దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు.!

దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహకం పట్ల హర్షం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకం తో పాటుగా ఒక లక్ష రూపాయలు అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార జీవో ను అమలుచేసి దివ్యాంగులకు తీపి కబురు అందించడం పట్ల తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వసీమ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .గత ప్రభుత్వ పాలనలో వికలాంగుల వివాహానికి సకలాంగులు వికలాంగులను వివాహమాడితే లక్ష రూపాయల వివాహ ప్రోత్సాహక పురస్కారం అందించేది.నేడు కాంగ్రెస్ ప్రజా పాలన లో సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పై దృష్టి సారించి సకలాంగులు వికలాంగులను పెళ్లి చేసుకుంటే ఒక లక్ష రూపాయల అదనపు వివాహ ప్రోత్సాహక పురస్కార పథకంను మార్చేసి ఇద్దరు దివ్యాంగులు వివాహమాడిన కూడా దివ్యాంగులకు కల్యాణ లక్ష్మి పథకంతో పాటుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం జీవో ప్రకారం ఒక లక్ష రూపాయలు వికలాంగులకు అమలుపరుస్తూ జీవో జారీ చేసిందన్నారు.ఇద్దరు దివ్యాంగుల వివాహానికి ఆర్థిక అండదండలుగా వివాహ ప్రోత్సాహక పురస్కారం తరపున ఒక లక్ష రూపాయలు దివ్యాంగులకు ఇచ్చి జీవో అమలుపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల ఆత్మ బంధువు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు అన్నారు..

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ.

లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర కరపత్ర ఆవిష్కరణ

జిల్లా ప్రధాన కార్యదర్శి కండి రవి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ లో జరగబోయే సభకు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నుండి బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజాస్వామిక ప్రజలు వివిధ కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గణపురం మండల కన్వీనర్ కుర్రి స్వామినాథన్, గాంధీనగర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇంజిపెల్లి విక్రం, సాగర్, పవన్, సాంబయ్య  పాల్గొన్నారు

లక్ష రూపాయల చెక్కు అందించిన.!

లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్

జహీరాబాద్. నేటి ధాత్రి:

మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా,ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి జహీరాబాద్ టౌన్ ముహమ్మద్ రఫీ ముహమ్మద్ వాజిద్, ఏఐఎంఐఎం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు దగ్వాల్, షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్, ముహమ్మద్ యూనస్ రజా ఏఐఎంఐఎం అధ్యక్షుడు కృష్ణపూర్, ఇమ్రాన్ అబ్దుల్ గఫర్, అజీమ్ పటేల్, మల్లేష్ ముహమ్మద్ అన్వర్ మరియు మాద్రి గ్రామ పంచాయతీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version