తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ పకడ్బందీగా అమలు చేయాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. దిగ్వల్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం రాయడం చదవడంతో పాటు గుణింతాలు పూర్తిస్థాయిలో చేసేలా చూడాలని చెప్పారు.