అద్రాస్ పల్లి లో ఎన్నికల ప్రచారం…

అద్రాస్ పల్లి లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరడం వేస్తామని. మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు అభ్యర్థి నాగేష్, 23వ వార్డు ప్రభాకర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్, సంజీవ, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, శ్రీపతి, నర్సింలు, భాస్కర్, సంజీవ, మాజీ కార్పొరేటర్ సాయికుమార్, విజయ్ వెంకటేష్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version