: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..

: తానా ఆధ్వర్యంలో విజయవంతంగా పికిల్ బాల్ టోర్నమెంట్..

 

పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.

న్యూ ఇంగ్లాండ్‌లో భాగమైన బోస్టన్‌లో పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్‌ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు. ఓడిన ప్రతి సారి, ఓటమి నుంచి నేర్చుకుంటూ, సరిదిద్దుకుంటూ జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి క్రీడాకారులకు వివరించారు.
మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాలలో 28 జట్లు పాల్గొన్నాయి. ఈ ఈవెంట్ ఐదు గంటలకు పైగా కొనసాగింది. 120 మందికి పైగా ఆటగాళ్లు అసాధారణ నైపుణ్యం, జట్టుకృషి, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. విజేతలు, రన్నర్లకు ట్రోఫీస్, షీల్డ్స్ సోర్స్ గ్రూప్ అఫ్ కంపెనీస్ అధినేత శ్రీ బోళ్ల బహుకరించారు. వాలంటీర్స్ రవి ఉప్పలపాటి, అనిల్ గోవాడ, గోపి నెక్కలపూడి, తిర్బు పారుపల్లి, వేణు కూనంనేని, సురేష్ దోనేపూడి టోర్నమెంట్ సజావుగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version