గృహ జ్యోతి పథకం రెండేళ్లలో ప్రతి ఇంటికి లబ్ది
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంక్రాంతి పండుగ ముందర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చేసిన మంచి పనిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నదని.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద వినియోగించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఈ డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఝరాసంగం మండల కేంద్రంలో లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన లేఖలను లైన్మెన్లు కిరణ్, యూనూస్ అందజేశారు.
