క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు…

క్షేత్ర దినోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించిన వ్యవసాయ అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

 

రైతు స్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు రైతులకు, పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం (క్వాలిటీ సిడ్ ఇన్ ఎవ్రి విలేజ్-క్యూఎస్ఈవి) అనే కార్యక్రమo ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో వరి (జేజిఎల్ – 24423) పొలంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి అనే రైతు తన అనుభవాన్ని, జేజిఎల్-24423 రకంలో విత్తనోత్పత్తి గురించి తను తీసుకున్న జాగ్రత్తలను తోటి రైతులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ ప్రధాన శాస్త్రవేత్త డా.బి. రాంప్రసాద్ మాట్లాడుతూ రైతు స్థాయిలో విత్తనోత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వరిలో పురుగుల, తెగుళ్ళ యాజమాన్యం గురించి వివరించిన అనంతరం శాస్త్రవేత్తలు డా.జి.ఉషారాణి, ఇ.ఉమారాణిలు మాట్లాడుతూ విత్తనోత్పత్తి క్షేత్రాల్లో బెరుకుల తీసివేత గురించి తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్, ఇతర రైతులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది రైతులు స్వయంగా ఉత్పత్తి చేసిన ఇదే విత్తనాన్ని రానున్న పంట కాలానికి వినియోగీస్తామని వారి సుముఖతను అధికారులకు తెలియజేశారు.

కంది,వరి పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు…

కంది,వరి పంటలను సందర్శించిన శాస్త్రవేత్తలు

యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచనలు

పరకాల,నేటిధాత్రి

 

 

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం అనే కార్యక్రమంలో భాగంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్.ఎల్.కృష్ణ,శాస్త్రవేతలు డాక్టర్ భార్గవి,డాక్టర్.పద్మజ
ల బృందం శుక్రవారం నాడు పరకాల క్లస్టర్ మాదారంలో గల వరి,కందుల పంటలను సందర్శించడం జరిగింది.ఈ సందర్బంగా పలువురు శాస్త్రవేత్తలు రైతులకి వరి మరియు కంది పంటలో విత్తనోత్పత్తిలో చేపట్టవలసిన మెలకువల గురించి మరియు సేంద్రియ ఎరువులు వాడకం పెంచుకుని యూరియా వాడకాన్ని తగ్గించాలని రైతుల కి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పరకాల క్లస్టర్ మాదారం విస్తరణ అధికారి శైలజ,రైతులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన..

నాణ్యమైన విత్తనాలు విత్తనాలను సందర్శించిన మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని కప్పాడ్ గ్రామంలో పలు పంటలను వ్యవసాయ అధికారి వెంకటేశ్ సందర్శించడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో నాణ్యమైన విత్తనాలు సంబంధించిన పెసర పంటను సందర్శించడం జరిగింది ప్రస్తుతం పెసర పంట 60 రోజుల దశ లో ఉంది దీనికి పోతదశలో ముఖ్యంగా పోషకాల లోపం లేకుండా 19:19:19 ఒక కిలో ఎకరానికి మరియు పత్తి. పంటను సందర్శించడం పంటల దిగుబడికి విడతల వారిగా కాంప్లెక్స్ ఎరువులు
మరియు ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించాలి నానో యూరియా స్ప్రే చేసుకోవాలి ఇందులో వ్యవసాయ విస్తరణ అధికారి హరి కృష్ణ, రైతులు రమేష్, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు.

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు

విత్తన స్వయం సమృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం :

ఎమ్మెల్యే కాలే యాదయ్య

శంకరపల్లి, నేటిధాత్రి :

 

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పథకం కింద రైతులకు ఉచితంగా కంది విత్తనాలు (మినీ కిట్స్ – చిరు సంచులు)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించి, స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. నకిలీ విత్తనాల అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version