడం జరిగినది. యువకుని హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్, కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణా రెడ్డి తో కలిసి పరిశీలించారు. మృతుని యొక్క వివరాలను స్థానికులను, పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. హత్య గల కారణాలను ఛేదించి నేరానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన పట్టుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి తెలిపినారు. ఘటన స్థలంలో క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ టీం, డాగ్ స్క్వాడ్ టీం సిబ్బంది ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేసి త్వరితగతిన కేసు ఛేదించి నేరస్థులను పట్టుకుంటాం అని ఎస్పి తెలిపారు. ఎస్పి వెంట కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, క్లూస్ టీమ్ ఇన్స్పెక్టర్ నవీన్, ఎస్సై లు నవీన్, పరమేష్, గోపాల్ రెడ్డి, క్లూస్ టీమ్ సిబ్బంది ఉన్నారు.
