పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు.

పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు…

 

పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025)లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలో జరిగింది. ఇది ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మధ్య ప్రస్తుతం వాడీవేడి చర్చ కొనసాగుతోంది.
పట్నాయక్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version