లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ
జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య పాల్గొన్నారు