డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం…

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోధనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటిదాత్రి చర్ల

చర్ల మండలంలోని సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బోధనెల్లి గ్రామంలో డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ
గ్రామంలోని ఇంటింటికి రాపిడ్ ఫీవర్ సర్వే చేస్తూ డ్రై డే కార్యక్రమాలు చేయించడం జరిగింది
జ్వరాలు వస్తే ఆశ్రద్ధ చెయ్యకుండా పి హెచ్ సి రావలెను మరియు అన్ని పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి అని గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు
అలాగే వర్షాకాలం కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
నీళ్లు నిల్వలేకుండా చూసుకోవలని
దోమ తెరలను వినియోగించుకోవాలని
ఎల్లపుడు పరిశుభ్రమైన నీటిని తీసుకోవాలని అన్నారు
గర్భిణి స్త్రీలను పరీక్షించి అవసరమైన పరీక్షలు చేశారు
ముగ్గురికి జ్వరం ఉన్నది వారికి ఆర్డిటీ మలేరియా పరీక్షలు చెయ్యడం జరిగింది వారికి మలేరియా లేదని వారికి మాములు జ్వరంగా నిర్దారించి మందులు ఇవ్వడం జరిగింది
మరియు 32 మందికి సాధారణ వ్యాధులకు మందులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో
హెచ్ ఈ ఓ బాబురావు
ఎం ఎల్ హెచ్ పి సంధ్య
ఏఎన్ఎమ్ కవిత
హెల్త్ అసిస్టెంట్ వరప్రసాద్
ఆశా కార్యకర్తలు
తదితరులు పాల్గోన్నారు

నేటి విద్యాలయాలు అభివృద్ది..

నేటి విద్యాలయాలు అభివృద్ది.. భవిష్యత్తు దేశాభివృద్ధి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/నేటి ధాత్రి

విద్యాలయాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వికలాంగుల, వయోవృద్ధుల మరియు ట్రాన్స్ జెండర్స్ వ్యక్తుల సాధికారత శాఖ ద్వారా రూ.69 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ మరియు గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ పాఠశాల లో చదివి ఈరోజు జీవితంలో స్థిరపడిన హరీష్ నాకు పాత మిత్రుడని హరిష్ తో పాటు ఈ పాఠశాల లో చదివి జీవితంలో స్థిరపడ్డ వారి మాదిరిగానే మీరు మంచిగా చదువుకొని మీరు కూడా జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆత్మన్యూనత భావం నుంచి ఆత్మవిశ్వాసానికి ఎదగడానికి మీరందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. వ్యతిరేక ఆలోచనలు చేయరాదని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో ఏమైనా అభివృద్ధి పనులు కావాలంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. అంతకుముందు అంధుల ఆశ్రమ పాఠశాల లో చదివి వివిధ ప్రభుత్వ ప్రైవేటు శాఖలో ఉద్యోగాలు సాధించి జీవితం లో స్థిరపడిన పలువురు పూర్వపు విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షులు గంజి ఆంజనేయులు, రాములు యాదవ్, రమేష్ యాదవ్, ఏసు దాస్ , రఘురామిరెడ్డి ,తిరుమల వెంకటేష్, పాపారాయుడు, రాజు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version