పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు.

పూరీ రథయాత్ర దుర్ఘటన ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు…

 

పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025)లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలో జరిగింది. ఇది ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మధ్య ప్రస్తుతం వాడీవేడి చర్చ కొనసాగుతోంది.
పట్నాయక్ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య  పాల్గొన్నారు

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి.

డి ఎస్ పి జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ మహారాజ్.

చిట్యాల, నేటిధాత్రి :

 

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో ధర్మ సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ వి శారదన్ మహరాజ్ లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ బీసీ,ఎస్సీ,ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ & ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీల సంయుక్ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున పదివేల కార్లతో అదిలాబాదులో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా నుండి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు,విద్యార్థి సంఘాల నాయకులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్, జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్, చిట్యాల మండల అధ్యక్షులు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి, నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టే వాడ కుమార్, నవాబ్ పేట గ్రామ అధ్యక్షులు చిలుముల శశి కుమార్,గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణ మరియు బొడ్డు పాల్ చరణ్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version